నెల్లూరు: నగరంలోని శెట్టిగుంట రోడ్డు సబ్ స్టేషన్ పరిధిలో రిపేర్లు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీనివాస నగర్, జాకీర్ హుస్సేన్ నగర్, కిసాన్ నగర్, సింహపురి కాలనీ, మైపాడు రోడ్డు తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదని ఈఈ ఎం శ్రీధర్ పేర్కొన్నారు.
అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని సరస్వతి విద్యానికేతన్ పాఠశాలలో శక్తి యాప్పై పోలీసులు అవగాహన కల్పించారు. ఈ యాప్ మహిళల భద్రత కోసం రూపొందించబడిందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు రక్షణ అవసరమైనప్పుడు సహాయపడుతుందని అన్నారు. యాప్లోని SOS బటన్ ప్రెస్ చేస్తే లొకేషన్ ఆధారంగా 10 నిమిషాల్లో పోలీసులు బాధితుల వద్దకు చేరుకుంటారని తెలిపారు.
CTR: ‘అందమంటే నందమూరి వంశానికే సొంతం’ అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరులో జరుగుతున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చిత్తూరులో ఈ చిత్ర ఆడియోను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ATP: గుత్తి పట్టణ శివార్లోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం బొలెరో వాహనం బైక్ ఢీకొంది.ఈ ప్రమాదంలో బైక్ మీద వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
విశాఖలో షిప్ యార్డ్లో సొసైటీ కార్మికుడిగా పనిచేస్తున్న అప్పారావు విద్యుత్ షాక్కు గురై పైనుంచి కింద పడి మృతి చెందారు. నక్కవానిపాలెం ప్రాంతానికి చెందిన పిలక అప్పారావు బుధవారం హాల్ షాప్ విభాగంలో పనిచేస్తూండగా ఈ ప్రమాదం జరిగింది. పైనుంచి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మల్కాపురం సీఐ విద్యాసాగర్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు.
TPT: వాహనాలతో రాంగ్ రూట్లో ప్రయాణిస్తే చర్యలు తప్పవని రేణిగుంట DSP శ్రీనివాసరావు అన్నారు. SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు రేణిగుంట, గాజులమండ్యం ఏర్పేడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. రాంగ్ రూట్లో వాహనాలు నడిపిన 77 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరపరచగా ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున జరిమానా విధించారు.
ASR: కొయ్యూరు మండలం చీడిపాలెం జంక్షన్ వద్ద 172.310 కేజీల గంజాయి పట్టుబడిందని సీఐ పీ.వెంకటరమణ బుధవారం తెలిపారు. ముందస్తు సమాచారంతో ఎస్సై పీ.కిషోర్ వర్మ తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా, ఆటోలో తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఈ మేరకు గంజాయితో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుని, గంజాయి తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
ELR: ముదినేపల్లి మండలం వడాలిలో అనుమానాస్పదస్థితిలో వివాహిత తనుశ్రీ మృతి చెందిన సంఘటనలో ఆమె భర్త బెజవాడ అనిల్ కుమార్ను బుధవారం డీఎస్పీ శ్రావణ కుమార్ను అరెస్టు చేశారు. సోమవారం తనుశ్రీ భర్త వేధింపులు తట్టుకోలేక మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కైకలూరు న్యాయస్థానానికి తరలించగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
KKD: జగ్గంపేట మండలం రాజపూడి, గోవిందపురం, వెంగయమ్మపురం, మల్లిసాల గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై రూ. 90 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. అలాగే గోకులం షెడ్డును కూడా ప్రారంభించారు.
PPM: కురుపాం మండలం గిరి శిఖర ప్రాంతాలలో ఈనెల 11న శుక్రవారం గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి పర్యటించనున్నారని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. రాముడుగూడ, కీడవాయి గ్రామాలకు రూ.2.90 కోట్ల NREGS నిధులతో పూర్తైన బీటీ రోడ్లను ప్రారంభిస్తారన్నారు. దీనిని కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ గమనించాలన్నారు.
KKD: దివ్యాంగులను సానుభూతితో గాకుండా మానవత్వంతో చూడాలని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సూచించారు. బుధవారం కరప మండల విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు పంపిణీ చేశారు. వారికిస్తున్న శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ అనుపమ, ఎంఈఓలు కృష్ణవేణి, సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.
ATP: శింగనమలలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రారంభించారు. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ఉచిత కుట్టు శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుతం కుటుంబ పోషణలో మహిళల పాత్ర చాలా కీలకంగా మారిందని అన్నారు. శింగనమల నియోజకవర్గానికి కూటమి ప్రభుత్వం తరఫున 500 కుట్టుమిషన్లు మంజూరు అయ్యాయని తెలిపారు.
CTR: ఒంటిమిట్ట కోదండ శ్రీరాములస్వామి వారిని ఎంపీ మిథున్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు ఏర్పాటు చేశారు. అయనతోపాటు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, వైస్ ఎంపీపీ రామిరెడ్డి తదితరులు ఉన్నారు.
శ్రీకాకుళం: కంచిలి మండలం ఘాటి ముకుందపురం గ్రామంలో శ్రీ త్రినాథ స్వామి (బ్రహ్మ, విష్ణు, మహేశ్వర) మందిర ప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం వైభవంగా జరిగింది. ఈ మేరకు విగ్రహాలను గ్రామంలో ఊరేగింపు నిర్వహించి ప్రతిష్ఠ చేశారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పెద్దలు, మహిళలు, కమిటీ సభ్యులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
W.G: నాటి ఎంపీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలపై బుధవారం ఉండిలో ఆయన ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విచారణకు హాజరైన ఆమె వింత సమాధానాలు వింటే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే అన్నారు. MBBS చదివిన ఆమెకు శరీరంపై గాయాలు గురించి అవగాహన లేదనడం వింతగా ఉందన్నారు.