E.G: రాజమండ్రి సిటీ 46వ డివిజన్లో మంగళవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించారు. మహిళలు తమ సమస్యలను విన్నవించారు. రాత్రి వేళల్లో అల్లరి మూకల ఆగడాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే విద్యార్థులు, మహిళల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు నైట్ బీట్ పెంచాలని ఆదేశించారు.