NDL: డోన్ తారకరామనగర్ కాలనీలో బుజ్జికృష్ణకు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ఇవాళ తెలిపారు. గేదెల పెంపకంతో జీవనం సాగించిన ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. బ్యాంకు రుణాల భారం తగ్గించేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు.