• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తల్లిదండ్రులపై కుమారుడు ఫిర్యాదు

CTR: కొలమాసనపల్లి అయ్యాంరెడ్డి పల్లికి చెందిన మోహన్ తన తల్లిదండ్రులపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి వివరాల మేరకు.. మోహను వీకోట మండలానికి చెందిన ప్రేమతో నాలుగు సంవత్సరాల కిందట వివాహమైంది. మోహన్ తన భార్యకు విడాకులు ఇస్తే ఆస్తిలో వాటా ఇస్తామని అతని తల్లిదండ్రులు బెదిరిస్తున్నారు. చేసేదేమి లేక తన తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

February 14, 2025 / 07:53 PM IST

స్వచ్ఛత కార్యక్రమంపై అవగాహన సదస్సు

KDP: పులివెందుల పట్టణంలోని చెన్నారెడ్డి కాలనీలో శనివారం ఉదయం స్వచ్ఛతా కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాముడు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పొడి, చెత్తలను వేరు చేయు విధానం, హోం కంపోస్టింగ్‌పై అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే మానవహారం, సామూహిక శుభ్రత కార్యక్రమాలు ఉంటాయన్నారు.

February 14, 2025 / 07:18 PM IST

వల్లభనేని వంశీ అరెస్టుపై హోంమంత్రి స్పందన

కృష్ణ: వల్లభనేని వంశీ అరెస్టుపై హోంమంత్రి శుక్రవారం స్పందించారు. కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలి పెట్టదని.. తప్పు చేసినవారికి శిక్ష తప్పదని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. విజయవాడలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో టీడీపీకి చెందిన వారిని డీజీపీ కార్యాలయాన్ని కూడా ముట్టుకోనిచ్చేవారు కాదన్నారు.

February 14, 2025 / 07:03 PM IST

పూర్ణా మార్కెట్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

VSP: పూర్ణా మార్కెట్‌ను శుక్రవారం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక చిరు వ్యాపారస్తులతో భేటీ అయ్యారు. వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వ్యాపారం చేసుకోడానికి మార్కెట్లో సముదాయలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు.

February 14, 2025 / 06:50 PM IST

మహా శివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి

ASR: హుకుంపేట మండలం ప్రముఖ శైవ క్షేత్రమైన మత్స్యగుండం మత్స్యలింగేశ్వరస్వామి మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ శుక్రవారం ఆదేశించారు. ఈనెల 25, 26, 27వ తేదీల్లో మత్స్యగుండం జాతర నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మూడు రోజులు తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు.

February 14, 2025 / 06:41 PM IST

వైఎస్ జగన్‌తో శివకోడు వైసీపీ నేత భేటీ

కోనసీమ: రాజోలు మండలం  శివకోడు వైసీపీ సీనియర్ నేత వర్మ తాడేపల్లిలో శుక్రవారం మాజీ సీఎం జగన్‌తో భేటీ అయ్యురు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారని వర్మ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై జగన్ పలు సూచనలు చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని చెప్పారన్నారు.

February 14, 2025 / 06:39 PM IST

విద్యార్ధులు కష్టపడి చదివాలి

ASR: రానున్న 10వ తరగతి రెగ్యులర్, ప్రైవేటు, ఓపెన్ స్కూల్ పరీక్షలు, ఇంటర్మీడియట్ రెగ్యులర్, ఓపెన్ స్కూల్ పరీక్షల్లో విద్యార్ధులందరూ కష్టపడి చదివి పాసవ్వాలని, ఇతర మార్గాలు అన్వేషించ వద్దని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం సూచించారు. ఆయా పరీక్షలు అత్యంత పకడ్బందీగా, ఎటువంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా నిర్వహించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.

February 14, 2025 / 06:35 PM IST

ప్రత్యేక కార్యాచణతో అభివృద్ధి ప్రణాళికల అమలు: కలెక్టర్

కృష్ణ: ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం కింద కేంద్రం ఎంపిక చేసిన ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు లో ప్రత్యేక కార్యాచరణతో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తుండటంతో మంచి ఫలితాలు వస్తున్నాయని కలెక్టరు లక్ష్మీశ్ అన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ రెండు బ్లాక్లను ముందంజలో నిలిచేలా కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం పెనుగంచిప్రోలులో క్షేత్రస్థాయిలో పర్యటించారు.

