NLR: పొదలకూరు యాడ్లో నిమ్మకాయల ధరలు కేజీలు రూ.15, బస్తా రూ. 1000 నుంచి రూ.1500 వరకు పలికిందని వ్యాపారాలు తెలిపారు. కాగా గత నెలలో కేజీ రూ.60 నుంచి రూ. 70 వరకు, బస్తా రూ. 4000 నుంచి రూ. 5000 వరకు పలికిందని ఇప్పుడు ధరలు పూర్తిగా తగ్గిపోయాయని ఆవేదన చెందారు. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
KKD: జగ్గంపేట నియోజకవర్గ స్థాయిలో రేపటి నుంచి 30వ తేదీ వరకు NDA కూటమి ఇంటింటా ప్రచారం నిర్వహించేందుకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గంపేట MLA జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. అలాగే వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని కోరారు.
కృష్ణా: ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేసే ప్రభుత్వం తమదని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. మంగళవారం ఉదయం ఆయన మచిలీపట్నం పరాసుపేటలో పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ను క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తేదీన అందజేస్తున్నామన్నారు.
KKD: జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ & వికాస ఆధ్వర్యంలో జులై 5వ తేదీన జగ్గంపేటలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం జగ్గంపేటలో జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ 33 కంపెనీలు పాల్గొంటాయన్నారు. టెన్త్ నుండి PG ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు.
సత్యసాయి: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్లు భగవంతుడి ప్రతిరూపాలని, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అహర్నిశలు సేవలందిస్తున్న వారు ప్రాణదాతలతో సమానమని ప్రశంసించారు. ఆరోగ్య భారత్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో వారి పాత్ర అమోఘమని పేర్కొన్నారు.
సత్యసాయి: కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నల్లచెరువు మండలం ఉబిచెర్ల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్దిదారుల ఇళ్ల వద్దకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశారు. వారిని ఆప్యాయంగా పలకరించి ప్రతి నెలా పెన్షన్ సక్రమంగా అందుతోందా?అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
W.G: తణుకు మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు తలపెట్టిన సమ్మెలో భాగంగా తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ విధులను మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో బహిష్కరిస్తున్నట్లు తణుకు యూనియన్ అధ్యక్షుడు ఉండ్రాజవరపు శ్రీను తెలిపారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ టి. రామ్ కుమార్కి సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.
W.G: పెనుగొండ పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో గ్రామ కచేరి వద్ద ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయానికి మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వామివారికి పూజలు చేసి అలంకరణ నిర్వహించారు. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
PPM: జిల్లాలో ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వీరఘట్టం మండల వ్యవసాయ శాఖ అధికారి సౌజన్య హెచ్చరించారు. స్థానిక కార్యాలయంలో వీరఘట్టం ఎరువుల వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిబంధనలు పాటించని ఎరువుల షాపుల లైసెన్సులు రద్దు చేస్తామన్నారు.
W.G: ఆకివీడు నుంచి భీమవరం వెళ్తున్న ఓ బస్సు నుంచి మంగళవారం ఉదయం ఒక్కసారిగా పొగలు వెలువడ్డాయి. భీమవరం ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన బస్సు నుంచి ఈ పొగలు వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థులను కిందకి దింపేశారు. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ATP: గుత్తి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మంగళవారం పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ల ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా తనిఖీ చేశారు. ఇంటింటికి తిరుగుతూ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. పింఛన్ల పంపిణీలో సాంకేతిక సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.
VSP: చైతన్య కళాశాల ప్రాంతంలో కారు విద్యుత్ స్తంబాన్ని ఢీకొన్న ఘటన పీఎంపాలెంలో చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున వర్షంలో అదుపు తప్పడంతో విద్యుత్ స్తంబాన్ని ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం విరిగి రోడ్డుపై పడిపోయింది. కారు ముందు భాగం డామేజ్ అయ్యింది. కానీ ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు.
W.G: కేరళ రాష్ట్ర పోలీస్ డీజీపీగా ప.గో జిల్లా వీరవాసరానికి చెందిన రావాడ ఆజాద్ చంద్రశేఖర్ సోమవారం నియమితులయ్యారు. కేరళ నూతన డీజీపీగా చంద్రశేఖర్ను నియమిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలియడంతో చంద్రశేఖర్ స్వగ్రామంలో బంధుమిత్రులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈయన 1991లో ఐపీఎస్కు ఎంపికయ్యారు.
VZM: రెవెన్యూ సేవలు నిజాయితీగా అందించాలని బొబ్బిలి ఎమ్మార్వో ఎం.శ్రీను సూచించారు. సోమవారం స్దానిక MRO కార్యాలయంలో VROలు, రెవెన్యూ ఉద్యోగులతో ఆయన సమావేశం నిర్వహించారు. రెవెన్యూ పనులు కోసం అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2019కు ముందు ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేసిన ఇళ్లను క్రమబద్దీకరణ చేయాలన్నారు.
VZM: బాడంగి మండలం పాల్తేరులో సోమవారం రాత్రి బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు పల్లెనిద్ర చేశారు. గ్రామంలోని పెద్దలు, ప్రజలతో సమావేశం నిర్వహించి గంజాయి వలన జరిగే నష్టం, మహిళలపై జరుగుతున్న నేరాలు నివారణపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గంజాయి వలన జీవితాలు నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.