• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జమియా మసీదులో రంజాన్ ప్రార్థనలు

శ్రీకాకుళం: నగరంలోని సూర్య మహల్ జంక్షన్ వద్ద ఉన్న జమియా మసీదులో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. రంజాన్ పర్వదినం శాంతి, సహనం, సౌహార్దానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. 

March 21, 2026 / 11:23 AM IST

పిడుగు పడి ఇద్దరికి గాయాలు

మన్యం: మక్కువ మండలం కన్నంపేట గ్రామంలో శుక్రవారం పిడుగు పడి నల్ల గోపి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో పిడుగులు పడ్డాయి. అదే సమయంలో పొలంలో ఉన్న నల్ల గోపి, బలగ సాయి అనే ఇద్దరి వ్యక్తులకు పిడుగు పాటు వల్ల గాయాలయ్యాయి.

March 21, 2026 / 11:21 AM IST

గుడ్ న్యూస్.. 24న జాబ్ మేళా

KKD: ఈ నెల 24న జిల్లా ఉపాధి కార్యాలయంలో 62 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫోన్ పే, రామకృష్ణ ఎలక్ట్రికల్ వర్క్స్ వంటి సంస్థలలో పనిచేసేందుకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న వారు టెన్త్ నుంచి డిగ్రీ అర్హత కలిగిన వారు ఉదయం 10 గంటలకు ధ్రువపత్రాలతో రావాలన్నారు. 

March 21, 2026 / 11:21 AM IST

‘కూటమి ప్రభుత్వం హయాంలోనే ఉత్తరాంద్ర అభివృద్ధి’

VZM: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతోందని బొబ్బిలి MLA బేబినాయన అన్నారు. శనివారం బొబ్బిలి కోటలో మాట్లాడుతూ.. మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణంతో 50 వేలమందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రబుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 20 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, రెండో ఏడాది జాబ్‌ క్యాలెండ్ విడుదల చేశామన్నారు.

March 21, 2026 / 11:20 AM IST

పెట్రోల్ కొరతతో అవస్థలు ఆడుతున్న వాహనదారులు

ASR: చింతపల్లిలో పెట్రోల్ కొరతతో బంకుల వద్ద వాహనదారులతో భారీ రద్దీ పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలు, సరఫరా అంతరాయాలపై భయాందోళనల నేపథ్యంలో చింతపల్లి మండలంలోఇంధన సంక్షోభ వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం నుంచే మండల కేంద్రంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలు కూడా గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.

March 21, 2026 / 11:20 AM IST

ఈద్-ఉల్-ఫితర్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

KRNL: ఎమ్మిగనూరు, పవిత్రమైన రాంజాన్ పండుగను పురస్కరించుకుని ఎమ్మిగనూరు స్థానిక ఈద్గాలో ముస్లింలు సోదర, సోదరిమణులకు ఎమ్మెల్యే డాక్టర్ బివి.జయనాగేశ్వర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 30 రోజులు ఉపవాస దీక్షలు నిర్వహించి ఇవాళ ఈదుల్ ఫితర్ పండగ నిర్వహించుకోవడం శుభ పరిమాణమమని ఆయన పేర్కొన్నారు.

March 21, 2026 / 11:18 AM IST

రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని యువకుడు మృతి

W.G: కృష్ణా జిల్లా తరిగొప్పుల రైల్వే స్టేషన్ ప్లాట్ఫారమ్ వద్ద గుర్తుతెలియని యువకుడు (సుమారు 25-30 ఏళ్లు) రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుని వివరాలు తెలిసిన వారు వెంటనే గుడివాడ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భీమవరం రైల్వే జీఆర్పి సుబ్రహ్మణ్యం కోరారు. మృతుని ఆచూకీ తెలిస్తే 92475 85713, 99890 29379 నెంబర్లను సంప్రదించాలని విన్నవించారు.

