• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నెల్లూరు కలెక్టరేట్‌లో పోస్టర్ ఆవిష్కరణ

NLR: ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా శాఖ సభ్యులు కలెక్టర్ ఆనంద్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. వారు రూపొందించిన “ప్రభుత్వ పాఠశాలలలో మీ పిల్లలను చేర్పించండి వారి బంగారు భవితకు బాటలు వేయండి” పోస్టర్‌లో కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్య అందుతుందన్నారు.

April 11, 2025 / 08:06 AM IST

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జ్యూస్ వాహనం దగ్ధం

KRNL: పత్తికొండ పట్టణంలో ఎండ వేడికి విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా గురువారం ఒక మొబైల్ ఫ్రూట్ జ్యూస్ వాహనం దగ్ధమైంది. హోసూరు రోడ్డులో నివసించే రాజస్తాన్‌కు చెందిన షోభాలాలికి చెందిన ఈ వాహనం ఇంటి వద్ద నిలిపిన సమయంలో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది రాకముందే వాహనం పూర్తిగా కాలిపోయింది. దీంతో రూ.8లక్షల దాకా నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

April 11, 2025 / 08:01 AM IST

ఏడేళ్ల కుమారుడిని చంపి.. తండ్రి సూసైడ్!

విజయవాడ వన్ టౌన్‌లో విషాదం చోటుచేసుకుంది. బంగారు వ్యాపారి సాయి ప్రకాష్ రెడ్డి అప్పుల భారంతో తన ఏడేళ్ల కుమారుడు దీక్షిత్ రెడ్డికి ఐస్క్రీమ్‌లో సైనైడ్ ఇచ్చి చంపి, తానూ సైనైడ్ సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం రాత్రి ఆసుపత్రి చేర్చారు. కాగా ఇద్దరు చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

April 11, 2025 / 07:54 AM IST

నేడు బీసీ భవన్ ప్రారంభం

శ్రీకాకుళం: పట్టణంలోని 80 ఫీట్ రోడ్డులో టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం సమీపంలో నిర్మించిన బీసీ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం జరగనుంది. ఈ భవనం ప్రారంభోత్సవానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.

April 11, 2025 / 07:30 AM IST

మద్యం అమ్మకాలు పెరిగాయి: కొల్లు రవీంద్ర

ప్రకాశం: రాష్ట్ర సరిహద్దుల్లో మద్యం అమ్మకాలు పెరిగాయని మంత్రి కొల్లు రవీంద్ర గురువారం అన్నారు. దీని వల్ల రాష్ట్రానికి మరింత ఆదాయం వస్తోందని తెలిపారు. వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందని, క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో దాదాపు రూ.లక్ష కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు. ఇక వైసీపీ హయాంలో తనపై అక్రమ కేసులు పెట్టి 44 రోజులు జైల్లో ఉంచినట్లు గుర్తుచేశారు.

April 10, 2025 / 08:24 PM IST

2047-విజన్‌ విజయానికి అందరి భాగస్వామ్యం అవసరం

SKLM: రాష్ట్ర సీఎం చంద్రబాబు 2047 విజన్ ద్వారా ప్రతి ఇంట్లో ఓ పారిశ్రామికవేత్త ఉండాలన్న లక్ష్యంతో అమలు చేస్తున్న కార్యక్రమాలకు అందరి సహకారం ఉండాలని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. DRDA కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతాంగానికి అలాగే మత్స్యకారులను చిన్న పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

April 10, 2025 / 08:16 PM IST

ప్రతీ కుటుంబం లక్ష ఆదాయం పొందాలి

PPM: ప్రతీ కుటుంబం కనీసం లక్ష రూపాయలు ఆదాయం పొందాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల నుండి జీవనోపాధి కల్పనలో భాగంగా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం కనీసం లక్ష ఆదాయం సంపాదించాలని, ఇందుకు వ్యవసాయ, వాణిజ్య యూనిట్లు కార్యాచరణ తయారు చేయాలన్నారు.

