GNTR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో రేపు మేడికొండూరులో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి సంజీవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8వ తరగతి నుంచి పీజీ (MBA, M.Com) వరకు చదువుకున్న వారు, అలాగే ఐటీఐ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ మేళాకు హాజరుకావచ్చు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులన్నారు.