March 21, 2026 / 11:16 AM IST

అకాల వర్షంతో అరటి రైతులకు భారీ నష్టం

NDL: గిట్టుబాటు ధరలు లేక ఇప్పటికే నష్టాల్లో ఉన్న అరటి రైతులను అకాల వర్షం మరింత కుదిపేసింది. మండలంలోని చిన్న వంగలి గ్రామంలో ఈదురు గాలులకు అరటి తోటలు నేలకూలాయి. లక్ష్మీకాంతరెడ్డి, మోహనరెడ్డి, నారాయణరెడ్డి, నాగయ్యలకు చెందిన పంట దెబ్బతింది. దీంతో రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.

March 21, 2026 / 11:16 AM IST

రైళ్లలో చోరీ.. విశాఖలో కాకినాడ వాసి అరెస్టు

KKD: రన్నింగ్ ట్రైన్స్‌లో ల్యాఫ్‌టాప్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్‌ఫెక్టర్ సీహెచ్. ధనంజయ నాయుడు ఆధ్వర్యంలో స్టేషన్‌లో తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కాకినాడకు చెందిన అనంత దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.2 లక్షల విలువైన 4 ల్యాప్‌టాప్, రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. 

March 21, 2026 / 11:15 AM IST

బస్టాండ్‌లో గుర్తు తెలియన వ్యక్తి మృతి

E.G: దేవరపల్లిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన నెలకొంది. వివరాల్లోకి వెళితే.. బస్టాండ్‌కి వచ్చిన పలువురు ప్రయాణికులు ఉదయం మృతిదేహాన్ని గమనించారు. వెంటనే దేవరపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడు తెల్ల రంగు షర్టు ధరించి ఉన్నట్లు తెలియజేశారు. కాగా అతని మృతి‌పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

March 21, 2026 / 11:12 AM IST

ఖాజీపేటలో ఘనంగా రంజాన్ వేడుకలు

KDP: ఖాజీపేట పట్టణంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను అత్యంత ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఈద్గా మైదానంలో నిర్వహించిన ఈద్-ఉల్-ఫితర్ ప్రత్యేక సామూహిక ప్రార్థనల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం, ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మైదానం ప్రాంగణమంతా ఆధ్యాత్మిక, పండుగ వాతావరణంతో ఆహ్లాదకరంగా మారింది.

March 21, 2026 / 11:10 AM IST

వైభవంగా మత్స్య జయంతి వేడుకలు

TPT: నాగలాపురంలోని మత్స్యావతార మూర్తి శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో శనివారం ఉదయం మత్స్య జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక మత్స్య కార్మిక కుటుంబాల వారు కంకణం, ఇరుముడులు ధరించారు. వేదనారాయణ స్వామి ఆలయం నుంచి కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామి వారు గ్రామోత్సవానికి బయలుదేరారు.

March 21, 2026 / 11:07 AM IST

ఎర్రంపల్లిలో రేపు హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు

ATP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు ఆదివారం ఉ.10 గంటలకు నిర్వహించనున్నారు. కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం జరగనుంది. అనారోగ్యంతో కన్నుమూసిన ‘పెద్దాయన’కు తుది వీడ్కోలు పలికేందుకు భారీగా అభిమానులు, రాజకీయ నాయకులు తరలిరానున్నారు. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

March 21, 2026 / 11:06 AM IST

అన్నదాన ట్రస్ట్ కు రూ.50,116 విరాళం

కోనసీమ: వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం కానూరు కి చెందిన కాశీ చొప్పరపు రమేష్ బాబు, సునీత దంపతులు స్వామి వారిని దర్శించుకుని, ఆలయంలో నిర్వహిస్తున్న అన్నదాన ట్రస్ట్‌కు రూ.50,116లు విరాళం ఆలయ అధికారులకు అందజేశారు. వారికి ఆలయ అర్చకులు స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. 

March 21, 2026 / 11:05 AM IST

నేడు, రేపు వర్షాలు: APSDMA

VZM: బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేడు, రేపు వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రేపు విజయనగరంపాటు ఇతర జిల్లాలో కూడా వర్షాలు పడతాయని హెచ్చరించింది.

March 21, 2026 / 11:05 AM IST