SKLM: చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది ఒక మంచి అలవాటని జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. చేతులను శుభ్రపరిచే దినం కావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సిబ్బందికి చేతులు శుభ్ర పరుచుకోవడంపై సోమవారం అవగాహన కల్పించారు. చేతులకు మొదట సబ్బు రాసుకుని బాగా రుద్దిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలన్నారు.
ప్రకాశం: ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపి ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగించవద్దని వాహనదారులకు సీఐ ఖాజావలి సూచించారు. సోమవారం కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్, కందుకూరు రోడ్డు సెంటర్ వద్ద వాహనదారులకు, షాపుల యజమానులకు సీఐ ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసులు సూచించిన విధంగా రహదారులకు ఓవైపు మాత్రమే వాహనాలు పార్కింగ్ చేయాలన్నారు.
SKLM: రణస్థలం మండలం వేల్పురాయి గ్రామానికి చెందిన బాలి సింహాచలం, అడపా శ్రీను ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వారు సోమవారం శ్రీకాకుళం ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
SKLM: బూర్జ మండలం పాలవలస గ్రామంలో మండల వ్యవసాయాధికారి ఎన్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం వరి పంటలో నవధాన్యాలు సాగు పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవ ధాన్యాల సాగు వలన పంటలకు అనుకూలమైన సూక్ష్మ క్రిములు అభివృద్ధి చెంది భూసారం పెరుగుతుందని అన్నారు.
ELR: ఆర్జీయూకేటీ, వద్వానీ ఫౌండేషన్ సంయుక్తంగా ఎంటర్ పెన్యూర్షిప్ ఎడ్యుకేషన్ నూజివీడు ట్రిపుల్ ఐటీలో సోమవారం ప్రారంభమైంది. ఆర్జీయూకేటీ రిజిస్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. 49 మంది అధ్యాపకులు పరిశ్రమల అవసరాల కోసం అనేక కోర్సులను అందించనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలకు ఎంతగానో దోహదం చేస్తుందన్నారు.
VZM: వివాదస్పద కొఠియా గ్రామాల్లో సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపించాలని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జి కోరారు. విజయనగరంలోని సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్ర అధికారులు నిర్లక్ష్యంతో ఒడిస్సా అధికారులు, పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారన్నారు. ఎస్టీ కమిషన్ ఛైర్మన్కు సమస్యను వివరించామన్నారు.
VSP: ఈనెల 10, 11న ఏలూరులో జరగనున్న అంతర్జాతీయ తెలుగు మహాసభల గోడపత్రికను జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాస్ సోమవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. తెలుగు భాషను కాపాడుకొనే ఇటువంటి సభా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జెజెయఫ్ జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు.
GNTR: మహాత్మా గాంధీ, నెహ్రూ గురించి సోషల్ మీడియాలో అశ్లీల వ్యాఖ్యలు చేసిన సినీ కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్రాపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం NSUI ఫిర్యాదు చేసింది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన NSUI జిల్లా అధ్యక్షుడు షేక్ కరీం, స్వాతంత్య్ర సమరయోధుల హోదాను అవమానించారంటూ, వెంటనే ఆమెపై FIR నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
VZM: కలెక్టరేట్లో PGRSకు మొత్తం 177 అర్జీలు అందాయి. భూ సమస్యలకు సంభందించి రెవిన్యూ శాఖకు అత్యధికంగా 87 వినతులు అందాయి. పంచాయతిశాఖకు 15, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డీఆర్డీఏకు 17 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 06, విద్యా శాఖకు 9, హౌసింగ్కు 3 అందగా, వైద్య శాఖకు 05, విద్యుత్ శాఖకు 6 చొప్పున అందాయన్నారు.
VZM: కార్మికులకు హక్కుల అవగాహన అవసరమని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ.విజయ్ రాజ్ కుమార్ అన్నారు. మేడే వారోత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం అంగన్వాడీ కార్యకర్తలు, కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మన్యం: పార్వతీపురం భాస్కర్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 9వ తేదీన జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య పేర్కొన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్, ఐటిఐ, ఏదైనా డిగ్రీ చదువు కొని 18 నిండి 28 ఏళ్లు వయసు గల నిరుద్యోగ యువతీ యువకులు మే 9వ తేదీన జరుగుతుంది అన్నారు.
BPT: బాపట్లలో కొలువై ఉన్న శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి నవాహ్నిక దీక్ష పూర్వక బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం వేడుకగా జరిగింది. అనంతరం శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి సూర్య ప్రభ వాహనంపై దివ్య మంగళ దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
గుంటూరు: జిల్లాలో కొత్త ఫ్లైఓవర్ ప్రభుత్వం నిర్మించనుంది. దీంతో నగరంలో ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. అధికారులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 7వ తేదీన ఫ్లైఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. శంకుస్థాపన కోసం గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికే స్థలాన్ని పరిశీలించారు.
గుంటూరు: ఈ నెల 4వ తేదీన పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు గ్రామంలో అప్పుడే పుట్టిన మగ శిశువును పంటపొలాల్లో వదిలి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శిశువును పొన్నూరులోని నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాల సూపరిండెంటెండ్ డాక్టర్ ఫిరోజ్ ఖాన్ వైద్య పరీక్షలు చేసి సంరక్షణలో ఉంచారు. సోమవారం శిశువును పొన్నూరు ఐసీడీఎస్ సిబ్బందికి అప్పజెప్పారు.
GNTR: పొన్నూరు పట్టణం రైల్వే స్టేషన్ రోడ్డు ఓవర్ బ్రిడ్జి ప్రక్కన సోమవారం గుర్తు తెలియని మృతదేహం (45) స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా అర్బన్ CI L. వీర నాయక్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడు ఎవరు, ఆత్మహత్యనా, హత్యనా అనే కోణంలో విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.