BPT: బాపట్ల మండలం స్టువర్టుపురంలో నాటు సారాయి తయారీ చేస్తూ నలుగురు యువకులు పోలీసులకు చిక్కారు. గుప్త సమాచారం ఆధారంగా వెదుళ్లపల్లి ఎస్సై భాగ్యరాజ్ సారథ్యంలో జరిపిన దాడిలో శశిధర్ అలియాస్ జిమ్మీ, అనూష్ అలియాస్ తిలక్, సాయి చందు, నరసింహారావు అలియాస్ చింటూ అరెస్టయ్యారు. కుందేరు వాగు ఒడ్డున తయారుచేసిన మద్యాన్ని అమ్మేందుకు సిద్ధంగా ఉండగా పట్టుబడ్డారు.
ప్రకాశం: ఎర్రగొండపాలెం సర్కిల్ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఐ ప్రభాకర్ మాట్లాడుతూ.. కేసుల పరిష్కారంలో అలసత్వం వద్దని తెలియజేశారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధుల కేసులను త్వరగా పూర్తి చేయాలని సూచనలు జారీ చేశారు. అదేవిధంగా ఈ సమావేశంలో పుల్లల చెరువు, దోర్నాల, ఎర్రగొండపాలెం, పెద్దారవీడు ఎస్ఐలు పాల్గొన్నారు.
SKLM: కోటబొమ్మాలి మండలం హరిచంద్రపురం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జిఆర్పి ఎస్ఐ ఎస్.కే షరీఫ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అతని వయసు సుమారు 30 నుండి 35 సంవత్సరాల వరకు ఉంటుందని తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అన్నారు. ఏదైనా సమాచారం ఉంటే 9440627567 నెంబర్ను సంప్రదించాలని సూచించారు.
NDL: కూటమి ప్రభుత్వంలో చేనేతలకు స్వర్ణయుగం వచ్చిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. మంగళవారం బనవాసిలో టెక్స్టైల్ పార్క్ భూమిపూజ నిర్వహించి మాట్లాడారు. 175 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా భూమిపూజ నిర్వహించిన సందర్భంగా బనవాసిలో ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి భూమిపూజ చేశామన్నారు.
KDP: బ్రహ్మంగారి మఠం మండలంలోని శ్రీ జగద్గురు మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారిని ఆరాధన మహోత్సవాల సందర్భంగా PCC అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసిరెడ్డి మంగళవారం బ్రహ్మంగారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాల్గొన్నారు.
KDP: శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా తులసిరెడ్డి కనుమ పోలేరమ్మ తల్లిని దర్శించుకున్నారు. అమ్మవారికి జరిగిన ప్రత్యేక పూజల్లో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఆలయ అర్చకులు అమ్మవారి విశిష్టతను ఆయనకు వివరించారు. అనంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.
KDP: కడప జిల్లా చెన్నూరు మండలం నెలటూరుకు చెందిన శ్రీకాంత్ రెడ్డి యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో 151వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి మంగళవారం శ్రీకాంత్ రెడ్డిని అభినందించారు. శాలువాతో శ్రీకాంత్ రెడ్డిని సత్కరించి వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహూకరించారు.
అన్నమయ్య: సీఎం సహాయ నిధి పేదలకు వరమని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు. మంగళవారం ఓబులవారిపల్లె, రైల్వే కోడూరు, చిట్వేలు గ్రామాలకు చెందిన 5 మంది బాధితులకు రూ. 5,83,695 లక్షల విలువ గల చెక్కులను బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ బాసటగా సీఎం సహాయ నిధి నిలుస్తుందన్నారు.
KDP: చింతకొమ్మదిన్నె మండలం కోలుములపల్లె పంచాయతీ ఎన్టీపీసీ మద్దిమడుగు నర్సరీ ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డ్లో బయో రిమిడియేషన్- లెగసీ వెస్ట్- రిక్లయేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్యరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కమలాపురం కార్పొరేషన్ పరిధిలో నాలుగు లక్షల టన్నుల చెత్తను ప్రాసెస్ చేయనున్నట్లు తెలిపారు.
W.G: వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని ఎంఈవో ఎ.రవీంద్ర అన్నారు. సీసలి ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ను ఆయన మంగళవారం ప్రారంభించారు. విద్యార్థులు క్యాంపు ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, క్రాఫ్ట్ వంటి రకరకాల కళలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు.
VZM: విద్యార్థులు మాదక ద్రవ్యాలు వినియోగించి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ అన్నారు. మిమ్స్ మెడికల్ కళాశాల డీన్ లక్ష్మి కుమార్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. మిమ్స్ మొయిన్ గేట్ నుంచి నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించారు.
మన్యం: ప్రతీ ఆరోగ్య కార్యక్రమానికి సంబంధించి సర్వేను పక్కగా చేపట్టాలని వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్ మోహనరావు స్పష్టం చేశారు. మక్కువ, శంబర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన ఆశాడే కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో ఆరోగ్య సేవలు అందుతున్న తీరుపై, ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్షించారు.
KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసిలో మెగా టెక్స్ టైల్ పార్క్ నిర్మాణానికి ఇవాళ భూమి పూజ నిర్వహించారు. రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఫరూక్, రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్, బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖ మంత్రి సవితతో కలిసి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి భూమిపూజలో పాల్గొన్నారు. చేనేత రంగంపై ఆధారపడిన కార్మికులకు ఇది ఉపయోగకరమన్నారు.
KRNL: పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో ఆన్లైన్లో మోసాలకు పాల్పడే వారిపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్ట్ టైమ్ జాబ్ పేరుతో సోషల్ మీడియా ప్రకటన పట్ల జరుగుతున్న ఆన్లైన్ మోసాలకు భయపడకుండా, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మోసాల బారిన పడిన వారు వెంటనే డయల్ 1930కు కాల్ చేయాలని సూచించారు.
TPT: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రైతులకు వ్యవసాయ పనిముట్లు అందిస్తోందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. యర్రావారిపాలెం మండలంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. అనంతరం 50 మంది రైతులకు సబ్సిడీ రూపంలో పనిముట్లను అందజేశారు.