KRNL: ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో ఇటీవల విధుల్లో చేరిన 12 మంది పారిశుద్ధ్య కార్మికుల పేర్లను మూడు నెలలు గడిచినా ఆప్కాస్లో ఆన్లైన్ చేయలేదని AITUC నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కార్మికులతో కలిసి జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. తక్షణమే పేర్లు ఆన్ లైన్ చేసి, మూడు నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు.