విజయనగరం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మహాత్మ జ్యోతీరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఆధ్వర్యంలో పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహిళలు, వితంతువులు, అణగారిన వర్గాల్లో హరించబడిన మానవ హక్కులు కొరకు పూలే పోరాటం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.