E.G: బొమ్మూరు PS పరిధిలోని ప్రధాన కూడళ్లలో బుధవారం SI రమేశ్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారికి జరిమానా విధించారు. తనిఖీల్లో భాగంగా వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లు, వారి తల్లిదండ్రులకు SI కౌన్సెలింగ్ ఇచ్చారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని ఆయన హెచ్చరించారు.