E.G: కర్నూలులో న్యాయవాది ఎం.పవన్ కుమార్పై 4వ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ, సిబ్బంది దాడి చేయడం హేయకరమని అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు ఘటనను నిరసిస్తూ సోమవారం సొసైటీ రాష్ట్ర ప్రతినిధులు, న్యాయవాదులు రాజమండ్రి సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. న్యాయవాదులు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.