• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఎంపీ భరత్కు స్వాగతం పలికిన రైల్వే ఉద్యోగులు

VSP: ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛ వాల్తేరు డివిజన్‌ను నూతన సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లోనే ఉంచేందుకు కృషి చేసిన ఎంపీ శ్రీభరత్‌కి విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద రైల్వే ఉద్యోగులు, నాయకులు ఆయనను ఘనంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో రైల్వే యూనియన్ సీనియర్ విశ్రాంత నాయకుడు చలసాని గాంధీ, రైల్వే నాయకుడు RVSS రావు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

February 15, 2025 / 11:09 AM IST

లావేరులో మొక్కలు నాటిన జెడ్పీ సీఈవో

SKLM: లావేరు మండలం పరిధిలోని తాళ్లవలస పంచాయితీ సుభద్రాపురం గ్రామంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. ఇందులో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీధర్ రాజా పాల్గొని, మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి.వెంకటరాజు, ఈవోపీఆర్డీ పంచాయతీ కార్యదర్శి, వేతనదారులు పాల్గొన్నారు.

February 15, 2025 / 11:04 AM IST

ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణం

తూ.గో: కాజులూరు మండలం, గొల్లపాలెం గ్రామంలో శివాలయం పక్కన వేంచేసివున్న శ్రీ మాతా గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దశమి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఉదయం 11:54 స్వామివారి కళ్యాణం, కళ్యాణ అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు నిర్వహించనున్నారు. 

February 15, 2025 / 10:44 AM IST

హరిత ధర్మవరమే లక్ష్యం: మంత్రి సత్యకుమార్

సత్యసాయి: ధర్మవరంలోని బలిజ కల్యాణ మండపం వద్ద హిందూ శ్మశాన వాటికలో సిమెంట్ రోడ్లు, మురుగునీటి కాల్వల నిర్మాణం పనులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. అలాగే పట్టణంలో రూ.1.58 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. హరిత ధర్మవరమే లక్ష్యంగా పట్టణంలో మొక్కలు నాటుతున్నామని తెలిపారు.

February 15, 2025 / 10:43 AM IST

విజయపురి సౌత్‌లో పులుల కదలికలు 

పల్నాడు: వెల్దుర్తి మండలం విజయపురి సౌత్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఐదు పులుల కదలికలను కెమెరాలో గుర్తించామని ఫారెస్ట్ రేంజర్ సుజాత తెలిపారు. పులుల లెక్కింపు పూర్తయినట్లు తెలిపారు. ఒక ఆడ, మగ పులితో పాటు, మూడు పులి పిల్లలు ఉన్నట్లు తెలిపారు. ఫారెస్ట్‌లోకి వెళ్లొద్దని, నీరు కోసం గ్రామాలలోకి పులులు వచ్చే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

February 15, 2025 / 10:05 AM IST

విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

February 15, 2025 / 09:41 AM IST

ఈ నెల 16న కరాటే టోర్నమెంట్

ప్రకాశం: అద్దంకి పట్టణంలో నెల 16న కరాటే టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. కరాటే, కుంగ్ ఫూ పోటీలు నేషనల్ లేవల్లో జరుగుతున్నాయని చెప్పారు. సీనియర్ కరాటే మాస్టర్లు రాంబాబు, రత్నం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. అద్దంకిలోని గీతా మందిరం వద్ద ఈ టోర్నమెంట్ జరుగుతుందని తెలియజేశారు.

