విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ మహిళా విభాగం ఆత్మీయ సమావేశం సోమవారం నిర్వహించారు. రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మల్ల ధనలత ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయ ప్రసాద్, మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొన్నారు. కమిటీల నిర్మాణం త్వరగా పూర్తి చేసి వార్డు స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలు తెలిపారు.