సత్యసాయి: జిల్లా SP సతీష్ కుమార్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిని డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.