ప్రకాశం: మద్దిపాడు మండలంలోని గార్లపేటలోనీ పొగాకు వేలం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా మంగళవారం సందర్శించారు. వేలం కేంద్రంలో పొగాకు అమ్మకాలను ఆమె పరిశీలించారు. వేలం నిర్వహణ అధికారి శ్రీనివాస్తో మాట్లాడి ధరలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేలా కృషి చేయాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
BPT: రేపల్లె ప్రభుత్వ ABR డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఓపెన్ జిమ్, స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటుకు ముహూర్తం కుదిరింది. స్థానికులు వినియోగించే ఈ ప్రదేశాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్ బుధవారం స్థలాన్ని పరిశీలించారు. వాకర్స్కు అనువుగా ఉండేలా జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
అన్నమయ్య: రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జూలై 1న రాయచోటి క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలకు తక్షణ పరిష్కార సూచనలు చేశారు. సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
అన్నమయ్య: జూలై 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమాన్ని పురస్కరించుకుని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్లు, యూనిట్ ఇంఛార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచి ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
VSP: వి.ఎం.ఆర్.డి.ఎ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వయో పరిమితిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా 60 సంవత్సరాల నుంచి 62 ఏళ్లకు పెంచాలని మంగళవారం ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వి.ఎం.ఆర్.డి.ఎ చైర్మన్ ఎం.వి ప్రణవ్ గోపాల్ కలసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనకి వినతి పత్రం అందజేశారు. పదవి విరమణ వయస్సును పెంచటం వల్ల ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
SKLM: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీసీసీబీ ఛైర్మన్ ఎస్.సూర్యం హాజరయ్యారు. ఈమేరకు ఆయన కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.
ELR: తాళ్లపూడి మండలం మలకలపల్లిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు రాజమండ్రి విమానాశ్రయంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సాదర స్వాగతం పలికారు. అనంతరం పెన్షన్ పంపిణీ సభా ప్రాంగణానికి తరలి వెళ్లారు.
VSP: చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో మంగళవారం ఆదరణ వృద్ధుల ఆశ్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కె. ఎస్. ఎన్. రాజు ప్రారంభించారు. ఖండిపల్లి కింగ్డమ్ పీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరాధారులైన తల్లిదండ్రులకు, వృద్ధులకు ఆశ్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు.
W.G: నరసాపురం మున్సిపాలిటీ పరిధిలోని మంచినీళ్ల చెరువును మంగళవారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పరిశీలించారు. చెరువులో ఉన్న పలు సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చెరువును పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యమైనదన్నారు.
CTR: జిల్లాలో 90.5 శాతం పింఛన్లను మంగళవారం మధ్యాహ్నం 12:00 గంటలకు పంపిణీ పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో మొత్తం 2,64,932 మంది లబ్ధిదారులు ఉండగా, 2,39,773 మందికి నగదును అందజేసినట్లు వెల్లడించారు. ఇవాళే 100% పెన్షన్ పంపిణీని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు.
SKLM: మెలియాపుట్టి మండల కేంద్రంలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో మండల టీడీపీ నాయకులు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు జన్మదినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ పేరిట పూజలు చేశారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు సలాన మోహనరావు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
NLR: పొదలకూరు యాడ్లో నిమ్మకాయల ధరలు కేజీలు రూ.15, బస్తా రూ. 1000 నుంచి రూ.1500 వరకు పలికిందని వ్యాపారాలు తెలిపారు. కాగా గత నెలలో కేజీ రూ.60 నుంచి రూ. 70 వరకు, బస్తా రూ. 4000 నుంచి రూ. 5000 వరకు పలికిందని ఇప్పుడు ధరలు పూర్తిగా తగ్గిపోయాయని ఆవేదన చెందారు. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
KKD: జగ్గంపేట నియోజకవర్గ స్థాయిలో రేపటి నుంచి 30వ తేదీ వరకు NDA కూటమి ఇంటింటా ప్రచారం నిర్వహించేందుకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గంపేట MLA జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. అలాగే వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని కోరారు.
కృష్ణా: ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేసే ప్రభుత్వం తమదని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. మంగళవారం ఉదయం ఆయన మచిలీపట్నం పరాసుపేటలో పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ను క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తేదీన అందజేస్తున్నామన్నారు.
KKD: జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ & వికాస ఆధ్వర్యంలో జులై 5వ తేదీన జగ్గంపేటలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం జగ్గంపేటలో జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ 33 కంపెనీలు పాల్గొంటాయన్నారు. టెన్త్ నుండి PG ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు.