• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అప్పు వివాదంతో ఇళ్లు కూల్చాడు..!

అన్నమయ్య: పుల్లంపేట మండలంలో అప్పు వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. టి.కమ్మపల్లి పంచాయతీ ఎగువరెడ్డిపల్లికి చెందిన శ్రీను వద్ద రంగంపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య 12 సంవత్సరాల క్రితం రూ.80 వేల అప్పు తీసుకున్నాడు. కొంత మొత్తం చెల్లించినప్పటికీ పూర్తి బాకీ తీర్చలేదని ఆరోపిస్తూ, శ్రీను జేసీబీతో వెంకటయ్యకు చెందిన పెంకుటిల్లును కూల్చివేసినట్లు స్థానికుల సమాచారం.

March 21, 2026 / 10:01 AM IST

భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు

E.G: గోపాలపురం మండల వ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుకలు శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. మసీదుల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజులు నిర్వహించి, ఖురాన్ పఠనం చేశారు. 30 రోజుల కఠోర ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే ఈ పండుగ మానవత్వానికి, సోదరభావానికి ప్రతీక అని మత పెద్దలు ప్రసంగించారు. నమాజు అనంతరం ఒకరికొకరు ‘ఈద్ ముబారక్’ తెలుపుకుంటూ శుభాకాంక్షలు పంచుకున్నారు.

March 21, 2026 / 10:01 AM IST

రాజంపేటలో షాపులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్

KDP: రాజంపేట పట్టణంలో ఇవాళ ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ రోడ్డులోని తిరుమల సిమెంట్ షాపులోకి ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో షాపు ముందు నిలిపి ఉంచిన రెండు బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. షాపులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ట్రాక్టర్ బ్రేకులు పనిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

March 21, 2026 / 10:00 AM IST

వైసీపీ తరఫున ఉద్యమిస్తాం: సాకే శైలజనాథ్

ATP: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతన్నలను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలన్నారు. ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో రైతులకు పరిహారం అందేలా చూడాలని కోరారు.

March 21, 2026 / 09:54 AM IST

రద్దీగా ఉన్న రావులపాలెం బస్టాండ్

కోనసీమ: రావులపాలెం బస్టాండులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం వాడపల్లి వెళ్లే భక్తుల తాకిడితో బస్టాండు ప్రాంగణం ప్రయాణికులతో కిటకిటలాడింది. వచ్చిన బస్సులన్నీ కిక్కిరిసి ఉండడంతో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు బస్సు ఎక్కలేక ఇబ్బందులు పడ్డారు. బస్సులు ఖాళీ లేక గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్తితి ఏర్పడిందని ప్రయాణికులు అంటున్నారు.

March 21, 2026 / 09:53 AM IST

రంజాన్ సందర్భంగా ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు

KRNL: పెద్దకడబూరులో రంజాన్ పండుగను పురస్కరించుకుని శనివారం ముస్లీం సోదరులు గ్రామ శివారుల్లోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, సొసైటీ ఛైర్మన్, మీ సేవ ఆంజనేయులు హాజరయ్యారు. వస్తాదు అబ్ధుల్ రెహమాన్ పవిత్ర రంజాన్ సందర్భంగా ప్రత్యేక సందేశమిచ్చారు.

March 21, 2026 / 09:52 AM IST

‘మానవాళి హితాన్ని ఆకాంక్షించే పవిత్రమైన రంజాన్’

W.G: మానవాళి హితాన్ని ఆకాంక్షించే పవిత్రమైన రంజాన్ పర్వదినాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం నియోజకవర్గ ముస్లిం సోదర, సోదరీమణులకు ఎమ్మెల్యే రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరికి సన్మార్గాన్ని చూపించి దేవునిపై భక్తి విశ్వాసాలను కల్గించే పవిత్ర పర్వదినం రంజాన్ అని పేర్కొన్నారు.

