MNCL: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శనివారం వేమనపల్లి మండలం సూరారం గ్రామపంచాయతీలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని MLA ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలన అందించే విధంగా ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు.