VSP: మధురవాడ ఐటీ రోడ్డులోని శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజు తెల్లవారుజాము నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని అర్చకులు సుబ్బారావు తెలిపారు. నమకం చమకం – మహన్యాస పూర్వక అభిషేకంతో ప్రారంభమై రుద్రాభిషేకం, అభిషేకాలు, లింగోద్భవ పూజలు ఉంటాయన్నారు. సోమవారం ప్రత్యేక అభిషేకాలు చేశారు.
CTR: పుంగనూరు పట్టణం పాత బస్టాండ్ సమీపానగల కొలువైయున్న శ్రీ విరుపాక్షి మారెమ్మ సోమవారం శివరూపిణి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. ఉదయాన్నే అర్చకులు అమ్మవారి శిల విగ్రహాన్ని ఫల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత వెండి ఆభరణాలతో పాటు వివిధ పుష్పాలతో శివరూపిణి అలంకారంలో తీర్చిదిద్దారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) పరిధిలో బీఏ(మల్టీమీడియా) కోర్స్ విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1, 3, 4,5 తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగ కంట్రోలర్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https:// www.nagarjunauniversity.ac.in/ వెబ్సైట్ చూడాలని సూచించారు.
ELR: చింతలపూడి మండలం బోయగూడెం గ్రామానికి చెందిన అక్కల రామచంద్రరావు అనే వ్యక్తి మోటార్ సైకిల్ కొన్ని రోజుల క్రితం అదే గ్రామంలో దొంగతనానికి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశారు. దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను భీమడోలు పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి 4 మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
VZM: IPL అంటేనే అదొక మజా. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లి నేరుగా మ్యాచ్ చూడలేని వాళ్లు టీవీలు, మొబైల్లో ఐపీఎల్ను ఆస్వాదిస్తారు. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ మ్యాచ్లను ఈ సీజన్లో విశాఖ ప్రజలు నేరుగా చూడవచ్చు. ఢిల్లీ జట్టు విశాఖ స్టేడియంలో తమ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 24న లక్నోతో, 30న సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ తలపడనుంది.
VZM: సంతకవిటి మండలం తాలాడలో ఉమారామలింగేశ్వర స్వామి ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
VZM: రోడ్డు ప్రమాదంలో వేపాడ మండలం వీలుపర్తికి చెందిన జి.రవికుమార్(25) ఆదివారం మృతి చెందాడు. అన్నవరంలో జరిగిన తన మేనమామ పెళ్లికి వెళ్లి బైక్పై నానాజీ అనే వ్యక్తిని తీసుకొని వస్తున్న క్రమంలో తుని వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రమాదంలో రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందగా నానాజీకి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
VZM: చిల్లపేట అభయాంజనేయ స్వామి 13వ అలయ వార్షికోత్సవం సందర్భంగా చిల్లపేట యువకులు అధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో విశాఖపట్నం జిల్లా సంగివలస జట్టు ప్రథమ బహుమతిగా రూ.25వేలు గెలుపొందారు. ఆనందపురం జట్టు ద్వితీయ బహుమతిగా రూ.10వేలు గెలుపొందారు. చిల్లపేట గ్రామ సర్పంచ్ కోదండరామ్ విజేతలకు బహుమతులను అందజేశారు.
ELR: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజబాబు శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పలువురు నేతలు ఆదివారం ద్వారకా తిరుమల మండలం సీహెచ్ పోతేపల్లిలో అయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావులు నివాళులర్పించారు.
అన్నయ్య: కోడూరు మండల పరిధిలోని కుమ్మరిపాలెం గ్రామంలో కోడి పందేల బరిపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆదివారం కోడూరు ఎస్సై చాణిక్య రాబడిన సమాచారం ప్రకారం తమ సిబ్బంది తో కలిపి కోడి పందేల బరిపై దాడి చేసి పది మంది వ్యక్తులను, 17 ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర ఉన్న రూ 13,980/- నగదు, నాలుగు కోడి పుంజులను స్వాధీన పరుచుకుని వారిపై కేసు నమోదు చేశారు.
కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో ఒక మద్యం దుకాణానికి ఎక్సైజ్ అధికారులు సీలు వేశారు. గతేడాది నవంబర్లో ఓ దుకాణం బెల్ట్ షాపుకు మద్యం సరఫరా చేసినట్లు నిర్ధారణ కావడంతో, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
కృష్ణా: పెదపారుపూడి పోలీస్ స్టేషన్లో ఆదివారం ఎస్పీ గంగాధరరావు ఆదేశాల మేరకు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్టపరమైన జీవన విధానాన్ని అవలంబించాలని సూచించారు. భవిష్యత్తులో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో నేర నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
కోనసీమ: రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా జరిగే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తుందని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ముమ్మిడివరంలో ఆదివారం అయన మాట్లాడుతూ.. ఓటర్లకు రానుపోను టిక్కెట్లు రిజర్వేషన్ చేస్తామని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇది క్షమించరాని నేరమన్నారు. ఇవి పార్టీలకతీతంగా జరిగే ఎన్నికన్నారు.
అన్నమయ్య: యాసిడ్ దాడిలో గాయపడి బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గౌతమిని ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదివారం పరామర్శించారు. డాక్టర్లతో ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులకు మనోధర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
VSP: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి నిత్య కళ్యాణం ఆదివారం వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి శ్రీకారం చుట్టారు. జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ ప్రక్రియలను కమనీయంగా నిర్వహించారు. విశేష హారతులు అందజేశారు.