• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘స్వచ్ఛ భారత్‌కు స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా’

E.G: స్వచ్ఛ భారత్‌కు అసలైన స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు PVN మాధవ్ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన స్వచ్చ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంత్ గాడ్గే బాబా జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

February 23, 2026 / 12:20 PM IST

కురుపాంలో బీటీ రోడ్ల పనులు ప్రారంభం

PPM: కురుపాం మండలంలోని కొండలేవిడి ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి కోనపాడు వరకు 2.8 కి.మీ రూ.3 కోట్లతో, గాంధీనగర్ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి దొంగల బారామని వరకు 2.6 కి.మీ. రూ.2.6 కోట్ల నిధులతో బీటీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. NREGS నిధులతో ఈ పనులు ప్రారంభించామని ఐటీడిఏ AEE అప్పారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 12:15 PM IST

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

అయినవిల్లి మండలంలోని అయినవిల్లి లంక గ్రామంలో లబ్ధిదారులకు సోమవారం అంబాజీపేట ఏఎంసీ చైర్మన్ చిట్టూరి శ్రీనివాస్, టీడీపీ మండల అధ్యక్షుడు వస్కా శ్యామ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. డెక్క దుర్గా భవానికి రూ.62,163, జుత్తుక అరుణ కుమారికి రూ.42,142 నగదు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమ్మరి నాగవాణి మాధవి లలిత, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

February 23, 2026 / 12:12 PM IST

సజావుగా ఇంటర్ పరీక్షలు: కలెక్టర్

అనంతపురంలోని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని ఆర్ఐవో వివరించారు.

February 23, 2026 / 12:10 PM IST

‘వినాయకనగర్‌లో మౌలిక వసతులు కల్పించండి’

సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని వినాయకనగర్‌లో డ్రైనేజీ కాలువ, వీధి విద్యుత్ లైన్, వీధి కొళాయి ఏర్పాటు చేయాలని సీపీఎం, భవన నిర్మాణ కార్మిక సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. సోమవారం మండల ఎంపీడీవో వెంకటలక్ష్మికి నాయకులు వినతిపత్రం సమర్పించారు. కాలనీలో ప్రాథమిక సదుపాయాల లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పెద్దన్న వివరించారు.

February 23, 2026 / 12:05 PM IST

జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి

Akp: జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని నర్సీపట్నం ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర పిలుపునిచ్చారు. నర్సీపట్నంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 5వ విడత సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందని తెలిపారు. ఉద్యమి, సాధక్, ప్రధాతగా మూడు వర్గాలుగా సభ్యత్వాన్ని విభజించినట్లు పేర్కొన్నారు. కరపత్రాలను విడుదల చేశారు.

February 23, 2026 / 12:01 PM IST

ప్రభుత్వ ఉమెన్స్ కళాశాలను సందర్శించిన కలెక్టర్

శ్రీకాకుళం ప్రభుత్వ ఉమెన్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును ఆయన సంబంధిత గదులకు వెళ్లి పరిశీలించారు. విద్యార్థులకు త్రాగునీటి సదుపాయం వైద్య సదుపాయం పక్కాగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడరాదన్నారు.

February 23, 2026 / 12:00 PM IST

డ్రోన్ సహాయంతో కోడి పందాల నిర్వహకుల పట్టివేత

NLR: మనుబోలు మండలం పిడూరుపాలెం పొలాల్లో సోమవారం కోడిపందాలు నిర్వహించారు. పక్కా సమాచారంతో పోలీసులు డ్రోన్ కెమెరా ప్రయోగించారు. కోడిపందాలు ఆడుతున్న వారిని గుర్తించి, 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 21 బైకులు, రూ. 800 నగదు, 5 కోళ్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై శివ రాకేష్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 23, 2026 / 11:59 AM IST

కనిగిరిలో TDP కార్యకర్తల సమావేశం

ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక TDP కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

February 23, 2026 / 11:59 AM IST

బకాయిలు చెల్లించి కార్మికులను ఆదుకోండి: ఎమ్మెల్యే

NLR: 15 ఏళ్లుగా మూతపడి వేలాది కుటుంబాలను రోడ్డున పడేసిన షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శాసనసభలో సోమవారం గళమెత్తారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో దాదాపు 3 వేల మంది కార్మికులు పని చేసేవారన్నారు.పెండింగ్‌లో ఉన్న కోట్లాది రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేసి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

February 23, 2026 / 11:56 AM IST

కొమరోలులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ప్రకాశం: కొమరోలు మండలంలోని మాధవపల్లె గ్రామ సమీపంలోని క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సూరే శివ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

February 23, 2026 / 11:50 AM IST

ఘనంగా ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం

VSP: చినగదిలిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఇవాళ ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 23న పద్మశ్రీ పి.సి.సర్కార్ జన్మదినాన్ని పురస్కరించుకుని బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలికలు చదువుతో పాటు కళల్లోనూ రాణించాలని నిర్వాహకులు సూచించారు.

February 23, 2026 / 11:50 AM IST

నర్సీపట్నంలో న్యాయవాదులు నిరసన

AKP: నర్సీపట్నం న్యాయస్థానాల ఆవరణలో సోమవారం న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ట ప్రభాకర్ మాట్లాడుతూ కర్నూలు సిటీలో పవన్ కుమార్ అనే న్యాయవాది మీద సీఐ విక్రమ సింహ దాడి చేయడం అమానుషమని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

February 23, 2026 / 11:49 AM IST

చేనేత అంశంపై మంత్రి సవిత సమాధానం

సత్యసాయి: బడ్జెట్ సమావేశాల్లో సోమవారం మంత్రి సవిత పాల్గొన్నారు. చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. చీరాల చేనేత క్లస్టర్‌కు రూ.4.17 కోట్లు మంజూరు చేశామని, చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలిపారు. ధర్మవరంలో రూ.38.31 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

February 23, 2026 / 11:47 AM IST

గొడవ పడి తండ్రిపై దాడి చేసిన కొడుకు

కృష్ణా: పామర్రు మండలం కొండిపర్రు గ్రామంలో దారుణ ఘటన ఇవాళ చోటు చేసుకుంది. వేడి నీళ్లు కాస్తున్న సమయంలో తండ్రి సురేష్‌తో గొడవ పడిన కొడుకు మహేష్ కత్తితో దాడి చేశాడు. తండ్రిని మన వద్ద నరకడంతో తీవ్రంగా గాయపడిన సురేష్‌ను మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోని ఆయన మృతి చెందాడు. కొడుకు మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

February 23, 2026 / 11:46 AM IST