సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి వాహిని సుధామృత కార్యక్రమం ఘనంగా జరిగింది. భగవాన్ బాబా రచించిన 15 వాహినుల్లోని సనాతన ధర్మ సూత్రాలను అధ్యయనం చేసేందుకు 12 భాషల్లో ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు. మూడు ఏళ్లుగా సాగుతున్న ఈ కోర్సులో 106 పాఠ్యాంశాల ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని భక్తులకు అందిస్తున్నారు.