మన్యం: పార్వతీపురం భాస్కర్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 9వ తేదీన జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య పేర్కొన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్, ఐటిఐ, ఏదైనా డిగ్రీ చదువు కొని 18 నిండి 28 ఏళ్లు వయసు గల నిరుద్యోగ యువతీ యువకులు మే 9వ తేదీన జరుగుతుంది అన్నారు.
BPT: బాపట్లలో కొలువై ఉన్న శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి నవాహ్నిక దీక్ష పూర్వక బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం వేడుకగా జరిగింది. అనంతరం శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి సూర్య ప్రభ వాహనంపై దివ్య మంగళ దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
గుంటూరు: జిల్లాలో కొత్త ఫ్లైఓవర్ ప్రభుత్వం నిర్మించనుంది. దీంతో నగరంలో ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. అధికారులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 7వ తేదీన ఫ్లైఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. శంకుస్థాపన కోసం గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికే స్థలాన్ని పరిశీలించారు.
గుంటూరు: ఈ నెల 4వ తేదీన పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు గ్రామంలో అప్పుడే పుట్టిన మగ శిశువును పంటపొలాల్లో వదిలి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శిశువును పొన్నూరులోని నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాల సూపరిండెంటెండ్ డాక్టర్ ఫిరోజ్ ఖాన్ వైద్య పరీక్షలు చేసి సంరక్షణలో ఉంచారు. సోమవారం శిశువును పొన్నూరు ఐసీడీఎస్ సిబ్బందికి అప్పజెప్పారు.
GNTR: పొన్నూరు పట్టణం రైల్వే స్టేషన్ రోడ్డు ఓవర్ బ్రిడ్జి ప్రక్కన సోమవారం గుర్తు తెలియని మృతదేహం (45) స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా అర్బన్ CI L. వీర నాయక్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడు ఎవరు, ఆత్మహత్యనా, హత్యనా అనే కోణంలో విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
PLD: ఎడ్లపాడులోని శ్రీ గంగా పార్వతీ సమేత రాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో 8వ వార్షికోత్సవం 6వ తేదీన వైభవంగా జరగనుంది. వేకువజాము నుంచి ప్రారంభమయ్యే వేడుకల్లో స్వామికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, పూజలు, వివిధ రకాల ప్రసాదాలు ఉంటాయి. సాయంత్రం చెంగీజ్స్కాన్పేట భజన బృందం కోలాట ప్రదర్శన ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది.
PPM: ఇచ్చాపురం ప్రజలకు త్రాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన సంతపేట పంప్ హౌస్ను సోమవారం ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ బాబు ప్రారంభించారు. త్రాగునీటిని అందించడంతో స్థానిక ప్రజలు ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
SKLM: పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో నూతన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ అంశంపై స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే ఆయన కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం నూతన కళాశాల మంజూరు చేసిందన్నారు
SKLM: విద్యార్థులు మాతృభాష తెలుగుతో పాటు ఇంగ్లిష్ భాషపైనా పట్టుసాధించాలని డోల క్రాంతి కుమార్ అన్నారు. సోమవారం మెలియాపుట్టి గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరంలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ పై అవగాహన కల్పించారు. స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా పదాలు ఎన్ని రకాలు వాటిని ఎలా ఉపయోగించాలో తదితర విషయాలు వివరించారు.
SKLM: విశాఖపట్నంలో ఇటీవల తెలుగు వెలుగు సాహితి వేదిక ఆధ్వర్యంలో భారత కీర్తి కిరీట పురస్కారం అందుకున్న శ్రీకాకుళం వాణిజ్య పనుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ జి రాణి మోహన్ను ఘనంగా సత్కరించారు. సోమవారం శ్రీకాకుళం స్థానిక శాఖ కార్యాలయంలో జీఎస్టీ అకౌంటెంట్స్తో పాటు ప్రాక్టీషనర్స్ ఘనంగా సన్మానించారు. ఈ క్రమంలో స్థానిక సిబ్బంది కూడా ఆమెకు అభినందనలు అందజేశారు.
SKLM: పాత పింఛన్ విధానం కోరుతూ డీఎస్సీ 2003 ఉపాధ్యాయుల పోస్ట్ కార్డు ఉద్యమాన్ని సోమవారం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం పాత పింఛన్ అమలు చేయాలని జిల్లా ఫోరం కన్వీనర్ శ్రీహరి డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన తపాలా కార్యాలయంలో పాత పింఛన్ విధానం అమలు కోరుతూ పోస్ట్ కార్డులు సీఎం చంద్రబాబుకు పంపారు.
SKLM: ఆమదాలవలస మండలంలోని కాట్యా చర్యులపేట గ్రామంలో నిర్మించిన శివాలయం రేపు (మంగళవారము) ఘనంగా ప్రతిష్ట మహోత్సవాలు జరగనున్నట్లు గ్రామ సర్పంచ్ ఎన్ని రామచంద్రరావు సోమవారం తెలిపారు. రేపటి నుండి మూడు రోజుల పాటు ఆలయ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నామని, అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆయన కోరారు.
SKLM: ప్రాథమిక స్థాయి నుంచే జాతీయ నాయకుల గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని రిసోర్స్ పర్సన్ లంకలపల్లి సూర్యనారాయణ అన్నారు. సోమవారం లావేరు గ్రంథాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి జాతీయ నాయకుల జీవిత చరిత్ర క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. అలాగే ప్రతిరోజు నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NLR: సోమశిల జలాశయం నీటి వివరాలను అధికారులు సోమవారం విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడం లేదని జలాశయ ఈఈ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. సోమశిల పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా జలాశయంలో 50.754 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 6వ క్రస్ట్ గేట్ ద్వారా పెన్నా డెల్టాకు 1000, దక్షిణ కాలువకు 30, ఉత్తర కాలువకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
NLR: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉలవపాడు మామిడి మార్కెట్లోకి వచ్చింది. నోరూరించే మధురమైన ఫలం ఈ ఏడాది అలస్యమైంది. ఈనెల మొదటివారం నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఉలవపాడు బంగినపల్లికి ఉన్న క్రేజ్, డిమాండ్ కారణంగా వాటి కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఉలవపాడు ప్రాంతంలో ప్రస్తుతం బంగినపల్లి కేజీ రూ.100, పెద్ద రసాలు కేజీ రూ.120లుగా ఉన్నాయి.