• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకలది ప్రధాన పాత్ర’

E.G: పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకల పాత్ర ఎంతో కీలకమని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిలికూరి శ్రీనివాసరావు తెలిపారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా కడియంలో పిచ్చుకల కోసం వరి కంకులు కట్టారు. వేసవిలో పక్షుల కోసం ప్రతి ఇంటిలో ఆహారం, నీరు ఏర్పాటు చేయాలని, అంతరించిపోతున్న పిచ్చుకలను కాపాడటం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.

March 21, 2026 / 08:38 AM IST

మార్కాపురంలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

ప్రకాశం: మార్కాపురం మండలం ఇడుపూరులోని ఆంజనేయ స్వామి గుడి వద్ద సంకుల మల్లయ్య అనే వ్యక్తి చనిపోయాడు. గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్సై వేమన మృతదేహాన్ని పరిశీలించారు. తల వెనుక గాయాలు ఉండటంతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు.

March 21, 2026 / 08:35 AM IST

నరసింహస్వామికి ప్రత్యేక పూజలు

KDP: లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలసిన వెయ్యి నూతులకోనలో శనివారం సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి తెల్లవారుజామున జల, పసుపు, కుంకుమ, చందన, తేనెతో పంచామృత అభిషేకాలు చేపట్టి అనంతరం పూల మాలలు, తులసి దళాలతో అలంకరించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

March 21, 2026 / 08:34 AM IST

అమలాపురం బిడ్డ.. జపాన్ బాట

కోనసీమ: అంతర్జాతీయ వైజ్ఞానిక రంగంలో ప్రతిభ చాటి జపాన్‌లో ప్రతిష్ఠాత్మక ‘సకురా’ పరిశోధనా కేంద్రానికి ఎంపికైన అమలాపురం మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి నక్కా సత్యప్రవీణ్‌ను MLA అయితాబత్తుల ఆనందరావు అభినందించారు. శుక్రవారం ఎమ్మెల్యేను కలిసిన ప్రవీణ్ బృందాన్ని ఉద్దేశించి.. కోనసీమ బిడ్డ విదేశాల్లో పరిశోధనలకు వెళ్లడం గర్వకారణమని పేర్కొన్నారు

March 21, 2026 / 08:33 AM IST

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జూలకంటి

PLD: మాచర్ల నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసాన్ని భక్తి, నియమ నిష్ఠలతో పాటిస్తూ ఉపవాస దీక్షలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. అల్లా కృపతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాతో ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని… ఐక్యంగా, సౌభ్రాతృత్వంతో జీవించాలని ఆకాంక్షించారు.

March 21, 2026 / 08:33 AM IST

చింతపండు ధరకు రెక్కలు

అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో చింతపండు సీజన్ ప్రారంభంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత ఏడాది కిలో రూ. 30కు పరిమితం కాగా, ఈసారి భారీగా పెరిగింది. ప్రస్తుతం వారపు సంతల్లో కిలో రూ.70 నుంచి రూ. 80 వరకు పలుకుతోంది. మార్చి మొదటి వారం నుంచి ఏప్రిల్ వరకు సీజన్ కొనసాగుతుంది. మంచి ధరలు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

March 21, 2026 / 08:30 AM IST

అప్పుల భారం.. కౌలు రైతు ఆత్మహత్య..!

NDL: జూపాడుబంగ్లా మండల కేంద్రానికి చెందిన అశోక్ (30) అనే యువ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పది ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న, పొగాకు పంటలు సాగు చేస్తున్న అతనికి గత ఐదేళ్లుగా నష్టాలు చవిచూశాయి. అప్పులు పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లికార్జున శుక్రవారం తెలిపారు.