April 10, 2025 / 08:16 PM IST

హెచ్‌‌డీఎస్ ప్రమాణస్వీకారంలో ఎమ్మెల్యే

PLD: నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో హెచ్‌‌డీఎస్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం జరిగింది. ఇందులో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆసుపత్రిని మెడికల్ కళాశాలగా అభివృద్ధి చేస్తామని వారు హామీ ఇచ్చారు. నూతన కమిటీకి అభినందనలు తెలుపుతూ, వైద్య సేవలు మెరుగుపరచాలని సూచించారు.

April 10, 2025 / 08:12 PM IST

DSC అభ్యర్థులకు ముఖ్య గమనిక

కోనసీమ: ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో DSC అభ్యర్థులకు ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా BC సంక్షేమ సాధికారత అధికారి సత్యరమేష్ తెలిపారు. ఇందుకోసం అభ్యర్ధులు తమ బయోడేటా, సంబంధిత విద్యార్హత పత్రాలను జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయంలో అందించాలన్నారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

April 10, 2025 / 07:35 PM IST

వైకాపా పాలనలో మున్సిపల్ వ్యవస్థ నిర్వీర్యమైంది

BPT: గత వైకాపా పాలనలో నిర్వీర్యమైన మున్సిపల్ వ్యవస్థను తిరిగి బలోపేతం చేసి, పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గురువారం వెస్ట్ గోదావరి జిల్లాలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 

April 10, 2025 / 07:31 PM IST

‘సామాజిక బాధ్యతతో ఉపాధ్యాయులు విధులు నిర్వహించాలి’

ATP: సమాజసేవ కంటే మించింది మరొకటి లేదని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు సూచించారు. రాయదుర్గంలోని MPDO కార్యాలయంలో గురువారం పాఠశాల విద్యావ్యవస్థ పునర్నిర్మాణంపై జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయులపై సామాజిక బాధ్యత ఎంతో ఉందన్నారు. అందుబాటులో ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుంటూ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలన్నారు.

April 10, 2025 / 07:30 PM IST

వైసీపీ అరాచక విధానాలు సృష్టించింది: ఎమ్మెల్యే

E.G: గత YCP ప్రభుత్వం ఐదేళ్లపాటు రాష్ట్రంలో అరాచక పాలన సాగించి, అభివృద్ధిని విచ్ఛిన్నం చేసిందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. గురువరం బొమ్మూరులో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. YCP నిరంకుశ విధానాల వల్ల రాష్ట్రం అస్తవ్యస్తమైందని, కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతోందన్నారు.

April 10, 2025 / 07:20 PM IST

పిడుగుపాటుకు పది గొర్రెలు మృతి

ATP: గార్లదిన్నె మండలం పెనకచర్ల గ్రామంలో గురువారం సాయంత్రం ఉరుముల, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గ్రామంలో కురిసిన వర్షానికి పిడుగుపాటుతో చిదంబరయ్య అనే రైతుకు చెందిన పది గొర్రెలు మృతి చెందాయి. బాధిత రైతు మాట్లాడుతూ.. గొర్రెలు మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నానని పిడుగుపాటుకు పది గొర్రెలు మృతి చెందాయని కన్నీరుమున్నీరయ్యాడు.

April 10, 2025 / 06:36 PM IST

అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన ఫుడ్ కమిషన్ ఛైర్మన్

NDL: ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి గురువారం బనగానపల్లె మండలంలోని బతులూరుపాడు, ఎనకండ్ల గ్రామాలలో అంగన్వాడీ సెంటర్లు, రేషన్ షాప్, గిడ్డంగులను తనిఖీ చేశారు. రేషన్ షాప్లు, అంగన్వాడీ కేంద్రాల్లో సక్రమంగా సరుకులు సరఫరా చేయాలన్నారు. నాణ్యమైన కూరగాయలు, గుడ్లు, సరుకులు సరఫరా చేయకపోతే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 10, 2025 / 05:18 PM IST

ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి: కలెక్టర్

PPM: జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఎప్పుడూ లేని విధంగా 12వ జాతీయ నాణ్యత హామీ ప్రమాణ సర్టిఫికెట్స్ వచ్చే విధంగా కృషి చేసిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అభినందించారు. జిల్లాలోని 15 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ఉన్న మౌలిక వసతులు, రోగులకు సిబ్బంది అందించే వైద్యసేవల నాణ్యతలను పరిశీలించారు.

April 10, 2025 / 05:10 PM IST