KRNL: జిల్లాలో కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, 20 సూత్రాల ఛైర్మన్ లంకా దినకరన్ పనితీరును ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర పథకాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించడం అవసరమన్నారు. అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇస్తే మెరుగైన సేవలు అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు. పరిపాలన బలోపేతంతో ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.