• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జూలై1 నుంచి ప్యాసింజర్ రైలు ఛార్జీల మార్పు

VSP: ప్యాసింజర్ రైలు చార్జీల పెంపు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తున్నాయని విశాఖ రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. సాధారణ తరగతిలో 500 కి.మీ. వరకు దూరాలకు ఎటువంటి పెంపూ లేదు. 501 నుంచి 1500 కి.మీ. దూరాలకు రూ. 5, 2500 కి.మీ. దూరాలకు రూ. 10, 2501 km నుంచి 3000 కి.మీ. దూరాలకు రూ. 15 పెంపు ఉంటుందని రైల్వే శాఖ ప్రకటించింది.

June 30, 2025 / 08:13 PM IST

ఎంపీ అవినాష్‌కు సమస్యల వెల్లువ

KDP: వేముల మండలం పెద్దచటూరులో సోమవారం ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటించారు. కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను విన్నవించారు. పక్కా గృహాలు వివిధ రకాల పెన్షన్లు మంజూరు చేయాలని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించి అధికారులకు ఫోన్ చేసి వాటిని పరిష్కరించాలని సూచించారు.

June 30, 2025 / 08:11 PM IST

తాగునీటి పైప్ లైన్‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన

VZM: భోగాపురం మండలం ముక్కాంలో తాగునీటి పైప్ లైన్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 25 ఏళ్ల నుంచి తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఏళ్ల కాలం నుంచి ఉన్న సమస్యను పరిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. వివిధ వనరులు నుండి నిధులు సేకరించి తాగు నీటి పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

June 30, 2025 / 08:03 PM IST

‘చట్టసభలపై అవగాహన కల్పించాలి’

KRNL: నేటితరం విద్యార్థులకు చట్టసభలపై అవగాహన కల్పించడం ఎంతగానో అవసరమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. సోమవారం నగరంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీవితంలో ఎవరూ కూడా ఆశించి పని చేయరాదని అన్నారు.

June 30, 2025 / 08:03 PM IST

వైసీపీ ప్రభుత్వలో విద్యారంగం నాశనం: టిఎన్ఎస్ఎఫ్

అన్నమయ్య: వైకాపా ప్రభుత్వ హయాంలోనే విద్యారంగం నాశనం అయ్యిందని టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్ ఎద్దేవా చేశారు. సోమవారం స్థానిక మదనపల్లె పార్లమెంట్ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ఈసెట్ కౌన్సిలింగ్ నిర్వహణపై విమర్శించడం జగన్ రెడ్డి అజ్ఞానానికి నిదర్శనమని పోలి శివకుమార్ విమర్శించారు.

June 30, 2025 / 07:47 PM IST

అన్నదాత సుఖీభవకు అర్హులు వీరే..!

KDP: పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకానికి వీరపునాయన పల్లె మండలంలో 6340 మంది రైతులు అర్హులని వ్యవసాయ అధికారి శ్యాంబాబు సోమవారం తెలిపారు. నిబంధనల మేరకు అర్హులైన ప్రతి ఒక్క రైతుకు నిధులు త్వరలో ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఆయన అన్నారు. బ్యాంక్ అకౌంటుకు ఆధార్ లింకులేని రైతులు వివరాలను కూడా ఇప్పటికే సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

June 30, 2025 / 07:39 PM IST

9న సమ్మెను జయప్రదం చేయండి

అన్నమయ్య: కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా జూలై 9న సమ్మెను జయప్రదం చేయాలని సమ్మె పోస్టర్లను సిఐటియు నాయకులు రైల్వే కోడూరు ఎన్జీవోహోమ్‌లో సోమవారం సాయంత్రం విడుదల చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే విధంగా కార్మిక చట్టాలలో మార్పులు చేసిందన్నారు.

