TPT: పుత్తూరు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 9:30 గంటల నుంచి 5 వరకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం జరగనుందని MPDO శ్రీదేవి తెలియజేశారు. గ్రామాలలో నీటి భద్రత, సహజ భాగస్వామ్యంపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మండల పరిధిలోని వార్డు సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు హాజరుకావాలని ఆమె కోరారు.
పల్నాడు: ప్రపంచ టీబీ (క్షయ) దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రత్యేక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీబీ నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించడం, ముందస్తు పరీక్షలు, సమయానికి చికిత్స తీసుకోవడం ఎంతో అవసరమని సూచించారు.
కడప: న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక కోసం ఈ నెల 30వ తేదీ పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారిగా నియమితులైన సీనియర్ న్యాయవాది బాలాజీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ట్రెజరర్ పదవులకు 24వ తేదీ మంగళవారం, 25న బుధవారం నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు.
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. ప్రతిరోజు సాయంత్రం ఆధ్యాత్మికపరమైన సంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ పీలా నాగ శ్రీను, ఈవో శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
ELR: నీటి సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా జడ్జి రత్న ప్రసాద్ సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రానున్న రోజుల్లో మంచినీటి కోసం యుద్ధం జరిగే రోజులు రానున్నాయని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యాలయం వద్ద స్పష్టం చేశారు. నీటిని వృథా చేయకూడదని సూచించారు. భూగర్భజలాలను సంరక్షించకపోతే భవిష్యత్ తరాలకు నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు.
అల్లూరి: చింతపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 4వ జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ విజయభారతి తెలిపారు. మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు గాను కళాశాలల్లో జాతీయ స్థాయి సెమినార్లు నిర్వహిస్తున్నామన్నారు. మానసిక ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం అంశాలపై సెమినార్ ఉంటుందన్నారు.
BPT: సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 28న చీరాలకు విచ్చేయనున్నట్లు సమాచారం. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సీఎం పర్యటనపై సీఎంఓ అధికారులు స్థానిక టీడీపీ ఎమ్మెల్యేతో చర్చలు జరిపినట్లు సమాచారం. తక్కువ వ్యవధి ఉండటంతో ఏర్పాట్లు ప్రారంభించారు. సీఎం చీరాల సముద్ర తీరాన్ని కూడా సందర్శించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.
E.G: కొంకుదురు బుడతలు మామిడి వద్ద ఉగాది పర్వదినాన ప్రారంభమైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వసంత నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్వామివారిని రంగురంగుల పుష్పాలతో అందంగా అలంకరించి పూలంగి సేవ నిర్వహించారు. అర్చకులు రమణ శర్మ, పంతులు మాస్టారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, విశేష అర్చనలు నిర్వహించారు.
CTR: కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రదీప్ కుమార్ తెలిపారు. ఇందులో సుమారు 33 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. 10th, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ తదితర డిగ్రీ చేసిన యువత ఇందులో పాల్గొనవచ్చన్నారు.
KDP: బద్వేలులోని రైతుబజారులో కూరగాయల స్టాల్స్ పెట్టుకునేందుకు నియోజకవర్గ రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని మార్కెట్ యార్డ్ ఛైర్మన్ సుప్రజ కోరారు. స్థానిక మార్కెట్ యార్డ్లో సోమవారం ఆమె మాట్లాడుతూ.. దరఖాస్తు ఫారాలు మార్కెట్ యార్డ్లో అందుబాటులో ఉన్నాయన్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల రైతులు, డ్వాక్రా సంఘాల వారు అర్హులన్నారు.
KDP: తాడేపల్లిగూడెం డీఎస్ చెరువు వద్ద ఉన్న బీవీఆర్ కళాకేంద్రంలో వ్యవస్థాపకులు బుద్దాల వెంకట రామారావు ఆధ్వర్యంలో 33 వ జాతీయ స్థాయి నాటిక పోటీలు సోమవారం అర్ధరాత్రి వరకూ జరిగాయి. దీనిలో భాగంగా నాలుగో రోజు మొదటి నాటికగా ప్రదర్శించిన ‘ఇది అతని సంతకం’ నాటిక’ తొలిరోజు విజేతగా ప్రకటించారు. ఈ నాటిక ప్రజలకు ఎంతో నచ్చినట్లు పేర్కొన్నారు. ఇవాళ చాలా నాటికలు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.
విశాఖ: బడేవలస-కొంపంగి రహదారిలో గోపీనాథ్ పట్నాయక్ చెరువు వద్ద రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. ఈ మార్గంలో రోజూ భారీగా వాహన రాకపోకలు జరుగుతున్నప్పటికీ, రహదారి దుస్థితి కారణంగా ప్రమాదాల భయం నెలకొంది. వెంటనే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు అధికారులను కోరుతున్నారు. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోతున్నారు.
నంద్యాల: వైయస్ నగర్లో ఫుడ్ పాయిజన్ ఘటన ఇవాళ కలకలం రేపింది. సుమారు 50 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి వెంటనే స్పందించి పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.