March 21, 2026 / 09:50 AM IST

బలుసులమ్మకు స్వర్ణ భరణ, పుష్పలంకారం

ప.గో: తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు నవ పుష్పాలతో అలంకరణ చేసి, స్వర్ణ ఆభరణాలతో పట్టు పీతాంబర వస్త్రాలతో అలంకరణ చేశారు. దేవాదాయ ధర్మాదయా శాఖ, జిల్లా కమిషనర్ దంపతులు పాల్గొని ప్రత్యేకంగా పూజలు చేసి, అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చనలు చేశారు. ఈ క్రమంలో ఆయనను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సత్కరించారు.

March 21, 2026 / 09:47 AM IST

జిల్లాలో ఘనంగా రంజాన్ వేడుకలు

NDL: రంజాన్ వేడుకలను జిల్లాలో శనివారం ఘనంగా నిర్వహించారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు నెల రోజులపాటు ఉపవాసం ఉండి ఈద్గాలో సామూహిక ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షను విరమించారు. పట్టణంలోని కర్నూలు రోడ్డులో గల ఈద్గా వద్ద ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

March 21, 2026 / 09:44 AM IST

లాడ్జిల్లో తనిఖీలు.. అనుమానితులపై కఠిన చర్యలు..!

కడప జిల్లాలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పోలీసులు అప్రమత్తంగా గస్తీ విధులు నిర్వహిస్తున్నారు. లాక్‌డ్ హౌస్‌ల వద్ద ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు లాడ్జిల్లో తనిఖీలు చేపట్టి, అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు.

March 21, 2026 / 09:36 AM IST

అక్షరాంధ్రా పరీక్షలు 99.6 శాతం పూర్తి చేశాం: MPDO

PPM: ఇటీవల నిర్వహించిన అక్షరాంధ్రా కార్యక్రమానికి కురుపాం మండల పరిధిలోని 20 సచివాలయాల్లో 4096 మంది హాజరు కాగా, అందులో 99.6 శాతం పరీక్షలు నిర్వహించి ఫలితాల నమోదు పూర్తి చేసినట్లు స్థానిక MPDO జె. ఉమామహేశ్వరి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని పెర్కొన్నారు.

March 21, 2026 / 09:35 AM IST

హనుమంతరాయ చౌదరి మృతిపై రఘువీరారెడ్డి దిగ్భ్రాంతి

సత్యసాయి: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి మరణం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీర రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలుగా కళ్యాణదుర్గం ప్రజా సేవలో ‘పెద్దాయన’గా పేరుగాంచిన ఆయన మృతి అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. భగవంతుడు మృతుని ఆత్మకు శాంతి ప్రసాదించాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు, అనుచరులకు సానుభూతి తెలియజేశారు. 

March 21, 2026 / 09:32 AM IST

రంజాన్ వేళ జిల్లాలో పటిష్ట భద్రత

ATP: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన మసీదులు, ఈద్గాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సోషల్ మీడియా వేదికలపై అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

March 21, 2026 / 09:32 AM IST

సిద్ధినగట్టులో రాష్ట్ర స్థాయి పోటీలు

NDL: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈ నెల 26న ప్యాపిలి మండలం సిద్ధినగట్టు గ్రామంలో రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. విజేతలైన ఎద్దుల యజమానులకు దాతల సహకారంతో నగదు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ప్రథమ బహుమతి రూ.30,000, ద్వితీయ రూ.20,000, తృతీయ రూ.12,500, నాలుగో బహుమతి రూ.10,000గా నిర్ణయించారు.

March 21, 2026 / 09:32 AM IST

జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు

KDP: జిల్లా వ్యాప్తంగా ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు ఘనంగా జరిగాయి. కడప రిమ్స్ ఈద్గా వద్ద ప్రత్యేక నమాజు ప్రార్థనల్లో ముస్లిం సోదరులు భారీగా పాల్గొన్నారు. పరస్పరం ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చింతకొమ్మదిన్నే సీఐ బాల మద్దిలేటి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

March 21, 2026 / 09:32 AM IST