ప్రకాశం: కొండపి (M) నేతివారి పాలెం పంట పొలాల్లో పేకాట శిబిరంపై ఆదివారం స్థానిక పోలీసులు దాడి చేసి 8 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 49,320, 8 బైకులు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. చట్ట వ్యతిరేక కార్యకాలానికి ఎవరు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై త్యాగరాజు హెచ్చరించారు.