పల్నాడు: నరసరావుపేట సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. సుమారు 35-40 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందాడు. పట్టాలపైకి వచ్చిన వ్యక్తిని రైలు ఢీకొన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. లోకో పైలట్ రైలును ఆపి పరిశీలించగా అక్కడికక్కడే మృతి చెందినట్లు నిర్ధారించారు.