VZM: స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని నెల్లిమర్ల మునిసిపల్ కమిషనర్ కె.అప్పలరాజు పిలుపునిచ్చారు. మూడవ శనివారం నిర్వహించే స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక కేజీబివీ పాఠశాల,సువ్వాని వీధిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పారిశుద్ధ్యం మరింత మెరుగుపర్పాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్వచ్చ ఆంధ్రకు శ్రీకారం చుట్టిందన్నారు.
VZM: దత్తిరాజేరు మండలంలోని దాసుపేట గ్రామంలో శనివారం నిర్వహించిన రామాలయం ప్రతిష్ట మహోత్సవంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
KRISHNA: కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కోరారు. శనివారం కె.బి.ఎన్ కాలేజీలో ఉపాధ్యాయులతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం ఉపాధ్యయులకు ఎన్నికల ప్రచార కరపత్రాలు పంపిణీ చేశారు.
CTR: సదుం ఎంపీటీసీ సభ్యుడు, వైసీపీ సీనియర్ నాయకుడు చినేపల్లి ఆనంద(54) అస్వస్థతతో శనివారం మృతి చెందారు. అనారోగ్యంతో కొద్దిరోజులుగా ఆయన రేణిగుంట సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆనంద మృతికి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకనాథరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
పల్నాడు: ఈపూరు మండలంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా తమ నివాస స్థలాలు, కార్యాలయాలను ప్రతి ఒక్కరూ శుభ్రం చేసుకోవాలని ఏంపీడీఓ తెలిపారు. ముందుగా విద్యార్థులతో కలిసి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణా: నందిగామ పట్టణ పరిధిలో ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందుల వెంకట్రావు శనివారం పట్టణ పరిధిలోని పలు ప్రభుత్వ ఉపాధ్యాయులను కలిసి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ విజ్ఞప్తితో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. తాను ఈ ప్రాంతం వాడినని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.
VZM: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గోర్ బంజారా సమాజం ఆధ్యాత్మిక గురువుగా భావించే బంజారా సమాజానికి చెందిన సామాజిక సంస్కర్త, ఆధ్యాత్మిక నాయకుడైన సంత సేవాలాల్ మహారాజ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
VZM: ఇకపై నిబంధనలు పాటించని వారి లైసెన్స్లను రద్దు చేస్తామని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం ముగింపు కార్యక్రమం జరిగింది. వేగం కన్నా సురక్షితంగా చేరడం ముఖ్యమని, ప్రతి వాహన దారుడు తాను సురక్షితంగా ఉంటూ పక్క వారిని కూడా సురక్షితంగా ఉంచాలన్నారు.
ప్రకాశం: చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అందరూ చెబుతున్నారే తప్ప ఎవ్వరూ ఆచరించడం లేదని CM చంద్రబాబు వద్ద ఓ విద్యార్థిని అసహనం వ్యక్తం చేసింది. స్టేజ్పై ఆమె మాట్లాడుతూ.. కందుకూరుకు నేడు(శనివారం) CM వస్తున్నారని అధికారులు చెత్తను తొలగించారేగాని ప్రతి రోజూ ఎక్కడి చెత్త అక్కడే ఉంటోందని ఆమె వాపోయింది.
PPM: రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ అధికారి టీ.దుర్గా ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు హెల్మెట్ పెట్టుకున్న వాహనదారులకు కీ చైన్లు అందించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నారాయణ రావు మాట్లాడుతూ తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు అందరూ హెల్మెట్ ధరించుకోవాలని అవగాహన కల్పించారు.
PPM: జిల్లాలో పదవ తరగతి చదివే విద్యార్థులందరూ వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేశారు. కొందరు విద్యార్థులు కొన్ని సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నట్లు గురువారం నిర్వహించిన పల్లె నిద్రలో గమనించడం జరిగిందని అన్నారు.
ప్రకాశం: గిద్దలూరు డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ నిషా కుమారి అడవికి నిప్పు పర్యావరానికి ముప్పు అనే శీర్షికతో అడవులపై అవగాహన కల్పించే గోడపత్రాన్ని విడుదల చేశారు. ఎండాకాలం సమీపిస్తున్న సమయంలో అడవులలో ఎండు గడ్డి రాలుతుందని పొరపాటున కూడా నిప్పు పెట్టరాదు అన్నారు. అడవికి నిప్పు పెడితే గ్రామాల వరకు వ్యాపించి పర్యావరణానికి మానవులకు ముప్పు కలుగుతుంది.
ప్రకాశం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా కలెక్టర్ అన్సారియా చెప్పారు. ఒంగోలులోని రవాణా శాఖ జిల్లా కార్యాలయంలో జరిగిన జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు సభలో శనివారం కలెక్టర్ మాట్లాడుతూ.. వాహనాల చోదనలో ఎక్కువమంది నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు.
PPM: జిల్లాలో గృహాల నుంచి సేకరిస్తున్న చెత్త నుంచి సంపదను సృష్టించే దానిపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తడి, పొడి చెత్తలను వేరుచేసి, వర్మి కంపోస్టుల ద్వారా సంపద సృష్టించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. దీనికి ఈఓపీఆర్డీలు, పంచాయతీ సెక్రటరీలు బాధ్యత వహించాలని కలెక్టర్ సూచించారు.
VZM: జిల్లాలో కౌలు కార్డు కలిగిన ప్రతి కౌలు రైతుకు రుణాలు మంజూరు చేయించే లక్ష్యమని కలెక్టర్ అంబేద్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికోసం ఇప్పటికే ఫిబ్రవరి 11 నుంచి 14వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించామన్నారు. 126 మంది కౌలు రైతులకు రుణాలు ఇచ్చామన్నారు.