పార్వతీ పురం జగన్నాధపురంలోని జనావాసాలకు అనుకొని మార్కెట్ యార్డ్లో జీడి పిక్కల క్రాసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఐటీడీఏ అధికారులు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని సీపీఎం నాయకులు గొర్లె వెంకట్రమణ, పాకల సన్యాసిరావు డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ.. కొమరాడ గరుగుబిల్లి మండలాలు రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు 1974లో ఇది నియమించారు అన్నారు.
NLR: నేటి నుంచి 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలలో భాషల పండుగ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 345 పాఠశాలలో ఎంపిక చేసిన భాషల వకృత్వ, వ్యాసరచన, కథలు చెప్పడం, రాయడం, చర్చా వేదికలు, సెల్ఫ్ చెక్, పాటలు పాడడం, డాన్సులు వేయడం, బోధనోపకరణాల తయారీ వంటి అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
KRNL: అగ్రికల్చర్ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ సొసైటిలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మించి వెంకటాపురంకు చెందిన శేఖర్, సుధాకర్లు రూ.3.50 లక్షల తీసుకొని మోసం చేశారని బేతపల్లి గ్రామంకు చెందిన రాజశేఖర్ సోమవారం జిల్లా SP విక్రాంత్కు ఫిర్యాదు చేశారు. అలాగే రూ.2.80 లక్షలు తీసుకొని నకిలీ ఇళ్ల పట్టాలు ఇప్పించి రమేష్ అనే వ్యక్తి మోసం చేశాడని నరసింహులు ఫిర్యాదు చేశారు.
VZM: సాలూరు పట్టణంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం 25వార్డు రోడ్డు పక్కన ఉన్న చెత్తను మున్సిపల్ శానిటరి అధికారి పర్యవేక్షణలో జేసీబీతో తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు చెత్తను రోడ్డుపై వెయ్యకుండా చెత్త బుట్టలు వినియోగించాలని కోరారు. తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా ఉంచి, చెత్త కుండీలలో వెయ్యాలన్నారు.
KRNL: జిల్లాలో గ్రూపు-2 మెయిన్స్ పరీక్షల పకడ్బందీ ఏర్పాట్లపై APPSC జిల్లా కోఆర్డినేటర్, జేసీ డాక్టర్ బి. నవ్య సోమవారం కలెక్టరేట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని, లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఆలయ ఈఓ బాపిరెడ్డి శ్రీకాళహస్తి 12వ అడిషనల్ డిస్ట్రిక్ జడ్జి శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియను మర్యాదపూర్వకంగా కలిశారు. బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానం పలికారు.
NLR: తోటపల్లి గూడూరు మండలం పేడూరులో బీపీసీఎల్ పైప్ లైన్ నిర్మాణంతో పంట పొలాలు ధ్వంసం అయినట్లు స్థానికులు ఆదవేదన వ్యక్తం చేశారు. ఈ పొలాలను సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. పంట చేతికి వచ్చే సమయంలో ధ్వంసం చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి కోతలు పూర్తయ్య వరకు పనులు నిలిపివేయాలని MLA నిర్వాహకులను కోరారు.
NLR: మద్దతు ధర కోల్పోయిన రైతులకు, ధాన్యం సేకరించడంలోనూ తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన వ్యవసాయ శాఖ సహాయ డైరెక్టర్ నర్సోజికి వినతిపత్రం సమర్పించారు. మద్దతు ధర లేక రైతులు తమ పంటలను నష్టానికి అమ్ముకుంటున్నారని అన్నారు. అధికారులు స్పందించాలని కోరారు.
KRNL: డీఈవో శ్యామ్యూల్ పాల్ను చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో సోమవారం కర్నూలులో జరిగిన ప్రజా గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ కొంత మంది ఉపాధ్యాయులను డిప్టేషన్ల పేరుతో జిల్లా కార్యాలయానికి తిప్పుకుంటున్నారని తెలిపారు. దీంతో ఉపాధ్యాయులు పాఠశాల విధులకు డుమ్మా కొడుతున్నారన్నారు.
NDL: శ్రీశైల భ్రమరాంబ దేవికి కృష్ణా జిల్లాకు చెందిన ఎం.రామచంద్రరావు కుటుంబసభ్యులు బంగారుపూత కలిగిన మకరతోరణాన్ని సమర్పించారు. 250 గ్రాముల బరువుగల ఈ మకరతోరణం విలువ సుమారు రూ. 24,45,000/- అని దాతలు పేర్కొన్నారు. మకరతోరణాన్ని దాతలు ఆలయ అధికారులకు నేరుగా అందజేశారు. దాత కుటుంబాన్ని స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేసి సత్కరించారు.
ATP: పామిడిలోని పోలీస్ స్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ను గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోమవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు మార్కెట్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
PLD: నటుడు శివాజీ ఆసక్తి ఉన్న యువతను సినీరంగంలో ప్రోత్సహించడం చాలా గొప్ప విషయమని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం ఆయన నటుడు శివాజీ స్వగ్రామం గొరిజవోలులో శివాజీ ప్రొడక్షన్స్-2 బ్యానర్ పై నిర్మిస్తున్న నూతన చిత్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో వారంపాటు జరిగే చిత్రీకరణకు తగిన సహాయసహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే చెప్పారు.
ATP: పౌర సరఫరాల గోదాములో స్టాక్ వివరాలకు సంబంధించిన రిజిస్టర్లను గోదాము ఇంచార్జ్ ఎప్పటికప్పుడు నవికరుస్తూ ఉండాలని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ సిబ్బందికి ఆదేశించారు. సోమవారం రాయదుర్గం పట్టణ కేంద్రంలోని పౌరసరఫరాల గోదామును జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.
CTR: పుత్తూరు మున్సిపాలిటీ తిమ్మాపురం శ్రీశ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి వారి దేవాలయంలో సోమవారం కుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ హాజరయ్యారు. ఆయన ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.