TPT: తిరుమలలో భక్తుల కోసం టీటీడీ విస్తృత వైద్య ఏర్పాట్లు చేసింది. అశ్వనీ ఆసుపత్రి ప్రధాన కేంద్రంగా మొత్తం 16 వైద్య కేంద్రాల ద్వారా సేవలు అందిస్తోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో 24 గంటల వైద్యం అందుబాటులో ఉంది. అత్యవసర పరిస్థితుల కోసం 9 అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. భక్తుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ, ఎక్కడికక్కడ తక్షణ చికిత్స అందేలా టీటీడీ పక్కా చర్యలు చేపట్టింది.