February 15, 2025 / 09:04 AM IST

సాయిబాబాను తాకిన సూర్యకిరణాలు

ప్రకాశం: పొదిలి పట్టణంలోని రథం బజార్లో ఉన్న సాయిబాబా దేవస్థానంలో సాయిబాబాను శనివారం ఉదయం సూర్యకిరణాలు తాకాయి. గర్భగుడిలోని స్వామివారిపై 10 నిమిషాల పాటు కిరణాలు ప్రసరించాయి. ఆలయం ఎదురుగా ఉన్న కొబ్బరి చెట్ల కమ్మల నీడను చీల్చుకుని సూర్యకిరణాలు గర్భగుడిని తాకడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

February 15, 2025 / 08:58 AM IST

ఘంటసాల ది గ్రేట్ చలనచిత్రానికి మంచిస్పందన

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఓ థియేటర్లో విడుదలైన ఘంటసాల ది గ్రేట్ చలన చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందని చిత్ర దర్శకుడు రామారావు తెలిపారు. థియేటర్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఒక గాయకుడికి పూర్తి నిడివి చిత్రాన్ని రూపొందించామన్నారు. అంతేకాకుండా నేటి తరానికి ఆయనను పరిచయం చేసినట్లే అవుతుందని స్పష్టం చేశారు.

February 15, 2025 / 08:23 AM IST

మండపల్లి సర్పంచ్ చెక్ పవర్ రద్దు

SKLM: ఇచ్ఛాపురం మండలంలోని మండపల్లి సర్పంచ్ పిట్ట శశిరేఖ చెక్ పవర్‌ను రద్దు చేసినట్టు ఎంపీడీఓ రామారావు శుక్రవారం తెలిపారు. 2021 నుంచి 2025 వరకు నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుధ్య పనుల్లో సర్పంచ్ రూ.85 లక్షల నిధులు దుర్వినియోగం చేసినట్లు పలుమార్లు గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని అన్నారు.

February 15, 2025 / 08:21 AM IST

ఆన్‌లైన్‌లో రూ.1.55లక్షల స్వాహా

కృష్ణా: సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ ఉపాధ్యాయుడు మోసపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న కానూరుకి చెందిన రమణమూర్తి అతని ఫోన్ కు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు  వస్తాయని మెసెజ్ వచ్చింది. దీంతో ఆయన విడతల వారీగా రూ.1.55లక్షలు పెట్టుబడి పెట్టారు. వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మోసపోయాయనని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

February 15, 2025 / 08:11 AM IST

ధర్మవరంలో వైసీపీ నుంచి బీజేపీలోకి చేరిక

అనంతపురం: ధర్మవరంలో బీజేపీ నాయకుడు డోలా రాజారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన 40 కుటుంబాలు శుక్రవారం బీజేపీలో చేరాయి. జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డోలా రాజారెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఆశయాలు, మంత్రి సత్యకుమార్ యాదవ్ పట్టణంలో చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారని అన్నారు.

February 15, 2025 / 07:48 AM IST

వాహనం ఢీకొని వృద్ధునికి తీవ్రగాయాలు

SKLM: నందిగం మండలం కొత్తఅగ్రహారం జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వృద్ధుని వివరాలు తెలియాల్సి ఉంది. నందిగాం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

February 15, 2025 / 07:17 AM IST

బీటెక్ పరీక్షల రీవాల్యుయేషన్ నోటిఫికేషన్విడుదల

NTR: కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో నవంబర్ 2024లో నిర్వహించిన బీటెక్ 3,5,7వ సెమిస్టర్ (2023-24విద్యా సంవత్సరం) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఫిబ్రవరి 17వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000చెల్లించాల్సి ఉంటుందని పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు.

February 14, 2025 / 08:06 PM IST

కర్నూలు జిల్లాకు చెందిన DSP మృతి

కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన బంత్రోతి నాగరాజు(50) మృతిచెందారు. రాజమహేంద్రవరంలో సీఐడీ ప్రాంతీయ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన.. కొంతకాలంగా కాలేయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ.. గతేడాది డిసెంబర్ వరకు మెడికల్ లీవ్‌లో ఉన్నారు. ఈనెల 2న తిరిగి విధుల్లో చేరారు. ఈ క్రమంలో గురువారం గాంధీపురం-3లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.

February 14, 2025 / 08:01 PM IST