• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

PAC సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను కలిసిన చిర్ల

కోనసీమ: ఇటీవల పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సభ్యులుగా నియమితులైన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్‌ని రామచంద్రపురం YCP కార్యాలయం వద్ద కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

May 4, 2025 / 06:50 PM IST

జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్

E.G: భారీ వర్షాల దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ఆదివారం నుంచి 72 గంటల పాటు కలెక్టరేట్, డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూం నంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్: 8977935611, 08832442344, కొవ్వూరు: 8500667698 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

May 4, 2025 / 06:20 PM IST

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

NDL: బనగానపల్లె మండలం ఫతేనగర్ గ్రామంలో మమత అనే వివాహిత కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మమత అనే మహిళ కుటుంబ కలహాలతో ఆదివారం నాడు పేడలో రంగు పసుపు నీళ్లు కలిపి తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

May 4, 2025 / 05:22 PM IST

బీచ్ ఫెస్టివల్లో ఆకట్టుకున్న సైకతశిల్పం

SKLM: సోంపేట మండలం బారువ బీచ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడు రోజులపాటు జరగనున్న ఈ బీచ్ ఫెస్టివల్లో ఇసుకతో చేసిన సైకతశిల్పం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సైకతశిల్పంలో ఆలీవ్ రిడ్లే తాబేళ్లు, బారువ లైట్ హౌస్ తదితర ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పర్యాటకులు ఎంతో ఆసక్తిగా రూపొందించిన సైకితశిల్పాన్ని ఆసక్తిగా చూశారు.

May 4, 2025 / 05:12 PM IST

భగీరథ మహర్షిని స్మరించుకోవడం మనందరి బాధ్యత: మంత్రి

NDL: నంద్యాల పట్టణంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లా బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి NMD ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పూర్వ పితామహులకు స్వర్గప్రాప్తి కల్పించడానికి దివి నుంచి గంగను భూమిపైకి వచ్చేలా చేశారని భగీరథ మహర్షిని కొనియాడారు.

May 4, 2025 / 05:03 PM IST

రైల్వే స్టేషన్‌ను సందర్శించిన ఎంపీ

BPT: చుండూరు గ్రామంలోని రైల్వే స్టేషన్‌ను ఆదివారం బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ సందర్శించారు. చుండూరు మండలంలోని నాలుగు గ్రామాల్లో రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ఆర్వోబీలు ఏర్పాటుకు 251 కోట్లు నిధులను తీసుకొచ్చిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్‌కి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ధన్యవాదాలు తెలిపారు.

May 4, 2025 / 05:00 PM IST

అహోబిలంలో నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు

NDL: ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలంలో వైశాఖమాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎగువ అహోబిలంలో ఆదివారం జ్వాలా నరసింహస్వామి యోగా నరసింహుని అలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేతంగా గరుడ వాహనంపై విహరించారు. అంతకుముందు స్వామి అమ్మ వార్లను పంచామృతాలతో అభిషేకించారు. రాత్రి స్వామి హనుమంత వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు.

May 4, 2025 / 04:54 PM IST

11న జిల్లాకు వైఎస్ షర్మిల

KRNL: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఆమె ప్రజలతో మమేకమయ్యేందుకు ఈనెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈనెల 11న కర్నూలులో, 12న నంద్యాలలో పర్యటనలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వైఎస్ షర్మిల పర్యటనను విజయవంతం చేయాలంది.

May 4, 2025 / 04:41 PM IST

రైతులను దగా చేసినవాడు చంద్రబాబు: మాజీ ఎమ్మెల్యే

PLD: అమరావతి రైతులను దగా చేసినవాడే సీఎం చంద్రబాబు నాయుడు అని మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు విమర్శించారు. వినుకొండలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 29 గ్రామాల రైతులు ధర్నాలు చేస్తే అభినందించిన చంద్రబాబు, ఇప్పుడు 53వేల ఎకరాలకు అదనంగా 46 వేల ఎకరాలు తీసుకుంటానంటూ ప్రకటనలు చేస్తున్నారని గుర్తుచేశారు. కొంతమంది వైసీపీ కార్యకర్తల పింఛన్లు రద్దు చేయడం దారుణమన్నారు.

May 4, 2025 / 04:08 PM IST

విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే

CTR: గంగవరం మండలంలోని కీలపట్ల పంచాయతీ పరిధిలో విద్యుత్ సమస్య శాశ్వతంగా పరిష్కారానికి నోచుకుందని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. కీలపట్లలోని కోనేటి రాయస్వామి ఆలయంలో స్వామివారిని ఆదివారం ఆయన దర్శించుకుని పంచాయతీ కేంద్రంలో రూ. 60 లక్షల ఆర్డీఎస్ నిధుల ద్వారా ఏర్పాటు చేసిన నాలుగు 100 కేవి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఆయన ప్రారంభించారు.

May 4, 2025 / 02:48 PM IST

రేపు ప్రజా దర్బార్ నిర్వహించనున్న లోకేష్

GNTR: మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను నేరుగా మంత్రికి విన్నవించుకోవచ్చు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య వచ్చిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని టీడీపీ కార్యాలయం పేర్కొంది.

May 4, 2025 / 02:35 PM IST

పహల్గాం దాడుల్లో అసువులు బాసిన వారికి నివాళులర్పిస్తూ రక్తదానం

VZM: రక్తదానం సామాజిక బాధ్యత అని మేమున్నామంటూ స్వచ్ఛంద సేవా సంఘం రక్తదాన విభాగం అధ్యక్షులు మహేష్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలో స్థానిక NVN బ్లడ్ బ్యాంకులో ఇటీవల జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల దాడుల్లో అసువులు బాసిన వారికి నివాళులర్పించి రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా.ఎం.శ్రావణి,మూర్తి,లత మౌళి,సూరిబాబు,చంద్రశేఖర్ పాల్గొన్నారు.

May 4, 2025 / 02:04 PM IST

ప్రమాద బాధితులకు మంత్రి సాయం

GNTR: కాకినాడ పర్యటనకు వెళ్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం భీమడోలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించారు. ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేయడానికి ఆయన తన కాన్వాయ్‌ను ఆపారు. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అనంతరం మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

May 4, 2025 / 01:55 PM IST

కుల గణన నిర్ణయం చారిత్రాత్మకం

BPT: కుల గణనపై మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు అన్నారు. ఇది సామాజిక న్యాయానికి దోహదపడుతోందని పేర్కొన్నారు. బాపట్ల బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కుల గణనపై పారదర్శకత లేకుండా మోసం చేశారని విమర్శించారు.

May 4, 2025 / 01:36 PM IST

‘నీటి పైప్ లైన్‌కు మరమ్మతులు చేపట్టాలి’

KDP: ప్రొద్దుటూరు మండలం కాకిరేనిపల్లిలో మంచినీటి పైప్‌లైన్ లీకేజీతో నీరు వృథాగా పోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక ట్రాక్టర్ల రాకపోకల వల్లనే పైప్‌లైన్ దెబ్బతిందని గ్రామస్థులు పేర్కొన్నారు. నీటి వృథాను అరికట్టేందుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.

May 4, 2025 / 01:32 PM IST