VKB: అప్పాయిపల్లి, రుద్రారం గ్రామాల్లో టీబీ ముక్త భారత్ అభియాన్లో భాగంగా ఉచిత ఎక్స్రే నిర్వహించారు. ఎక్స్రే తీయగా 20 మందికి అబ్నార్మల్ వచ్చినట్లు తెలిపారు. టీబీని నివారించేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని డిప్యూటీ DMHO, టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డా.రవీందర్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో డా. బుప్రా ఫాతిమా, అమృత, పకీరప్ప, మధుసుదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.