• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేటి మంత్రి సవిత పర్యటన వివరాలు

సత్యసాయి: బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నేడు హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు తెలిపారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంలో, ఆదివారం సాయంత్రం హిందూపురంలో జరిగే సన్మాన కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొంటారని తెలిపారు.

May 4, 2025 / 11:00 AM IST

భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ

NDL: బనగానపల్లె పట్టణంలోని భానుముక్కల కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బీసీ ఇందిరమ్మ దంపతులు ఆదివారం నాడు పాల్గొన్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆలయ అధికారులు బీసీ జనార్దన్ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు.

May 4, 2025 / 10:56 AM IST

స్పోర్ట్స్ కోటాలో 31 ఖాళీలు

కృష్ణా: జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఖాళీల వివరాలను అధికారులు వెల్లడించారు. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగు: 1, హిందీ: 1, ఆంగ్లం: 3, గణితం: 1, భౌతిక శాస్త్రం: 1, జీవశాస్త్రం: 4, సాంఘిక శాస్త్రం: 4, శారీరక విద్య: 3, ఎస్జీటీ: 13 చొప్పున మొత్తం 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

May 4, 2025 / 10:32 AM IST

కూచిపూడి అభివృద్ధికి రూ.5కోట్లు: కలెక్టర్

కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం కూచిపూడి గ్రామాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరచడంతో పాటు ఆదాయ వనరులను పెంపొందించేందుకు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్(ఆర్జీఎస్ఏ) పథకం ద్వారా కృషి చేస్తున్నారు. రూ.5 కోట్ల నిధులను సమకూర్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు. కూచిపూడిలో గురుశిష్య పరంపర కొనసాగించేలా వారసత్వ కుటుంబాలను ప్రోత్సహించాలన్నారు.

May 4, 2025 / 10:11 AM IST

వైసీపీ విద్యార్ధి విభాగం జోనల్ సెక్రటరీగా దుగ్గిరెడ్డి

ప్రకాశం: వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం జోనల్ సెక్రటరీగా దర్శికి చెందిన దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి నియమితులయ్యారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామక జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి జగన్‌కు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

May 4, 2025 / 10:02 AM IST

12న అప్రెంటిస్‌షిప్ మేళా

W.G: ఉండి ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 12వ తేదీ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐల జిల్లా ప్రధానాధికారి శ్రీనివాసరాజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ/ప్రైవేట్ ఐటీఐలలో 2021, 2022, 2023, 2024 సంవత్సరాల్లో వివిధ కోర్సులు పూర్తి చేసి అప్రెంటిస్‌షిప్ చేయని అభ్యర్థులు అర్హులన్నారు. అభ్యర్థులు అన్నిధ్రువపత్రాలతో తీసుకొని రావాలని సూచించారు.

May 4, 2025 / 08:45 AM IST

సోమశిల జలాశయంలో స్వల్పంగా తగ్గుతున్న నీటిమట్టం

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయంలో నీటిమట్టం స్వల్పంగా తగ్గుతుంది. ఆదివారం ఉదయం ఆరు గంటల నాటికి జలాశయంలో 50.874 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జలాశయంలో 279 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. సోమశిల జలాశయం నుండి పెన్నా డెల్టాకు 1030 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

May 4, 2025 / 08:01 AM IST

ప్రయాణికుల రద్దీ మేరకు చెన్నైకి ప్రత్యేక రైళ్లు

NTR: ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై సెంట్రల్(MAS), భగత్-కి-కోటి(BGKT) మధ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 5 నుంచి MAS- BGKT(నెం. 20625), ఈ నెల 7 నుంచి BGKT-MAS(నం. 20626) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు APలో కొండపల్లి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగుతుందన్నారు.