June 30, 2025 / 07:37 PM IST

కమిటీ హాల్‌ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ

సత్యసాయి: సోమందేపల్లి మండలంలో నూతనంగా నిర్వహిస్తున్న కమిటీ హాల్‌ భవన నిర్మాణాన్ని హిందూపురం ఎంపీ పార్థసారథి సోమవారం పరిశీలించారు. ఎంపీ నిధుల కింద రూ. 80 లక్షల నిధులతో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా కమిటీ హాల్‌ భవనం నిర్మాణం ఎంత వరకు జరుగుతున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

June 30, 2025 / 07:30 PM IST

ఇంఛార్జ్ కమిషనర్‌గా AE జాన్సన్

SKLM : ఆమదాలవలస పురపాలక సంఘం కమిషనర్‌గా పూజారి బాలాజీప్రసాద్ సోమవారం పదవీ విరమణ పొందారు. ఈ మేరకు ఆమదాలవలస మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్ ఏఈ జాన్సన్‌కు బాధ్యతలు అప్పజెప్పారు. ఈ మేరకు సోమవారం ఇంచార్జ్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.

June 30, 2025 / 07:21 PM IST

‘గిరిజన ఇంజినీరింగ్ యూనివర్సిటీ పనులు పూర్తి చేయాలి’

PPM: జిల్లాలో కురుపాం కేంద్రంగా మంజూరైన గిరిజన ఇంజనీరింగ్ కళాశాల పనులు తక్షణమే పూర్తి చేయాలని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర డిమాండ్ చేశారు. ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెంటాడలో నిర్మిస్తున్న గిరిజన యూనివర్సిటీ నిర్మాణం ఏళ్లు గడుస్తున్న నేటికీ పూర్తి చేయకపోవడంతో గిరిజనులను మోసం చేయడమేనని అన్నారు.

June 30, 2025 / 06:47 PM IST

అర్జీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి: ఎస్పీ

సత్యసాయి: పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ వి. రత్న “ప్రజా ఫిర్యాదుల వేదిక” కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 60 పిటిషన్లలో భూ సమస్యలు, కుటుంబ కలహాలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత స్టేషన్ అధికారులను ఆదేశించారు.

June 30, 2025 / 06:26 PM IST

నాతవరం డిప్యూటీ ఎంపీడీవో మూర్తి బదిలీ

AKP: నాతవరం డిప్యూటీ ఎంపీడీఓగా పనిచేస్తున్న ఎస్ఎన్ వి. మూర్తి డుంబ్రిగూడ డిప్యూటీ ఎంపీడీఓగా బదిలీ అయ్యారు. ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ సిబ్బంది ఆయను ఘనంగా సన్మానం చేశారు. ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి మాట్లాడుతూ.. డిప్యూటీ ఎంపీడీఓ మూర్తి ఉద్యోగం పట్ల ఎంతో నిబద్ధతతో, నిజాయితీగా పనిచేశారని చెప్పారు.

June 30, 2025 / 06:13 PM IST

ఉద్యోగులను సత్కరించిన అడిషనల్ ఎస్పీ

W.G: పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పదవీ విరమణ చేపట్టిన ముగ్గురు పోలీస్ సిబ్బందిని అడిషనల్ ఎస్పీ భీమారావు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు సాధారణ ప్రభుత్వ ఉద్యోగం వేరు పోలీస్ ఉద్యోగం వేరన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

June 30, 2025 / 05:19 PM IST

PGRSలో 15 అర్జీలు స్వీకరణ

NLR: నందిగామలో సోమవారం రెవిన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేద కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అయన మాట్లాడుతూ.. మొత్తం అర్జీలు 15 వచ్చినవని అన్నారు. సదరు అర్జీలను సంబంధిత అధికారులు సకాలంలో పరిష్కరించే విధముగా చర్యలు చేపడతామని తెలిపారు.

June 30, 2025 / 05:18 PM IST

ప్రజల సమస్యలపై మంత్రి భరత్ దృష్టి

KRNL: కర్నూలు నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ దృష్టి సారించారు. సోమవారం కర్నూలులోని మంత్రి కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను అర్ధం చేసుకొని వాటికి తగిన పరిష్కారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.

June 30, 2025 / 05:13 PM IST