• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి విధులు బహిష్కరణ

W.G: తణుకు మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు తలపెట్టిన సమ్మెలో భాగంగా తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ విధులను మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో బహిష్కరిస్తున్నట్లు తణుకు యూనియన్ అధ్యక్షుడు ఉండ్రాజవరపు శ్రీను తెలిపారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ టి. రామ్ కుమార్‌కి సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.

July 1, 2025 / 10:19 AM IST

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

W.G: పెనుగొండ పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్‌లో గ్రామ కచేరి వద్ద ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయానికి మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వామివారికి పూజలు చేసి అలంకరణ నిర్వహించారు. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

July 1, 2025 / 10:11 AM IST

ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

PPM: జిల్లాలో ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వీరఘట్టం మండల వ్యవసాయ శాఖ అధికారి సౌజన్య హెచ్చరించారు. స్థానిక కార్యాలయంలో వీరఘట్టం ఎరువుల వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిబంధనలు పాటించని ఎరువుల షాపుల లైసెన్సులు రద్దు చేస్తామన్నారు.

July 1, 2025 / 10:08 AM IST

కాలేజీ బస్సు నుంచి పొగలు

W.G: ఆకివీడు నుంచి భీమవరం వెళ్తున్న ఓ బస్సు నుంచి మంగళవారం ఉదయం ఒక్కసారిగా పొగలు వెలువడ్డాయి. భీమవరం ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన బస్సు నుంచి ఈ పొగలు వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థులను కిందకి దింపేశారు. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

July 1, 2025 / 09:56 AM IST

పింఛన్ల కార్యక్రమాన్ని తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

ATP: గుత్తి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మంగళవారం పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్‌ల ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా తనిఖీ చేశారు. ఇంటింటికి తిరుగుతూ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. పింఛన్ల పంపిణీలో సాంకేతిక సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.

July 1, 2025 / 08:20 AM IST

విద్యుత్ స్తంబాన్ని ఢీకొన్న కారు

VSP: చైతన్య కళాశాల ప్రాంతంలో కారు విద్యుత్ స్తంబాన్ని ఢీకొన్న ఘటన  పీఎంపాలెంలో చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున వర్షంలో అదుపు తప్పడంతో విద్యుత్ స్తంబాన్ని ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం విరిగి రోడ్డుపై పడిపోయింది. కారు ముందు భాగం డామేజ్ అయ్యింది. కానీ ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు.

July 1, 2025 / 08:11 AM IST

కేరళ డీజీపీగా వీరవాసరం వాసి

W.G: కేరళ రాష్ట్ర పోలీస్ డీజీపీగా ప.గో జిల్లా వీరవాసరానికి చెందిన రావాడ ఆజాద్ చంద్రశేఖర్ సోమవారం నియమితులయ్యారు. కేరళ నూతన డీజీపీగా చంద్రశేఖర్‌ను నియమిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలియడంతో చంద్రశేఖర్ స్వగ్రామంలో బంధుమిత్రులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈయన 1991లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.

July 1, 2025 / 07:07 AM IST

నిజాయితీగా రెవిన్యూ సేవలు అందించాలి: MRO

VZM: రెవెన్యూ సేవలు నిజాయితీగా అందించాలని బొబ్బిలి ఎమ్మార్వో ఎం.శ్రీను సూచించారు. సోమవారం స్దానిక MRO కార్యాలయంలో VROలు, రెవెన్యూ ఉద్యోగులతో ఆయన సమావేశం నిర్వహించారు. రెవెన్యూ పనులు కోసం అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2019కు ముందు ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేసిన ఇళ్లను క్రమబద్దీకరణ చేయాలన్నారు.

July 1, 2025 / 06:37 AM IST

పాల్తేరులో సీఐ పల్లెనిద్ర

VZM: బాడంగి మండలం పాల్తేరులో సోమవారం రాత్రి బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు పల్లెనిద్ర చేశారు. గ్రామంలోని పెద్దలు, ప్రజలతో సమావేశం నిర్వహించి గంజాయి వలన జరిగే నష్టం, మహిళలపై జరుగుతున్న నేరాలు నివారణపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గంజాయి వలన జీవితాలు నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

July 1, 2025 / 04:33 AM IST

వంట గదిలో భోజనం పరిశీలించిన హోంమంత్రి

AKP: పాయకరావుపేట బీసీ బాలికల కళాశాల హాస్టల్‌ను హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిలోకి వెళ్లి భోజనం, కూరలను పరిశీలించారు. భోజనం సరిగా లేదని.. ఈ మెనూ ఏంటని హోంమంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో కూడా సన్న బియ్యం వాడాలన్నారు. హాస్టల్‌పై సమగ్ర విచారణ జరిపి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

July 1, 2025 / 04:18 AM IST

ఆ కేసులో నిందితుడికి 14ఏళ్ల కఠిన కారాగార శిక్ష

VSP: జిల్లా గంజాయి కేసులో నిందితుడు నెల్ల తేజమూర్తికి 14 ఏళ్ళ కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1.40 లక్షలు జరిమానా విధిస్తూ.. విశాఖ మెట్రోపాలిటన్ మొదటి అదనపు జిల్లా కోర్టు తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం తెలిపారు. జరిమానా చెల్లించకపోతే మరో 6 నెలల సాధారణ జైలు శిక్ష అదనంగా విధించబడుతుందన్నారు.

June 30, 2025 / 08:19 PM IST

వెలగపూడిలో తాగునీటి కష్టాలు

GNTR: తుళ్లూరు మండలంలోని ఎన్టీఆర్ సుజల పథకం ప్లాంట్ మరమ్మతులకు గురవడంతో ఐదు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో వెలగపూడి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ప్లాంట్‌ను బాగుచేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని సోమవారం గ్రామప్రజలు విజ్ఞప్తి చేశారు.

June 30, 2025 / 08:18 PM IST

ఘరానా మోసగాళ్లను అరెస్టు చేసిన పోలీసులు

KRNL: తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ మోసం చేసిన ముఠాను కర్నూలు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. బాధితుడి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, నెల్లూరు, కర్నూలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నకిలీ బంగారు బిస్కెట్లు, నగదు, పోలీస్ యూనిఫామ్స్, వాకీ టాకీలు, హ్యాండ్ కఫ్స్ సహా అనేక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.

June 30, 2025 / 08:14 PM IST

జూలై1 నుంచి ప్యాసింజర్ రైలు ఛార్జీల మార్పు

VSP: ప్యాసింజర్ రైలు చార్జీల పెంపు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తున్నాయని విశాఖ రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. సాధారణ తరగతిలో 500 కి.మీ. వరకు దూరాలకు ఎటువంటి పెంపూ లేదు. 501 నుంచి 1500 కి.మీ. దూరాలకు రూ. 5, 2500 కి.మీ. దూరాలకు రూ. 10, 2501 km నుంచి 3000 కి.మీ. దూరాలకు రూ. 15 పెంపు ఉంటుందని రైల్వే శాఖ ప్రకటించింది.

June 30, 2025 / 08:13 PM IST

ఎంపీ అవినాష్‌కు సమస్యల వెల్లువ

KDP: వేముల మండలం పెద్దచటూరులో సోమవారం ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటించారు. కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను విన్నవించారు. పక్కా గృహాలు వివిధ రకాల పెన్షన్లు మంజూరు చేయాలని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించి అధికారులకు ఫోన్ చేసి వాటిని పరిష్కరించాలని సూచించారు.

June 30, 2025 / 08:11 PM IST