కృష్ణా: మచిలీపట్నంలో సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ నవీన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో ప్రజల సౌకర్యం కోసం సత్య సాయి సేవ సమితి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చలివేంద్రంలో మంచినీటితో పాటు మజ్జిగ కూడా పంపిణీ చేయడం చాలా సంతోషదాయకమన్నారు.