February 14, 2025 / 06:16 PM IST

పాడె మోసిన మంత్రి కొల్లు రవీంద్ర

కృష్ణా: మచిలీపట్నంలోని 10వ డివిజన్ టీడీపీ ఇన్‌ఛార్జ్ కోస్తా మురళీ సతీమణి పేర్ల వరలక్ష్మి హఠాన్మరణం పట్ల మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వరలక్ష్మి మరణ వార్త తెలుసుకున్న ఆయన హుటాహుటిన విజయవాడ నుంచి మచిలీపట్నం వచ్చారు. వరలక్ష్మి భౌతికకాయాన్ని దర్శించి నివాళులర్పించారు. అనంతరం వరలక్ష్మి పాడె మోసి దహన సంస్కారాల్లో పాల్గొన్నారు.

February 14, 2025 / 06:06 PM IST

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: విద్యార్థి సంఘాలు

KDP: పశువైద్య కళాశాల విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి వారి సమ్మెను విరమింపజేయాలని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్, SFI జిల్లా అధ్యక్షులు ఎద్దు రాహుల్‌లు తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరలోని పశు వైద్య కాలేజీలో విద్యార్థులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.

February 14, 2025 / 06:03 PM IST

తైక్వాండో పోటీలలో సత్తా చాటిన ఏకత్వ పాఠశాల విద్యార్థులు

NTR: ఇటీవల కాకినాడలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నా లాజికల్ యూనివర్సిటీ జరిగిన అంతర్ జిల్లాల తైక్వాండో పోటీలలో వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలోని ఏకత్వా ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. 61 కేజీల విభాగంలో కే వర్ధన్ సాయి రజత పతకం, 30 కేజీల విభాగంలో పి. జయ రేణుక, ఎం. లక్ష్మి సహస్ర, వి. యశస్విని కాంశ్య పతకాలు సాధించారు.

February 14, 2025 / 05:56 PM IST

దామోద‌రం సంజీవ‌య్య ఘన నివాళులర్పించిన కలెక్టర్

NTR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య రాష్ట్రానికి చేసిన సేవలు ఆదర్శనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. అయన జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

February 14, 2025 / 05:52 PM IST

‘గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయించడం హర్షనీయం’

TPT: ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కల్లు గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్లు కేటాయించి అమలపరిచిన కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు‌కు తిరుపతి జిల్లా గౌడ సంక్షేమ సంఘం నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం నూతనంగా గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాన్ని గూడూరు పట్టణం దూడల కాలువసెంటర్‌లో ఆర్భాటంగా ప్రారంభించారు.

February 14, 2025 / 05:18 PM IST

‘గంగాభవాని జాతరకు ప్రత్యేక బస్సులు’

అన్నమయ్య: సీటీఎంలో జరుగుతున్న నల వీర గంగాభవాని జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మదనపల్లె రెండవ డిపో మేనేజర్ అమర్నాథ్ తెలిపారు. శుక్ర, శనివారాల్లో 15 బస్సులు, ఆదివారం 5 బస్సులు నడుపుతున్నట్లు వివరాలు వెల్లడించారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు.

February 14, 2025 / 05:17 PM IST

అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం

PLD: ఎడ్లపాడు మండలం జగ్గాపురం జడ్పీహెచ్ స్కూల్ నందు అంగన్వాడీ కార్యకర్తలకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ వెంకటరమణ పాల్గొని పిల్లల కోసం నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించడంపై అవగాహన కల్పించారు. పిల్లలో సమగ్ర అభివృద్ధి కొరకు ప్రీస్కూల్లో సరైన విద్యను అందించడం, పోషకాహార లోపం లేకుండా చేయాలన్నారు.

February 14, 2025 / 05:09 PM IST