ELR: పేద విద్యార్ధుల విద్యాభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేసి చేయూతనివ్వాలని MLC జయమంగళ వెంకటరమణ తెలిపారు. ఓ ట్రస్ట్ ఛైర్మన్ అట్లూరి భవాని ప్రసాద్ ఆర్థిక సహకారంతో మండలంలోని పులపర్రుకు చెందిన బీటెక్ విద్యార్ధిని జాహ్నవికి MLC జయమంగళ వెంకటరమణ లాప్ టాప్ బహుకరించారు. విద్యార్ధులు, గ్రామస్థులకు సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు.