• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆర్థిక సహాయం అందజేసిన మిత్రబృందం

NDL: కొత్త పల్లె మండలంలోని పాత మాడుగుల గ్రామానికి చెందిన తెలుగు అశోక్ కుమారుడు బెస్త రిషికేష్ (5) అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతు కర్నూలులోని విశ్వ భారతి క్యాన్సర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. తమ మిత్రుడు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న మిత్ర బృందం కర్నూలుకు చేరుకొని అశోక్ కుటుంబాన్ని ప్రదర్శించారు.

February 16, 2025 / 07:44 PM IST

నేరాల నియంత్రణ కోసమే డ్రోన్ కెమెరాలు

ప్రకాశం: నేరాలు నియంత్రణ అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నామని వెలిగండ్ల ఎస్సై మధుసూధన్ రావు అన్నారు. స్థానిక బస్టాండ్ నందు డ్రోన్ పనిచేసే తీరును ప్రజలకు ఆయన వివరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇటీవల దాతల సాయంతో జిల్లా ఎస్పీ దామోదర్ ఈ డ్రోన్ కెమెరాను పోలీస్ స్టేషన్‌కు ఇచ్చారన్నారు.

February 16, 2025 / 07:35 PM IST

నిత్య అన్నదానానికి వేమిరెడ్డి విరాళం

NLR: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు నిత్య అన్నదానానికి విరాళం అందించారు. సీతారామపురం మండలంలోని శ్రీ ఇష్ట కామేశ్వరీదేవి సమేత ఘటిక సిద్ధేశ్వరస్వామి వారి ఆలయంలో నిత్యాన్నదానానికి రూ.5 లక్షల విరాళం అందించారు.

February 16, 2025 / 07:10 PM IST

స్వామివారిని దర్శించుకున్న ఎంపీపీ

SKLM: ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట గ్రామంలో సూరవారి ఇంటిదైవం శ్రీరాముల వారి సంబరాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ఎంపీపీ మొదలవలస చిరంజీవి దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఆయనతోపాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు దర్శించుకున్న వారిలో ఉన్నారు.

February 16, 2025 / 07:00 PM IST

పురుగు మందు తాగి మహిళ మృతి

NLR: సీతారాంపురం మండలం పడమటి రొంపిదొడ్ల గ్రామానికి చెందిన ముట్టుకుందు చెన్నమ్మ (75) మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఇంటి సమీపంలోని పొలం వద్ద పురుగు మందు తాగింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు 108 వాహనంలో ఉదయగిరి ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యలో మృతి చెందింది.

February 16, 2025 / 06:22 PM IST

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

ప్రకాశం: హెల్మెట్‌ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని మేదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ అన్నారు. ఆదివారం మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పైలాన్ వద్ద హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. హెల్మెట్‌ తలకు రక్షణ కవచమని అది లేకుండా మోటార్‌ సైకిల్‌ తోలవద్దని హితవు పలికారు.

February 16, 2025 / 06:20 PM IST

జాతర మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

కోనసీమ: అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామంలో ఆదివారం జరిగిన సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమంలో పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు నియోజవర్గ ప్రజల మీద ఉండాలని, ప్రజలందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను అన్నారు.

February 16, 2025 / 05:01 PM IST

చెరువును పరిశీలించిన సీపీఎం నేతలు

VZM: రామభద్రపురం మండలం కొట్టక్కి సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆక్రమణకు గురైన చెరువును సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు, మండల కార్యదర్శులు బి.శ్రీనివాసరావు, ఎస్.గోపాలం అదివారం పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులను కాపాడాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చుస్తుందన్నారు. చెరువు ఆక్రమణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

February 16, 2025 / 04:53 PM IST

అంకమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి

ELR: ముసునూరు మండలం వేల్పుచర్ల గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈమేరకు ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అన్నదాన కార్యక్రమంలో మంత్రి ూలనంేయు భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.

