NZB: నగరంలో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతిని ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని ఆయన విగ్రహానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీసీ సంఘం నాయకులు, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జ్యోతిబా ఫూలే ఆశయాలను గౌరవిస్తూ ప్రభుత్వం అనేక పథకాలను ఆయన పేరు మీద నిర్వహిస్తోందని పేర్కొన్నారు.