SKLM: రాష్ట్ర హోంమంత్రి అనిత శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు హోం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
శ్రీకాకుళం: నగరంలోని పెద్ద మార్కెట్లో వ్యాపారుల జాబితా తయారైతే ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేయడానికి ముందుకు వెళతామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.పెద్ద మార్కెట్ పునర్నిర్మాణ పనుల కోసం ఈ నెల 15లోగా షాపులు ఖాళీ చేయించాలని మంత్రి అచ్చెన్న ఇటీవల ఆదేశించారు. దీంతో వ్యాపారులంతా బుధవారం ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు. స్థలాలు కేటాయింపుపై చర్యలు తీసుకుంటామన్నారు.
SKLM: సీతంపేట మండల రేగులగూడ గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో సవర లక్ష్మణరావు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న పాలకొండ ఎమ్మెల్యే జయక్రిష్ణ కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు. వారికి స్వయంగా కొంత ఆర్ధిక సహాయం చేశారు. ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పించుటకు తగు చర్యలు తీసుకుంటానని భరోసా కల్పించారు.
W.G: భీమవరం పోలీస్ క్వార్టర్స్లోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో జిల్లా అద్నాన్ నయీం అస్మి ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఎస్పీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి వేద ఆశీర్వచనాలను అందజేశారు. అనంతరం నిరుపేదలకు బట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జయ సూర్య పాల్గొన్నారు.
అన్నమయ్య: జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని మదనపల్లెకు చెందిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిగార్ సుల్తానా ధీమా వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షురాలుగా నియమించినందుకు పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి ప్రతి ఒక్కరిని కలుపుకుని పార్టీని బలోపేతం చేస్తానన్నారు.
TPT: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం తిరుపతికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ దుస్సాలువతో సత్కరించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
తూ.గో: పాతపట్నం మండలం గంధం సరియా, గురండి గ్రామాల్లో బుధవారం రీ సర్వే కార్యక్రమం రెండవ విడత జరిగింది. గ్రామాలలో రాబోయే రెండు నెలల కాలంలో రైతుల సమక్షంలో భూముల సర్వే నిర్వహిస్తారని తహసీల్దార్ తెలిపారు. అందులో భాగంగా గురండి గ్రామంలో రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించుటకు నిర్వహించిన గ్రామ సభ, ర్యాలీలో టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి పాల్గొన్నారు.
శ్రీకాకుళం: పాతపట్నం నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను ఆర్జీల రూపంలో ఎమ్మెల్యేకు సమర్పించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
KDP: ఏప్రిల్ 11న ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా 13 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామని సీఐ బాబు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కడప- చెన్నై జాతీయ రహదారి ఉప్పరపల్లె పంచాయతీ సాయిబాబా గుడి సమీపంలో కారు, బస్సు, ద్విచక్ర వాహనాల తదితర వాహనాల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామన్నారు. కేటాయించిన ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాలని ఆయన సూచించారు.
KDP: పేద కుటుంబాలు సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం కడప నియోజకవర్గంలోని లబ్ధిదారులకు రూ.8,35,192 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సమస్యలు త్వరగతిన పరిష్కరిస్తూ, ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుందని తెలియజేశారు.
NDL: సీఎం సహాయ నిధి పేదలకు ఒక వర్గం లాంటిదని నందికొట్కూరు శాసనసభ్యులు జయసూర్య అన్నారు. పాముల పాడు మండల, ఇస్కాలకు చెందిన నాగమణికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన రూ. 23, 920 సంబంధించిన చెక్కును ఆయన బుధవారం అందజేశారు. కన్వీనర్ రవీంద్ర రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ హరినాథ్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
KRNL: మే 15వ తేదీ నుంచి 18 వరకు తిరుపతిలో జరిగే అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నక్కీ లెనిన్ బాబు అన్నారు. కర్నూలులోని సీఆర్ భవన్లో విలేకరుల సమావేశంలో జాతీయ మహాసభల వాల్ పోస్టర్లను విడుదల చేశారు.
KRNL: ఉపాధి నిధులతో తాజాగా 225 పశువుల షెడ్ల నిర్మాణాలకు కలెక్టర్ రంజిత్ భాషా అనుమతులు ఇచ్చినట్లు జిల్లా నీటి యాజమాన్య PD వెంకటరమణయ్య బుధవారం తెలిపారు. ఇప్పటి వరకు 6 విడతల్లో 1,245 షెడ్లు, మంజూరుకాగా, 91శాతం షెడ్ల పనులు మొదలయ్యాయన్నారు. వేసవిలో పశువుల కోసం 358పశువులతొట్లు మంజూరు కాగా, ఒక్కో తొట్టి నిర్మాణానికి రూ.34 వేలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.
KRNL: డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఏప్రిల్ 14న ఎమ్మిగనూరులోని తహాసీల్దార్ కార్యాలయ ఆవరణలో తలసేమియా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం చేయాలని అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు కదిరికోట ఆదెన్న, జి. ఆనంద్ చైతన్య మాదిగలు బుధవారం తెలిపారు. రక్తదానం చేసి మానవత్వం చాటుకోవాలని పిలుపునిచ్చారు.
కృష్ణా: ఇబ్రహీంపట్నంలో గతేడాది కృష్ణా నది వరదల్లో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఏపీసీపీడీసీఎల్ లైన్మెన్ కోటేశ్వరరావు కుటుంబానికి బ్యాంక్ అధికారులు రూ.28లక్షల బీమా చెక్కును అందజేశారు. డివిజనల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మృతుడి భార్య మాధవీలతకు బ్యాంక్ మేనేజర్ మునీర్, ఏపీసీపీడీసీఎల్ డీఈ వసంతరావు చెక్కు అందించారు.