W.G: భీమవరం పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో యనమదుర్రు ట్రైన్ వంతెన కింద ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక శకటంతో పాటు సిబ్బంది చేరుకొని మంటలను నియంత్రణలోకి తెచ్చారు. అగ్నికీలలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ వ్యాపించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.