కోనసీమ: ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘స్టాప్ వాష్ అండ్ గో’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులపై నిద్రమత్తు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. దీనిపై దృష్టి సారించి అమలాపురంలో సోమవారం తెల్లవారుజామున డ్రైవర్లను ఆపి, ముఖం కడుక్కునేలా చేసి ప్రయాణానికి అనుమతిస్తున్నారు.