ASR: డుంబ్రిగూడ మండలం పనసపుట్ గ్రామంలో కిషన్ కాంగ్రెస్ 90వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పాంగి గంగాధర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు వంతల ఆనందరావును కాంగ్రెస్ శ్రేణులు సన్మానించారు. అనంతరం పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని గంగాధర్, గ్రామస్తులు డిమాండ్ చేశారు.