కృష్ణా: జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో పెదపారుపూడి ఎస్ఐ ఆర్. శ్రీధర్ వానపాముల జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. శక్తి టీమ్-2 సభ్యులతో కలిసి సైబర్ నేరాలు, గంజాయి వినియోగం వల్ల కలిగే నష్టాలు మరియు ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆపద సమయంలో డయల్ 100ని ఆశ్రయించాలని సూచించారు.