May 4, 2025 / 07:56 AM IST

అర్జీలు స్వీకరించిన మంత్రి బీసీ

NDL: బనగానపల్లెలోని క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం గ్రీవెన్స్‌లో భాగంగా ప్రజల నుంచి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వివిధ వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకొని.. పలు సమస్యలను అక్కడికక్కడే అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించారు. పలువురు అధికారులు, నేతలు, కార్యకర్తలు మంత్రిని కలిశారు.

May 4, 2025 / 07:54 AM IST

డీఎస్సీలో ఉచిత శిక్షణ.. వీరికి మాత్రమే!

KRNL: ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు రీజనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ డిప్యూటీ డైరెక్టర్ సయ్యద్ సమీవుద్దిన్ ముజమ్మిల్ తెలిపారు. ఆసక్తి ఉన్న ముస్లింలు, క్రైస్తవులు (బీసీ-సి), సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు ఈ నెల 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9441761178, 9849896996, 8074421688 నెంబర్లను సంప్రదించాలన్నారు.

May 4, 2025 / 07:35 AM IST

రూట్ మార్చిన స్పా నిర్వహకులు

NTR: విజయవాడలో బాడీ స్పా నిర్వహకులు రూట్ మార్చారు. పోలీసులు ఇటీవల దాడి చేయడంతో వాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. నగరంలోని హోటల్ రూమ్లను బుక్ చేసుకొని వాటిల్లో బాడీ స్పా పేరిట అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పీవీపీ వద్ద ఉన్న ఓ హోటల్లో బాడీ మసాజ్, వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు.

May 4, 2025 / 07:20 AM IST

శ్రీమఠానికి రూ.2 లక్షల విరాళం

KRNL: బెంగళూరుకు చెందిన రాఘవేంద్ర స్వామి భక్తుడు, భాజపా నాయకుడు శ్రీమఠానికి రూ.2 లక్షలు విరాళంగా అందజేసినట్లు మేనేజర్ వెంకటేశ్ జోషి తెలిపారు. శనివారం ఆయన మంత్రాలయం చేరుకుని గ్రామదేవత మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి మూల బృందావనం దర్శించుకున్నారు. అనంతరం అన్నదానానికి రూ.లక్ష, శాశ్వత సేవకు రూ.లక్ష చొప్పున చెక్కును అందించినట్లు మేనేజర్ పేర్కొన్నారు.

May 4, 2025 / 07:19 AM IST

నార్త్ రాజుపాలెం వద్ద ప్రమాదం

NLR: కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం జాతీయ రహదారిపై బ్రహ్మయ్య కాలేజి వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రక్కన నడుచుకుంటూ వెళుతుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. గాయపడిన వ్యక్తి నార్త్ రాజుపాలెంకు చెందిన సుబ్బారెడ్డిగా గుర్తించిన స్థానికులు 108 వాహనంలో నెల్లూరుకు తరలించారు.

May 4, 2025 / 07:15 AM IST

10న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఎన్నికలు

ప్రకాశం: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒంగోలు నగర ఎన్నికలు ఈనెల 10వ తేదీన జరుగుతాయని ఎన్నికల అధికారి సయ్యద్ మసూద్ తెలిపారు. అదే రోజు ఉదయం నామినేషన్లు స్వీకరణ, ఉపసంహరణ, పోలింగ్ ఉంటుందని చెప్పారు. సంఘం సభ్యులందరూ ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.

May 4, 2025 / 07:05 AM IST

మే 9న బార్ అసోసియేషన్ ఎన్నికలు

KKD: పిఠాపురం బార్ అసోసియేషన్ ఎన్నికలు మే 9న నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి బత్తిన లక్ష్మణదొర శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మే 5న నామినేషన్ల స్వీకరణ, 6న పరిశీలన, 7న ఉపసంహరణ, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు జరుగుతుందన్నారు. మే 9న పోలింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన ఉంటుందన్నారు. పూర్తి వివరాల కోసం బార్ అసోసియేషన్ కార్యాలయంలో సంప్రదించాల న్నారు.

May 4, 2025 / 06:47 AM IST