February 16, 2025 / 04:35 PM IST

జిమ్ ఏర్పాటుకు మంత్రి నారాయణ శంకుస్థాపన

NLR: నెల్లూరు నగరంలోని 5వ డివిజన్ ఎస్వీఆర్ పార్కులో రూ. 40 లక్షలతో ఏర్పాటు చేయనున్న జిమ్ ఎక్విప్మెంట్ స్థాపనకు మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 14వ డివిజన్ AC నగర్ పార్కులో రూ.30 లక్షలతో ఏర్పాటు చేయనున్న జిమ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయనతోపాటు కమిషనర్ సూర్య తేజ, కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

February 16, 2025 / 01:00 PM IST

మార్చి 15న మహా కుంభాభిషేకం

CTR: మార్చి 15న నగరంలోని ప్రముఖ పొన్నియమ్మన్ ఆలయ మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త సీకే లావణ్య బాబు తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 15, 16, 17 తేదీల్లో కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రులు కావాలని కోరారు.

February 16, 2025 / 12:01 PM IST

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. చేపలకు పెరిగిన డిమాండ్

GNTR: బర్డ్ ఫ్లూ ప్రభావంతో గుంటూరు నగరంలో చికెన్ ధరలు అమాంతం తగ్గిపోయాయి. కేజీ చికెన్ రూ. 140, రూ.160ల బోర్డులు పెట్టినా కొనేవారు లేక వెలవెలబోతున్నాయి. ఇదే అదునుగా చేపలకు డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో చేపల మార్కెట్, మిర్చియార్డు, ఆర్టీవో ఆఫీస్ రోడ్, పొన్నూరు రోడ్డు, అమరావతి రోడ్డు ప్రాంతాల్లోని ఆదివారం మాత్రమే దుకాణాలు కళకళలాడుతుంది.

February 16, 2025 / 10:46 AM IST

మటన్, చేపలకు పెరిగిన డిమాండ్

W.G: తణుకు పరిసర ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో కోడి మాంసం అమ్మకాలు లేకుండా దుకాణాలను మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో మార్కెట్లో చేపలకు, రొయ్యలకు, మటన్‌కు భారీ డిమాండ్ పెరిగింది. ఆదివారం కావడంతో మాంసం ప్రియులు ఆయా దుకాణాల వద్ద క్యూలు కడుతున్నారు. ఇదే అదునుగా చేసుకుని దుకాణ యజమానులు ధరలు పెంచేస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు

February 16, 2025 / 10:33 AM IST

‘మానవ ఉనికిపై ఏఐ తీవ్ర ప్రభావం’

GNTR: సమకాలీన సమాజంలో కీలకమైన భాగంగా కృత్రిమ మేధస్సు (AI) ఉద్భవించిందని.. మానవ ఉనికి విభిన్న కోణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఏఎన్యూ తాత్కాలిక ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధరరావు అన్నారు. విశ్వవిద్యా లయంలో విద్యార్థులకు ఏఐపై 2 రోజులుగా జాతీయస్థాయి సదస్సు నిర్వహించామన్నారు. హైదరాబాద్లోని వర్ధన్ డేటా సైన్స్ అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి పాల్గొన్నారు.

February 16, 2025 / 10:22 AM IST

తగ్గిన గుడ్డు ధర

E.G: బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్ వినియోగంతోపాటు గుడ్ల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు రూ.4.90లు పలికిన గుడ్డు ధర ఇప్పుడు రూ.4.55లకు పడిపోయింది. ఈ ప్రభావం కేక్‌లపై కూడా పడింది. చాలామంది కేక్‌లు తినేందుకు ఇష్టపడడం లేదు. ఉమ్మడి  జిల్లాలో గుడ్ల ఉత్పత్తి 1.30 కోట్ల మేర ఉండగా, స్థానికంగా వినియోగం 30 శాతం ఉంటుంది.

February 16, 2025 / 09:43 AM IST