CTR: మార్చి 15న నగరంలోని ప్రముఖ పొన్నియమ్మన్ ఆలయ మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త సీకే లావణ్య బాబు తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 15, 16, 17 తేదీల్లో కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రులు కావాలని కోరారు.
GNTR: బర్డ్ ఫ్లూ ప్రభావంతో గుంటూరు నగరంలో చికెన్ ధరలు అమాంతం తగ్గిపోయాయి. కేజీ చికెన్ రూ. 140, రూ.160ల బోర్డులు పెట్టినా కొనేవారు లేక వెలవెలబోతున్నాయి. ఇదే అదునుగా చేపలకు డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో చేపల మార్కెట్, మిర్చియార్డు, ఆర్టీవో ఆఫీస్ రోడ్, పొన్నూరు రోడ్డు, అమరావతి రోడ్డు ప్రాంతాల్లోని ఆదివారం మాత్రమే దుకాణాలు కళకళలాడుతుంది.
W.G: తణుకు పరిసర ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో కోడి మాంసం అమ్మకాలు లేకుండా దుకాణాలను మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో మార్కెట్లో చేపలకు, రొయ్యలకు, మటన్కు భారీ డిమాండ్ పెరిగింది. ఆదివారం కావడంతో మాంసం ప్రియులు ఆయా దుకాణాల వద్ద క్యూలు కడుతున్నారు. ఇదే అదునుగా చేసుకుని దుకాణ యజమానులు ధరలు పెంచేస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు
GNTR: సమకాలీన సమాజంలో కీలకమైన భాగంగా కృత్రిమ మేధస్సు (AI) ఉద్భవించిందని.. మానవ ఉనికి విభిన్న కోణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఏఎన్యూ తాత్కాలిక ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధరరావు అన్నారు. విశ్వవిద్యా లయంలో విద్యార్థులకు ఏఐపై 2 రోజులుగా జాతీయస్థాయి సదస్సు నిర్వహించామన్నారు. హైదరాబాద్లోని వర్ధన్ డేటా సైన్స్ అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి పాల్గొన్నారు.
E.G: బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్ వినియోగంతోపాటు గుడ్ల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు రూ.4.90లు పలికిన గుడ్డు ధర ఇప్పుడు రూ.4.55లకు పడిపోయింది. ఈ ప్రభావం కేక్లపై కూడా పడింది. చాలామంది కేక్లు తినేందుకు ఇష్టపడడం లేదు. ఉమ్మడి జిల్లాలో గుడ్ల ఉత్పత్తి 1.30 కోట్ల మేర ఉండగా, స్థానికంగా వినియోగం 30 శాతం ఉంటుంది.
GNTR: నగరానికి చెందిన మస్తాన్ సాయి పోలీస్ కస్టడీ ముగియడంతో నార్సింగ్ పోలీసులు తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు. డ్రగ్స్కి బానిసలుగా మార్చి యువతులపై అఘాయిత్యాలకు పాల్పడి నగ్న వీడియోలు తీసిన కేసులో మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు రెండు రోజులు కస్టడీకి తీసుకొని విచారించారు. అయితే పోలీసులు అడిగిన ప్రశ్నలకు మస్తాన్ సాయి సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేశారు.
ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సుబ్రహ్మణ్యంకు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ షోకాజ్ నోటీసులు శనివారం జారీ చేశారు. గత కొంతకాలంగా పాఠశాల విద్యార్థులు ఎదుట దైవ దూషణ చేయడం, విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఎంఈఓ రాముడు డీఈఓకు అందజేశారు. అనంతరం విచారణ జరిపి షోకాజ్ ఇచ్చినట్లు తెలిపారు.
W.G: నరసాపురం మండలంలోని లక్ష్మణేశ్వరం మహాత్మా జ్యోతిబాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ కె.శైలజ శనివారం తెలిపారు. మార్చి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 2025-2026 విద్యా సంవత్సరానికి గానూ 5,6,7,8,9వ తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు
GNTR: బెల్లంకొండ చండ్రాజుపాలెం NSP కాలువలో 3వ పెద్ద డ్రాపు వద్ద మొసలి సంచరిస్తున్నట్లు పలువురు చూడటంతో పరిసర ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. చింతపల్లి మేజర్ కాలువలో మొసళ్లు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈకాలువలో పాడి రైతులు పశువులను కడుగుతారని, యువకులు స్నానాలు చేస్తుంటారని అన్నారు. ఏప్పుడు ఏప్రమాదం సంభవిస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కోనసీమ: జిల్లాలో ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 52 కమర్షియల్ పౌల్ట్రీల్లో 24 లక్షల కోళ్లు ఉన్నాయని, 10చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఇతర జిల్లాల్లోని కోళ్ల ఉత్పత్తులు రానీయకుండా అరికట్టామన్నారు. ఇక్కడి మాంసం విక్రయదారులపై ఆంక్షలు విధించవద్దన్నారు. అంగన్వాడీ, పాఠశాలల్లో గుడ్లను బాగా ఉడికించాలని సూచించారు.
VZM: చీపురుపల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎ.రాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఐదవ తరగతి 80 సీట్లు, ఇంటర్మీడియట్ 80 సీట్లు ఉన్నట్లు ఆమె వెల్లడి చేశారు. మార్చి 6వ తేదీ లోపు వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని ఆమె తెలిపారు.
కొనసీమ: మండల కేంద్రం ఆలమూరులో గత మూడు రోజులుగా పంచాయితీ కుళాయి నీరు సరఫరా కాకపోవడంతో త్రాగు నీరు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని స్థానిక పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుందాపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
GNTR: ప్రశ్నించటానికే పుట్టానన్న పవన్ కళ్యాణ్ పాలనను పక్కనపెట్టి గుళ్ళు గోపురాలు తిరుగుతున్న ఈ డిప్యూటీ సీఎం రాష్ట్రానికి అవసరమా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఫైర్ అయ్యారు. పవన్ను జనం నమ్మారు గెలిపించారు. ఇప్పుడు ప్రశ్నించడం, పరిపాలన మానేసి కాషాయ గుడ్డలు వేసుకొని తిరుగుతుంటే దేవాదాయ శాఖ మంత్రి ఇస్తే సరిపోతుందన్నారు.
GNTR: పూరి నుంచి తిరుపతి వెళుతున్న (17479) ఎక్స్ప్రెస్ రైల్లో భారీగా గంజాయి పట్టుబడిన విషయం తెలిసిందే. రైల్వే స్టేషన్ 3వ నంబర్ ప్లాట్ ఫామ్ పై పోలీసులు తనిఖీలు నిర్వహించి 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కోచ్ 4 బ్యాగుల్లో గంజాయి లభించగా నిందితులు మాత్రం పరారు. గంజాయి ఎక్కడి నుంచి రవాణా చేస్తున్నారు,త్వరలో పట్టుకుంటామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
PLD: పల్నాడు జిల్లా ఎస్పీ కే. శ్రీనివాసరావు శనివారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మొక్కలు నాటారు. ప్రకృతిలో మొక్కల పెంపకం వలన కలిగే ప్రయోజనాలు ఎస్పీ తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను ఖచ్చితంగా స్వీకరించాలన్నారు. అదనపు ఎస్పీలు జేవి సంతోష్, అడిషనల్ ఎస్పీ సత్తిబాబు పాల్గొన్నారు.