NTR: నందిగామ మండలంలోని రుద్రవరం, గొళ్లమూడి గ్రామాల్లో రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలను జాయింట్ కలెక్టర్ ఇలాకీయా పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్ల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రీ-సర్వే నిర్వహించి, ప్రత్యేక క్యూఆర్ కోడ్, రాజముద్రతో డిజిటల్ పాస్పుస్తకాలను రూపొందించి అందిస్తోందని తెలిపారు.