March 21, 2026 / 08:27 AM IST

గ్యాస్ పాయింట్ వద్ద పోలీసులు ఆకస్మిక తనిఖీలు

NLR: గొలగమూడి HPC గ్యాస్ పాయింట్‌ను సివిల్ సప్లై అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. లబ్ధిదారులు గ్యాస్ బుకింగ్, డెలివరీ విధానంపై ఆరా తీశారు. సివిల్ సప్లై అధికారి లీలారాణి మాట్లాడుతూ వాణిజ్య సంస్థలకు బ్లాక్ ద్వారా గ్యాస్ విక్రయాలు జరిపితే చర్యలు తప్పవన్నారు. గ్యాస్ గురించి వినియోగదారులు ఆందోళన చెందవద్దని కోరారు. 

March 21, 2026 / 08:27 AM IST

భీమవరం గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ

W.G: భీమవరం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పాల్గొని వినతులు స్వీకరించారు. స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ  కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ సుజాత, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

March 21, 2026 / 08:25 AM IST

రెడ్డిపాలెంలో పోలీసుల ‘పల్లెనిద్ర’ కార్యక్రమం

BPT: చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డిపాలెం ఎస్సీ కాలనీలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని ఎస్సై శివ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

March 21, 2026 / 08:23 AM IST

అమరావతికి క్యూ కడుతున్న స్టార్ హోటళ్లు

GNTR: అమరావతిలో స్టార్ హోటళ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలు సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించగా, పనులు జరుగుతున్నాయి. 5-స్టార్ కేటగిరీలో నోవాటెల్, హిల్టన్, హయత్, వివాంత, క్రౌన్ ప్లాజా హోటళ్లు వస్తున్నాయి. 4-స్టార్ విభాగంలో హాలిడే ఇన్, మారియట్, దస్పల్లా, జీఆర్టీ, గ్రీన్ పార్క్, ఐటీసీ సంస్థలు తమ హోటళ్లను నిర్మిస్తున్నాయి.

March 21, 2026 / 08:20 AM IST

హనుమంతరాయ చౌదరి రాజకీయ ప్రస్థానం

ATP: హనుమంతరాయ చౌదరి సర్పంచి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. గతంలో మండల, సింగల్ విండో అధ్యక్షుడిగా, మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పదేళ్ల పాటు పార్టీని నడిపించారు. 2014లో కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన, ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతూ కన్నుమూశారు.

March 21, 2026 / 08:18 AM IST

విశాఖలో కేజీ దొండకాయలు రూ. 32

విశాఖ రైతు బజార్‌లో కాయగూరల ధరలు శనివారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. ఉల్లిపాయ రూ.17, టమాటా రూ. 8, బంగాళాదుంప రూ. 10, వంకాయ రూ. 28, మిర్చి రూ. 36, కాకరకాయ రూ. 24, మునగకాడలు రూ. 44, క్యారెట్ రూ.26, దొండ రూ. 32, బెండకాయ రూ. 24, బీరకాయ రూ. 34,కాలి ఫ్లవర్ రూ.14, క్యాప్సికం రూ. 46, కీర రూ. 28,అరటికాయలు రూ. 30గా ఉన్నాయి.

March 21, 2026 / 08:17 AM IST

వాకింగ్‌లో విషాదం.. బైక్ ఢీకొని వ్యక్తి దుర్మరణం

KKD: సామర్లకోట కెనాల్ రహదారిలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. హుస్సేన్ పురం గ్రామానికి చెందిన నొక్కు రమణ అనే అనే వ్యక్తి వాకింగ్ చేస్తుండగా వేట్లపాలెంకు చెందిన ఒక వ్యక్తి బైక్ తో ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రమాదంలో రమణ మృతి చెందగా బైక్ నడుపుతున్న వ్యక్తి కూడా తీవ్ర గాయాలకు గురైనట్లు తెలిపారు. 

March 21, 2026 / 08:15 AM IST

అధికారులు మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలి: మంత్రి

PPM: మున్సిపల్ ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైన నేపథ్యంలో సాలూరు మున్సిపాలిటీకీ స్పెషల్‌ ఆఫీసర్‌గా JC యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం స్థానిక మున్సిపల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి సిబ్బంది అంతా ప్రజలకు అందుబాటులో ఉండి పురపాలక సంఘ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

March 21, 2026 / 08:14 AM IST