ASR: పాడేరు ఐసీడీఎస్ ఆఫీస్ వద్ద అంగన్వాడీలు సోమవారం రిలే నిరాహార దీక్షకు దిగారు. రూ.26వేల కనీస వేతనం, 1810 మినీ కేంద్రాల అప్గ్రేడేషన్, గ్రాట్యుటీ మార్గదర్శకాలు, వేతనంతో కూడిన మెడికల్ లీవ్స్తో పాటు రూరల్, అర్బన్ తేడాలేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.