TG: కామారెడ్డి జిల్లా గొల్లవాడలో ఐఫోన్ పేరిట రూ.1.05 లక్షల లూటీ జరిగింది. జాహెద్ అనే వ్యక్తి ఐఫోన్ కొనాలని ఆన్లైన్లో వెతికాడు. నిందితుడు జాహెద్కు ఫోన్ చేసి ఐఫోన్ ధర చెప్పి నగదు బదిలీ చేయాలన్నాడు. దీంతో రూ.1.05 లక్షలు బదిలీ చేశాడు. ఆ తర్వాత ఎలాంటి సమాధానం లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.