• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి జిల్లా అభివృద్ధికి పెద్దపీట..!

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 14.7 లక్షలతో రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనను సమావేశం ఆమోదించడం జరిగిందని ఉమ్మడి ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీ ఆదివారం తెలిపారు. ఏలూరులో జడ్పీ సమావేశం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.12.23 లక్షలతో సవరించిన బడ్జెట్‌ను ఆమోదించారు.

March 22, 2026 / 09:29 PM IST

జాబ్ క్యాలెండర్‌పై వైకుంఠం జ్యోతి హర్షం

KRNL: ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగాల క్యాలెండరు టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి స్వాగతించారు. ఇవాళ మాట్లాడుతూ.. CM చంద్రబాబు, యువనేత లోకేశ్ నాయకత్వంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని అన్నారు. ఉద్యోగాల క్యాలెండర్ విడుదలతో నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు నెలకొన్నాయని పేర్కొన్నారు.

March 22, 2026 / 09:23 PM IST

బయనపల్లెలో వైసీపీ సమావేశం..!

KDP: బద్వేల్ మండలం బయనపల్లెలో వైసీపీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి యువత సమావేశం జరిగింది. జిల్లా సేవాదళం అధ్యక్షుడు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని తెలిపారు.

March 22, 2026 / 09:21 PM IST

సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్

ASR: డుంబ్రిగూడ(M) అమలగూడలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సీపీఎం మండల నాయకులు, గసబ పంచాయతీ మాజీ సర్పంచ్ పాంగి సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం గ్రామాన్ని సందర్శించి మాట్లాడుతూ.. సొవ్వ పంచాయతీ దేముడు వలస జంక్షన్ నుంచి అమలగూడ వరకు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. గతంలో కొంత మేర రోడ్డు నిర్మించి మిగతా భాగం వదిలేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

March 22, 2026 / 09:11 PM IST

‘టీడీపీ ప్రభుత్వం నగరిని నిర్లక్ష్యం చేసింది’

CTR: గత ప్రభుత్వ హయాంలో కరోనా కాలాన్ని మినహాయిస్తే మూడేళ్ల పాటు నగరిని ఎంతో అభివృద్ధి చేశారని మాజీ మంత్రి రోజా చెప్పారు. తన నివాసంలో పుత్తూరు మున్సిపల్ కార్యవర్గ సభ్యులకు ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు నగరిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

March 22, 2026 / 09:09 PM IST

రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల వేదిక

TPT: జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 23న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ అర్జీలను సమర్పించి సమస్యలకు పరిష్కారం పొందాలని కోరారు. Meekosam వెబ్‌సైట్,1100 ద్వారా కూడా ఫిర్యాదుల స్థితి తెలుసుకోవచ్చన్నారు.

March 22, 2026 / 09:05 PM IST

జిల్లా వ్యాప్తంగా పోలీసుల ముమ్మర వాహన తనిఖీలు

కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. అమలాపురం పట్టణంలో ప్రధాన కూడళ్లలో ఎస్సైలు తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

March 22, 2026 / 09:00 PM IST

నూతన షెడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR: చందర్లపాడు మండలం కోనాయిపాలెంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వరకుమార్ ఆధ్వర్యంలో సీఎస్ఐ చర్చిలో నిర్మించిన నూతన షెడ్డును ఆదివారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ఎంతో అభినందనీయమని అన్నారు.

March 22, 2026 / 09:00 PM IST

రేపు అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన

BPT: మంత్రి గొట్టిపాటి రవికుమార్ 23న అద్దంకిలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, 10:30కు మున్సిపల్ కార్యాలయంలో దివ్యాంగులకు ఉచిత స్కూటీల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు చిలకలూరిపేట క్యాంపు కార్యాలయం వివరాలు వెళ్లడించింది.

March 22, 2026 / 09:00 PM IST

రూ.1.50 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభం

CTR: బొమ్మసముద్రంలో రూ.1.50 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీ మోహన్ ప్రారంభించారు. గ్రామం మోడల్ పంచాయతీగా మారుతుందని తెలిపారు. గ్రామంలో గోకులం షెడ్లు, సిమెంట్ రోడ్లు, పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, ఆరోగ్య కేంద్రం వంటి అభివృద్ధి పనులను ప్రారంభించారు.

March 22, 2026 / 08:57 PM IST

‘పనులు సకాలంలో పూర్తి చేయాలి’

SKLM: పలాస మున్సిపాలిటీ పరిధిలోని ముత్యాలమ్మ కోనేరు అభివృద్ధి పనులను ఆదివారం సాయంత్రం ఏపీటీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు పరిశీలించారు. పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను సూచించారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే గౌతు శిరీష కృషి అభినందనీయమని కొనియాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

March 22, 2026 / 08:53 PM IST

డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు తనిఖీలు

KRNL: మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పెద్దకడబూరు ఎస్సై మారుతి హెచ్చరించారు. ఆదివారం మండలంలోని కంబళదిన్నె గ్రామ శివారులో కోసిగి రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేకంగా తనిఖీలు చేసి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

March 22, 2026 / 08:43 PM IST

రేపు జిల్లా వాప్తంగా ‘PGRS’ కార్యక్రమం

W.G: భీమవరం కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు స్వయంగా వచ్చి అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1,100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

March 22, 2026 / 08:43 PM IST

మానసిక ఆరోగ్యం పై వర్క్ షాప్..!

అన్నమయ్య: వయోవృద్ధుల మానసిక ఆరోగ్యం పై మదనపల్లెలో నేడు ఓ స్వచ్ఛంద సేవా సంస్థ వర్క్ షాప్ నిర్వహించారు. డాక్టర్ ముని గోపాలకృష్ణ మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో మానసిక ఆరోగ్యం, ప్రశాంతత అవసరమని సూచనలు చేశారు. అలాగే వృద్ధులు మనోధర్యం కలిగి ఉండాలని ధైర్యం చెప్పారు. వృద్ధులు చిన్నపిల్లలతో సమానం అని వారిని పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు.

March 22, 2026 / 08:34 PM IST

శ్రీముఖలింగంలో విశ్రాంతి భవనం ఏర్పాటు

SKLM: ఎట్టకేలకు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగాన్ని దర్శించే వేలాదిమంది భక్తులకు విశ్రాంతి భవనం ఏర్పాటు చేసినట్లు కార్యనిర్వహణ అధికారి ఏడుకొండలు ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ ప్రసాద్ రాములు తెలిపారు. భక్తులకు గదులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 22, 2026 / 08:34 PM IST