• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘పూలే ఆశయ సాధన కై ఉద్యమిద్దాo’

NDL: సమసమాజ స్థాపన కై అహర్నిశలు కృషి చేసి, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన దీశాలి, మహాత్మా శ్రీ జోతి రావు పూలే అని ఏఐటీయూసి రాష్ట్ర కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. శుక్రవారం పాముల పాడు మండలoలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వామపక్ష, ప్రజా సంఘాలు, బీసీ నాయకులు పాల్గొన్నారు.

April 11, 2025 / 01:45 PM IST

కీ’చక అధికారిపై సస్పెన్షన్ వేటు’

AP: కర్నూలు జిల్లా DEO కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మధ్యకాలంలో శ్రీనివాసులు మహిళ ఉద్యోగులతో చెడుగా ప్రవర్తించారని ఆరోపణలు రావడంతో కడప RJD3 విచారణ జరిపారు. విచారణలతో అభియోగాలు వాస్తవాలని తేలడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

April 11, 2025 / 01:38 PM IST

రేపే ఇంటర్ ఫలితాలు.. ఉత్కంఠ

NTR: జిల్లాలో 80, 859 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 41,295 మంది ఫస్టియర్, 39,564 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. రేపు శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నట్లు మంత్రి లోకేశ్ తాజాగా ట్వీట్ చేశారు. దీంతో జిల్లాలోని విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

April 11, 2025 / 01:33 PM IST

రేపు రాపూర్ లో శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమం

 NLR: రాపూరు పట్టణంలో శ్రీరామ మందిరంలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని ఈనెల 12వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం రాత్రి 7:30కు కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులందరూ తరలిరావాలని కోరారు.

April 11, 2025 / 01:02 PM IST

‘పూలే చిత్రపటానికి నివాళులర్పించిన దినేష్ రెడ్డి’

విజయవాడలోని రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ పొలం రెడ్డి దినేష్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మాట్లాడుతూ.. అంటరానితనం కుల వివక్ష నిర్మూలన కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు.

April 11, 2025 / 12:59 PM IST

‘ఫూలే ఆశయ సాధనకు కృషి చేయాలి’

GNTR: గుంటూరు నగరంపాలెం ట్రావెలర్స్ బంగ్లా వద్ద మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన విగ్రహానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్లా మాధవి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

April 11, 2025 / 12:53 PM IST

పుష్పాలంకరణలో శ్రీ మానసా దేవి నాగశక్తి అమ్మవారు

VZM: చీపురుపల్లి మండలంలోని పుర్రేయవలస గ్రామంలో వెలసిన శ్రీ మానసా దేవి నాగశక్తి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పసుపు, కుంకుమలతో అభిషేకాలు చేసి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

April 11, 2025 / 11:05 AM IST

బీటెక్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

NTR: కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 4, 6వ సెమిస్టర్ థియరీ(రెగ్యులర్ &సప్లిమెంటరీ) పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 26 నుంచి మే 7 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. టైమ్ టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ లో చూడాలన్నారు.

April 11, 2025 / 11:00 AM IST

మహిళ ఖాతాలోని నగదు తస్కరణ 

PLD: శావల్యాపురం మండలం కనమర్లపూడికి చెందిన మహాలక్ష్మమ్మ పనులు చేసుకొని ఆ వచ్చిన నగదును బ్యాంక్ ఖాతాలో దాచుకుంది. ఆమెకు తెలియకుండా ఎవరో బ్యాంక్ ఖాతా నుంచి నాలుగు విడతలుగా రూ.31వేల నగదు బదిలీ చేసుకున్నారు. గురువారం కొంత డబ్బులు డ్రా చేసుకుందామని బ్యాంక్‌కు వచ్చి ఖాతాలో ఎంత ఉన్నాయని వివరించగా, ఖాతాలో నగదు బదిలీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

April 11, 2025 / 10:50 AM IST

చిన్నారి వైద్యానికి వెళితే బైక్ చోరీ అయింది

కృష్ణా: ఆగిరిపల్లి మండలం వడ్లమాను రైతు సింహాద్రి జగన్మోహనరావు తన కుమారుని వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళగా, బైకు చోరీ జరిగిందని శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. పెదవుటుపల్లి పిన్నమనేని ఆసుపత్రికి వైద్యం నిమిత్తం వెళ్ళగా, పార్కింగ్ చేసిన బైక్‌ను అగంతకుడు దర్జాగా చోరీ చేసి వెళ్లిన సంఘటన సీసీ ఫుటేజ్‌లో రికార్డయిందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 11, 2025 / 10:49 AM IST

ప్రజాదర్బార్‌లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

అన్నమయ్య: జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు, పెన్షన్లు మంజూరు చేసి పేదల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం చిన్నమండెం మండలం బోరెడ్డి గారిపల్లెలోని వారి నివాసంలో మంత్రి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు.

April 11, 2025 / 10:37 AM IST

మాజీ సైనికుడి కుటుంబానికి న్యాయం చేయండి

అన్నమయ్య: మాజీ సైనికుడి కుటుంబానికి న్యాయం చేయాలని చేయాలంటూ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు డీఎస్పీ కొండయ్య నాయుడులను కలిసి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. వాల్మీకిపురం మండలానికి చెందిన మాజీ సైనికుడు వెంకటాద్రి భూమి కబ్జాకు గురి కావడంతో మనస్తాపానికి గురి అయి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. అతనికి న్యాయం చేయాలని కోరారు.

April 11, 2025 / 10:22 AM IST

బీజేపీ పటిష్ఠానికి కృషి చేయండి: కిరణ్

NLR: బీజేపీ కావలి పట్టణ శాఖ అధ్యక్షులు మంద కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యుల సమావేశం స్థానిక ది క్లాత్ మర్చంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చర్చించుకున్నారు.

April 11, 2025 / 08:23 AM IST

వైభవంగా సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

NLR: సంగంలోని కామాక్షీ దేవి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్లు పులి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేసి పులి వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం మంగళవాయిద్యాల మధ్య ఊరేగించారు. హేమంత్ కృష్ణ అనే ప్రముఖ కళాకారుడు ముక్కుతో ఫ్లూట్ వాయించి అందరినీ ఆకట్టుకున్నాడు.

April 11, 2025 / 08:17 AM IST

శ్రీ మఠంలో నేడు పీఠాధిపతి పుట్టినరోజు వేడుకలు

KRNL: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ పుట్టినరోజు వేడుకలను నేడు ఘనంగా నిర్వహిస్తున్నట్లు మఠం మేనేజర్ వెంకటేశ్ జోషి, ఏఏఓ మాధవ శెట్టి తెలిపారు. పుట్టినరోజును పురస్కరించుకొని శ్రీ మఠంలో వివిధ రకాల హోమాలు, లక్ష్మీ పూజ, నిరుపేదలకు వస్త్ర దానం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

April 11, 2025 / 08:09 AM IST