• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రజల నుంచి వినతులను స్వీకరించిన కలెక్టర్

పల్నాడు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా స్వయంగా పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. బాధితుల సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్న ఆమె, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల విషయంలో అలసత్వం వహించరాదని అధికారులకు తెలిపారు.

February 23, 2026 / 12:55 PM IST

పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం స్థానిక 26వ డివిజన్ విక్రమ్ నగర్ ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించారు. డివిజన్ పరిధిలో అన్ని భవనాలను అసెస్మెంట్ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. 100% నిర్దేశించిన ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి పన్ను, ఖాళీ స్థలం పన్నులను వసూలు చేయాలని ఆదేశించారు.

February 23, 2026 / 12:52 PM IST

పీజీఆర్ఎస్‌లో ప్రజల వినతులు స్వీకరణ

VSP: కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ప్రజల నుంచి సోమవారం వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి పాల్గొన్నారు.

February 23, 2026 / 12:52 PM IST

ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం

ELR: దెందులూరు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. సోమవారం పెదవేగి మండలం దుగ్గిరాల టీడీపీ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అనంతరం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

February 23, 2026 / 12:52 PM IST

కర్నూలులో పుష్కలంగా యూరియా నిల్వలు

కర్నూలు జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి ఇవాళ తెలిపారు. 2025-26 రబీ సీజన్‌కు 24, 580మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. అధిక ధరలకు విక్రయించినా, ఇతర ప్రాంతాలకు తరలించినా డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం 8341302863కు సంప్రదించాలనిన్నారు.

February 23, 2026 / 12:51 PM IST

అనారోగ్యంతో కొమరోలు ఏవో మృతి

ప్రకాశం: కొమరోలు ఎంపీడీవో కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న సయ్యద్ మస్తాన్వలి అనారోగ్యంతో మరణించారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, సెలవుపై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. సోమవారం ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు ఆయన మృతికి విచారం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు.

February 23, 2026 / 12:50 PM IST

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

AKP: మునగపాకలో సోమవారం సీసీ నిర్మాణ పనులకు కూటమి నాయకులు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం రూ.13 లక్షల నిధులను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మంజూరు చేశారని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతీయుల రహదారి కష్టాలు తీరుతాయని చెప్పారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

February 23, 2026 / 12:47 PM IST

కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు వ్యవసాయ రంగానికి మొండి చెయ్యి

KRNL: కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లలో వ్యవసాయ రంగానికి తగిన నిధులు కేటాయించలేదని నాయకులు రైతు సంఘం, సీపీఐ పలు ప్రజా సంఘాల నాయకులు విరేష్, ఆంజనయ్య విమర్శించారు. ఇవాళ పెద్దకడబూరు తహశీల్దార్ కార్యాలయం నందు ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లలో వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని తీవ్రంగా విమర్శించారు.

February 23, 2026 / 12:46 PM IST

‘కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు వ్యవసాయ రంగానికి మొండి చెయ్యి’

KRNL: కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లలో వ్యవసాయ రంగానికి తగిన నిధులు కేటాయించలేదని నాయకులు రైతు సంఘం, సీపీఐ పలు ప్రజా సంఘాల నాయకులు విరేష్, ఆంజనయ్య విమర్శించారు. ఇవాళ పెద్దకడబూరు తహశీల్దార్ కార్యాలయం నందు ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లలో వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని తీవ్రంగా విమర్శించారు.

February 23, 2026 / 12:46 PM IST

అమలాపురం PGRSకు 200 అర్జీలు: జేసీ

కోనసీమ: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి ప్రజల వద్ద నుంచి సమస్యలపై 200 అర్జీలు వచ్చాయని జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆమె అడిగి తెలుసుకుని వాటిపై అర్జీలను స్వీకరించారు.

February 23, 2026 / 12:45 PM IST

పెనుకొండలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం

సత్యసాయి: పెనుకొండ మండలం అంబేద్కర్ సర్కిల్‌లో కూటమి నేతలు సోమవారం నిరసన చేపట్టారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కుళ్లాయప్ప యాదవ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి, చెప్పులతో తొక్కి నిరసన వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ హటావో – దేశ్ కో బచావో’ అంటూ నినాదాలు చేశారు.

February 23, 2026 / 12:40 PM IST

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్సై

ప్రకాశం: కంభంలోని పరీక్ష కేంద్రాలను ఎస్సై శివకృష్ణారెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని, కేంద్రాల వద్ద ఎవరు గుంపులుగా ఉండరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

February 23, 2026 / 12:38 PM IST

రామచంద్రపురంలో అన్న క్యాంటీన్ తనిఖీ

కోనసీమ: రామచంద్రపురంలోని అన్న క్యాంటీన్‌ను జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ సోమవారం తనిఖీ చేశారు. ఆహార పదార్థాలను స్వయంగా రుచిచూసి నాణ్యతను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి భోజన సౌకర్యాలపై ఆరా తీశారు. పేదలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, శుచీశుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అధికారులను, నిర్వాహకులను ఆయన ఆదేశించారు.

February 23, 2026 / 12:30 PM IST

ఘనంగా మాజీ కేంద్రమంత్రి జయంతి వేడుకలు

VZM: దివంగత మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రం నాయుడు 69వ జయంతి సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ రణస్థలం మండలం జె. ఆర్. పురం సూర్య పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళర్పించారు. ఈ సందర్బంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రణస్థలం మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు లంక శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 12:30 PM IST

ఏలూరులో బిజెపి స్వచ్ భారత్ కార్యక్రమం

ELR: సంత్ గాడ్గే బాబా జయంతి సందర్భంగా  ఇవాళ ఏలూరు అశోక్ స్తంభం సెంటర్ వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ , జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు అగ్రహారపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం పరిసరాలను పరిశుభ్రం చేశారు.

February 23, 2026 / 12:27 PM IST