SKLM అంగన్వాడీల వేతనాల పెంపు, ఐసీడీఎస్కు బడ్జెట్ పెంపు కోరుతూ మార్చి 2న జరిగే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. సోమవారం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వర రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.