AP: ప.గో. జిల్లా నరసాపురం ఏరియా ఆస్పత్రిలో అరుంధతి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అద్దె బకాయి అడిగినందుకు అద్దెదారుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చేరిన ఆమె, అక్కడ బాత్రూమ్లో ప్రాణాలు తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేయకపోగా, ఎదురుగా తన భార్యపైనే దొంగతనం కేసు పెడతామని బెదిరించారని భర్త రాంబాబు ఆరోపిస్తున్నారు.