W.G: అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం పాలకొల్లు ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని యనమదురు డ్రైన్ ముంపు సమస్యను ఆయన ప్రస్తావించారు. వర్షాకాలం నేపథ్యంలో అధికంగా వరదలు రావడం వల్ల సమీపంలోని పంట పొలాలు నీట మునిగే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. దీనికోసం కూటమి ప్రభుత్వం నిధులు సమకూర్చడం జరిగిందన్నారు.
GNTR: చట్టసభల విలువైన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ప్రజాప్రతినిధులు ముందస్తు ప్రణాళికతో సభకు హాజరుకావాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. సోమవారం అసెంబ్లీలోని జనసేన శాసనసభా పక్ష కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు.
E.G: రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ఐదుగురు మృతి చెందడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై హత్య కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక పరిహారం అందించాలని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం ఉచితంగా మెరుగైన వైద్య సేవలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
VZM: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు పరీక్షలు కొత్తవలస భారత్ డిఫెన్స్ అకాడమీలో సోమవారం సజావుగా జరిగింది. మొత్తం 297 విద్యార్థులు కేంద్రానికి కేటాయించగా, అందులో 12 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎటువంటి మాస్ కాపింగ్ జరగకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అనారోగ్యానికి బారిన పడకుండా అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
సత్యసాయి: ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో అనధికార వ్యక్తులు ఉండకుండా చర్యలు తీసుకున్నారు. సీఐలు, ఎస్సైల పర్యవేక్షణలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు రాకుండా తనిఖీలు చేపట్టారు. తొలిరోజు ప్రథమ సంవత్సరం మొదటి పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
ATP: గుత్తి కోటలో కొలువైన శ్రీ భూనీలా సమేత నరసింహస్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. దేవాలయ అభివృద్ధి కమిటీ ఆహ్వానం మేరకు రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు ఛైర్మన్ వెంకట శివుడు యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.
NTR: నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నండ్రు బాబు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కర్నూలు బార్ అసోసియేషన్ సభ్యులు ఎం పవన్ కుమార్పై విక్రమ్ సింహ అనే సీఐ దాడి చేయటం పట్ల తీవ్రంగా ఖండించారు. తక్షణం సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోని, సస్పెండ్ చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలన్నారు.
W.G: ఉండి మండలం, పాముల పర్రులోని రొయ్యల చెరువుల్లో గుర్తుతెలియని వ్యక్తులు పురుగుల మందు కలపడంతో లక్షలాది రూపాయల విలువైన రొయ్యలు మృతి చెందాయి. ఈ ఘటనతో రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. గ్రామ సర్పంచ్ భర్త కేశన బలుసుల మాస్టర్ 12 ఎకరాలు, కేశన యాదగిరి 5 ఎకరాల చెరువులో రొయ్యలు మృత్యువాత పడ్డాయి. దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
SKLM: తెలుగువారి గౌరవాన్ని ఢిల్లీలో నిలబెట్టిన మహానేత మాజీ కేంద్రమంత్రి ఎర్రం నాయుడు అని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం విజయవాడలో మంత్రి అచ్చెన్నాయుడు క్యాంపు కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
NTR: చందర్లపాడు మండలం పాత బెల్లంకొండ వారి పాలెం గ్రామానికి చెందిన సవలం లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, కుటుంబానికి భీమా సహాయం అందింది. సోమవారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో ప్రధానమంత్రి జన సురక్ష భీమా పథకం కింద మృతుడి సతీమణి తిరుమలమ్మకు రూ.2 లక్షల చెక్కును అందజేశారు. ప్రభుత్వం ఇలాంటి కష్ట సమయాల్లో అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
SKLM: నరసన్నపేటలో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అసెంబ్లీ జీరో అవర్లో సోమవారం ప్రస్తావించారు. సారవకోట, జలుమూరు, పోలాకి మండలాల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ మేరకు గొట్టా బ్యారేజ్ నుంచి ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ను సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
కృష్ణా: బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఉచిత వైద్య శిబిరాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రేపు కురుమద్దాలి గ్రామంలో, బుధవారం గడ్డిపాడులో శిబిరాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
VZM: వ్యవసాయంలో AI టెక్నాలజీ ద్వారా నూతన ఒరవడి సృష్టించవచ్చునని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఈ టెక్నాలజీ ద్వారా రైతులు ఎలాంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చో, పంటల దిగుబడి పెంచేందుకు AIను ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం AI ద్వారా వ్యవసాయ అభివృద్ధికి రూ. 500 కోట్లను కేటాయించి ఫలతాలు సాధించారన్నారు.
GNTR: పెదకాకానిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం సంక్షేమ బోర్డుపై సమీక్ష చేయడాన్ని స్వాగతించారు. అయితే, మరణించిన కార్మికుల కుటుంబాలకు బెనిఫిట్లు నిరాకరించడం, 46 వేల క్లైములను నిలిపివేయడం అన్యాయమని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.
పల్నాడు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా స్వయంగా పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. బాధితుల సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్న ఆమె, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల విషయంలో అలసత్వం వహించరాదని అధికారులకు తెలిపారు.