SKLM: త్రాగునీటి కొళాయిలకు నీళ్లు విడిచి పెట్టే సమయంలో మోటార్లు బిగిస్తే ఇంటి యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమదాలవలస పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ వార్డుల్లో త్రాగునీటి కొళాయిలకు మోటర్లు బిగించినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వేసవి దృష్ట్యా త్రాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంద అన్నారు.
SKLM: వేసవి తాపం అధికంగా ఉన్న దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. నగరంలోని ఏడు రోడ్ల జంక్షన్లో మెడిటేరియన్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల అవసరం నిమిత్తం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు.
VSP: గాజువాక అగనంపూడిలో మేడ పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. శ్రీ వైష్ణవి అపార్ట్మెంట్లో ఉంటున్న గుడ్ల కమలకుమారి టెర్రస్ పై నుండి దూకి గేటు పై పడి అక్కడికక్కడే మృతి చెందింది. దువ్వాడ పోలీసులు స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
VSP: విజిలెన్స్ కమిషనర్కు జనసేన నేత, జీవీఎంసీ కార్పొరేటర్ పీతలు మూర్తి యాదవ్ మంగళవారం లేఖ రాశారు. పర్యాటక శాఖ ప్రసాద్ పథకంలో నిధుల దుర్వినియోగం వల్లే సింహాచలంలో భక్తులు చనిపోయారని ఆయన లేఖలో సంధించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
SKLM: నరసన్నపేట మండలం మాకివలస గ్రామంలో మంగళవారం శ్రీఅసిరి తల్లి గ్రామ దేవత పండగలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు వైసీపీ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్, మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. గ్రామంలో ఉన్న పలు కుటుంబాలను కలిసి మాట్లాడారు.
ATP: అనంతపురం నగరంలో జరుగుతున్న ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష కేంద్రాలను మంగళవారం జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ తనిఖీ చేశారు.ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని సిబ్బందికి సూచించారు.
NLR: కొడవలూరులోని గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమంలో భాగంగా మంగళవారం హాజరైన విద్యార్థులు చేత గ్రంథాలయ అధికారి రాజేశ్వరి ప్రతిజ్ఞ చేయించారు. పాఠ్యపుస్తకాలతో పాటు గ్రంధాలయంలో ఉండే పుస్తకాలు చదవడం ద్వారా గొప్ప మేధావులు అవుతారని రాజేశ్వరి అన్నారు. ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అనంతరం చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు.
NLR: దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ నేత, గతంలో కావలి టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జిగా మాలేపాటి సుబ్బానాయుడు విధులు నిర్వహించారు. టీడీపీ క్యాడర్కు, ప్రజలకు అండగా ఉన్న నేపథ్యంలో మాలేపాటిపై 16 కేసులు నమోదు అయ్యాయి. దాని పర్యవసానంగా మంగళవారం నెల్లూరు జిల్లా కోర్టుకు ఆయన హాజరయ్యారు.
NLR: పిల్లలకు తల్లిదండ్రులు, గురువులు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు మంచి మాటలు చెప్పడం ద్వారా అనురాగం, అభిమానం, ఆత్మవిశ్వాసం ఏర్పడతాయని వెంకట సుబ్బారావు అన్నారు. బుచ్చి పట్టణంలోని శాఖా గ్రంధాలయంలో వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా “మంచి మాట.. జ్ఞాపకాల తోట” కార్యక్రమం నిర్వహించారు. ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మంచి మాటలను పిల్లలచే చెప్పించారు.
నెల్లూరులోని అయ్యప్ప గుడి సెంటర్లో మంగళవారం దారుణ హత్య చోటుచేసుకుంది. అయ్యప్ప గుడి సమీపంలోనీ రాయలసీమ రాగి సంగటి హోటల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఉదయగిరి మండలం సర్వరాబాద్ గ్రామానికి చెందిన గొల్లపల్లి చిన్నయ్య (చిన్న)ను హత్య చేశారు. సమాచారం అందుకున్న నగర డీఎస్పీ సింధుప్రియ, వేదయపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
NLR: సోమశిల జలాశయం నీటి వివరాలను అధికారులు మంగళవారం విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి వరద నీరు రావడం లేదని జలాశయ ఈఈ శ్రీనివాస కుమార్ తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా జలాశయంలో 50.706 నీరు నిల్వ ఉంది. పెన్నా డెల్టాకు 30, దక్షణ కాలువకు 30, ఉత్తర కాలువకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
NLR: ఉదయగిరిలోనీ ప్రగతి జూనియర్ కళాశాల ఆవరణంలో మంగళవారం చుట్టుపక్కల మండలాల నుంచి 100 మంది పిల్లలకు ఖత్నాలు (ఒడుగులు) నిర్వహించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక నాయకులు షేక్ దస్తగిరి అహ్మద్ మాట్లాడుతూ.. చిన్న మసీదు కమిటీ వారు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు.
NLR: పొదలకూరు మేజర్ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ DPO శ్రీధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలోని సత్యనారాయణ లేఅవుట్కు సంబంధించి రిజర్వ్ ఉన్నస్థలం విషయంలో హైకోర్టుకు తప్పుడు సమాచారం అందజేశారనీ కలెక్టర్ ఆదేశాల మేరకు DPOచర్యలు తీసుకుంది. లేఅవుట్లోని 286అంకణాల ప్రభుత్వస్థలం అమ్మకాలు జరగడంతో స్ధానికులు కలెక్టర్ను ఆశ్రయించారు.
KKD: గొల్లప్రోలు శివారు పంట పొలాల మధ్యలోని చౌటు కాలువలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించామని ఎస్ఐ రామకృష్ణ మంగళవారం తెలిపారు. ఈ విషయమై సచివాలయం-1 వీఆర్వో మంగతాయారు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు పరిశీలించగా కాలువలోని నీటిలో తేలుతూ కుళ్లిన స్థితిలో పురుషుడి మృతదేహం ఉందన్నారు. 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉంటుందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.