VZM: ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత DSC శిక్షణను గిరిజన యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.శ్రీనివాసరావు కోరారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. జిల్లాలో 93మంది అభ్యర్థులను ఆన్లైన్ ద్వారా ఎంపిక చేసి జిల్లా కేంద్రంలో 3 నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తున్నామన్నారు.
ATP: గుంతకల్లులో ఉప్పర, సాగరకుల ఆరాధ్య దేవుడు, మూలపురుషుడు మహర్షి భగీరథ జయంతిని ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. టీడీపీ మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, కూటమి నాయకులతో కలిసి మహర్షి భగీరథ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆకాశం నుంచి గంగను నేలకు దింపిన గొప్ప మహర్షి భగీరథుడని పేర్కొన్నారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని దేవాంగ నగర్లో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవం ఈనెల 11న జరగనుంది. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి శాంతి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కుందూరు తిరుపతిరెడ్డి ఆదివారం తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి శాంతి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.
SKLM: జి.సిగడాం మండలం బాతువ గ్రామంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్మశ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తితో 22వ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు ఉన్నారు.
కాకినాడ: వేండ్ర గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బుద్ధిరెడ్డి గంగరాజు వైస్ ఎంపీపీ, నల్లా భాస్కర్ రావు, కాండ్రేగుల శివ, ఉండూరు రాజబాబు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధిస్తే కాకినాడ నుంచి అన్నవరం నడిచి వస్తామని మొక్కుకున్నారు. ఆ మొక్కను తీర్చుకొని స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు వారిని అభినందించారు.
ELR: ముసునూరు గ్రామంలో ఈదురు గాలులు వర్షానికి విరిగిపడిన చెట్టు కారణంగా 10 ఏళ్ల బాలుడు మృతి చెందిన విషాద సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని కారణంగా బాల గోవిందం అనే బాలుడు నిద్రిస్తుండగా ఆరు బయట ఉన్న వెలగ చెట్టు ఈదురు గాలులకు విరిగిపడింది. ఈ సంఘటనలో బాల గోవిందం తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు.
సత్యసాయి: బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నేడు హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు తెలిపారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంలో, ఆదివారం సాయంత్రం హిందూపురంలో జరిగే సన్మాన కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొంటారని తెలిపారు.
NDL: బనగానపల్లె పట్టణంలోని భానుముక్కల కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బీసీ ఇందిరమ్మ దంపతులు ఆదివారం నాడు పాల్గొన్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆలయ అధికారులు బీసీ జనార్దన్ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు.
కృష్ణా: జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఖాళీల వివరాలను అధికారులు వెల్లడించారు. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగు: 1, హిందీ: 1, ఆంగ్లం: 3, గణితం: 1, భౌతిక శాస్త్రం: 1, జీవశాస్త్రం: 4, సాంఘిక శాస్త్రం: 4, శారీరక విద్య: 3, ఎస్జీటీ: 13 చొప్పున మొత్తం 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం కూచిపూడి గ్రామాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరచడంతో పాటు ఆదాయ వనరులను పెంపొందించేందుకు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్(ఆర్జీఎస్ఏ) పథకం ద్వారా కృషి చేస్తున్నారు. రూ.5 కోట్ల నిధులను సమకూర్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు. కూచిపూడిలో గురుశిష్య పరంపర కొనసాగించేలా వారసత్వ కుటుంబాలను ప్రోత్సహించాలన్నారు.
ప్రకాశం: వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం జోనల్ సెక్రటరీగా దర్శికి చెందిన దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి నియమితులయ్యారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామక జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి జగన్కు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
W.G: ఉండి ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 12వ తేదీ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐల జిల్లా ప్రధానాధికారి శ్రీనివాసరాజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ/ప్రైవేట్ ఐటీఐలలో 2021, 2022, 2023, 2024 సంవత్సరాల్లో వివిధ కోర్సులు పూర్తి చేసి అప్రెంటిస్షిప్ చేయని అభ్యర్థులు అర్హులన్నారు. అభ్యర్థులు అన్నిధ్రువపత్రాలతో తీసుకొని రావాలని సూచించారు.
NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయంలో నీటిమట్టం స్వల్పంగా తగ్గుతుంది. ఆదివారం ఉదయం ఆరు గంటల నాటికి జలాశయంలో 50.874 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జలాశయంలో 279 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. సోమశిల జలాశయం నుండి పెన్నా డెల్టాకు 1030 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
NTR: ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై సెంట్రల్(MAS), భగత్-కి-కోటి(BGKT) మధ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 5 నుంచి MAS- BGKT(నెం. 20625), ఈ నెల 7 నుంచి BGKT-MAS(నం. 20626) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు APలో కొండపల్లి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగుతుందన్నారు.
NDL: బనగానపల్లెలోని క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం గ్రీవెన్స్లో భాగంగా ప్రజల నుంచి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వివిధ వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకొని.. పలు సమస్యలను అక్కడికక్కడే అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు. పలువురు అధికారులు, నేతలు, కార్యకర్తలు మంత్రిని కలిశారు.