AKP: నాతవరం మండలం తాండవ జంక్షన్లో అక్రమంగా ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల నుంచి ఆరు కేజీల గంజాయి స్వాధీన పరుచుకొని రిమాండ్కి తరలించామని నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ చెప్పారు. నాతవరం ఎస్సై భీమరాజుకు ముందస్తు సమాచారంతో బస్సుని ఆపడంతో నిందితులు పారిపోతుండగా సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
AKP: గొలుగొండ మండలం ఏఎల్.పురం గ్రామానికి చెందిన వికలాంగుడు మజ్జి రమేశ్కు న్యాయం చేయాలని ఎంపీపీ గజ్జలపు మణికుమారి కోరారు. మంగళవారం తహశీల్దార్ పి.శ్రీనివాసరావును కలిశారు. ఎంపీపీ మాట్లాడుతూ.. రమేశ్ తండ్రి మజ్జి నూకన్న ఇంటి స్థలం యొక్క ప్లాట్ నెంబరు 35 ప్రకారం కేటాయించిన స్థలంను వరుస క్రమంలో సరి చేసి ఇప్పించి వికలాంగుడికి న్యాయం చేయాలన్నారు.
పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. మంగళవారం పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనర్ బాలికను ప్రేమిస్తున్నాడని ఈ నెల 3వ తేదీ ప్రేమికుడిని కొట్టి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులపై దాడి చేసి వృద్ధురాలిని హత్య చేశారని తెలిపారు.
GNTR: పొన్నూరు నిడుబ్రోలు వద్ద విషాదం జరిగింది. భార్య మృతిని తట్టుకోలేక గుండెపోటుతో భర్త మరణించిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. మాజీ ఆర్మీ ఉద్యోగి అన్నవరపు ఆశీర్వాదం(85), భార్య సామ్రాజ్యం(76) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటున్నారు. సోమవారం రాత్రి సామ్రాజ్యం మృతిచెందగా, ఆమె మరణాన్ని తట్టుకోలేక ఆశీర్వాదం మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు.
GNTR: మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గుంటూరు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు అందింది. గుంటూరు కొరిటిపాడుకు చెందిన ఎలిజాల శిరీష (25) మానసిక స్థితి బాగోలేక 7వ తేదీన ఇంట్లో చెక్క దూలానికి చున్నీతో ఉరి వేసుకొని చనిపోయిందని తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు బుధవారం పర్యటన వివరాలను ఆ పార్టీ కార్యాలయం నుంచి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు జి.సిగడాం మండలంలోని గెడ్డకంచారంలో ‘నమస్తే ఎచ్చెర్ల – మన ఊరికి మన ఎమ్మెల్యే’ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నేతలు, స్థానికులు, ప్రజలు, కార్యకర్తలు హాజరు కావాలన్నారు.
కృష్ణా: నందిగామ పట్టణంలో బుధవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా నందిగామ ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.ఈ కార్యక్రమానికి నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలు సమస్యలను లిఖితపూర్వకంగా అందించాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.
KRNL: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా స్వయం సహాయక బృందాల్లో, ఒక్క రోజులోనే లక్షకు పైగా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను విక్రయించారు. దీంతో వారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కిందని ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన మిషన్ నుంచి ప్రశంసలు అందుకున్నట్లు పేర్కొన్నారు.
VZM: నీటి పన్ను వసూళ్లపై దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ ఆదేశించారు. తహసీల్దార్లు, ఆర్ఎస్డీటీలు, మండల సర్వేయర్లతో కలెక్టరేట్లో మంగళవారం రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపన్ను, పీజీఆర్ఎస్, రీసర్వే రెండవ దశ పై మండ...
SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి మంగళవారం ఓ ప్రకటన వచ్చింది. నియోజకవర్గంలో ఉన్న ప్రజలు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజాదర్బారును నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
SKLM: జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ మందిరంలో సమావేశం జరిగింది. ఆయన సహచర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి పాల్గొన్నారు. జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష చేపట్టారు.
అన్నమయ్య: జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మదనపల్లెకు చెందిన నిగర్ సుల్తానా నియమితులు అయ్యారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గాజుల భాస్కర్ ఈ మేరకు ఆమెకు మంగళవారం రాయచోటిలోని డీసీసీ కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
TPT: మాజీ సీఎం జగన్ ఒక వీధి రౌడీలా మాట్లాడటం మానుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హితవు పలికారు. చిల్లరి మాటలు మాట్లాడకూడదని, చట్ట పరిధిలోనే పోలీసులు పనిచేస్తున్నారన్నారు. కడపలో మహానాడును ఘనంగా నిర్వహిస్తామన్నారు. పదవుల రాలేదనే ఆవేదన కూటమి నేతల్లో ఉందని త్వరలో పదవులన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
NDL: పగిడ్యాలలో శ్రీరామ నవమి పండుగ పురస్కరించుకుని వైసీపీ మండల అధ్యక్షులు పుల్యాల నాగిరెడ్డి నేడు సాయంత్రం ఎద్దుల బండ లాగుడు పోటీలను ప్రారంభించారు. ఇందులో 8 జతల ఎద్దులు పాల్గొనాయని, గెలుపొందిన వారికి 1, 2, 3, 4 బహుమతులు కలవు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
NLR: బుచ్చి పట్టణంలోని దుర్గా నగర్లో గడ్డివామి దగ్ధమైంది. సంపత్ మురళి అనే పాడి రైతు గేదెల కోసం పది ఎకరాల ఎండు గడ్డివామి తీసుకువచ్చారు. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా గడ్డివామి తగలబడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. సుమారు లక్ష రూపాయలు నష్టం వాటిల్లందని పాడి రైతు సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు.