KDP: పశువైద్య కళాశాల విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి వారి సమ్మెను విరమింపజేయాలని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్, SFI జిల్లా అధ్యక్షులు ఎద్దు రాహుల్లు తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరలోని పశు వైద్య కాలేజీలో విద్యార్థులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.
NTR: ఇటీవల కాకినాడలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నా లాజికల్ యూనివర్సిటీ జరిగిన అంతర్ జిల్లాల తైక్వాండో పోటీలలో వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలోని ఏకత్వా ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. 61 కేజీల విభాగంలో కే వర్ధన్ సాయి రజత పతకం, 30 కేజీల విభాగంలో పి. జయ రేణుక, ఎం. లక్ష్మి సహస్ర, వి. యశస్విని కాంశ్య పతకాలు సాధించారు.
NTR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య రాష్ట్రానికి చేసిన సేవలు ఆదర్శనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. అయన జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
TPT: ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కల్లు గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్లు కేటాయించి అమలపరిచిన కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తిరుపతి జిల్లా గౌడ సంక్షేమ సంఘం నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం నూతనంగా గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాన్ని గూడూరు పట్టణం దూడల కాలువసెంటర్లో ఆర్భాటంగా ప్రారంభించారు.
అన్నమయ్య: సీటీఎంలో జరుగుతున్న నల వీర గంగాభవాని జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మదనపల్లె రెండవ డిపో మేనేజర్ అమర్నాథ్ తెలిపారు. శుక్ర, శనివారాల్లో 15 బస్సులు, ఆదివారం 5 బస్సులు నడుపుతున్నట్లు వివరాలు వెల్లడించారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు.
PLD: ఎడ్లపాడు మండలం జగ్గాపురం జడ్పీహెచ్ స్కూల్ నందు అంగన్వాడీ కార్యకర్తలకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ వెంకటరమణ పాల్గొని పిల్లల కోసం నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించడంపై అవగాహన కల్పించారు. పిల్లలో సమగ్ర అభివృద్ధి కొరకు ప్రీస్కూల్లో సరైన విద్యను అందించడం, పోషకాహార లోపం లేకుండా చేయాలన్నారు.
ATP: యల్లనూరు మండల వ్యాప్తంగా భూమి కలిగిన ప్రతి ఒక్కరూ ప్రత్యేక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని తప్పకుండా నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ తెలిపారు. ఆ నంబర్ ద్వారానే పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, డ్రిప్ స్పింకర్లు, తదితర సబ్సిడీ పథకాలు కూడా వస్తాయన్నారు. రైతు భరోసా కేంద్రం వద్దకు వెళ్లి ఈ నెలాఖరు లోగా నమోదు చేసుకోవాలని కోరారు.
SKLM: విలువలకి రూపం దామోదరం సంజీవయ్య అని దళిత సంఘాల నేతలు కొనియాడారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో దామోదరం సంజీవయ్య పార్క్లో ఉన్న ఆయన విగ్రహానికి వారంతా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. దళిత సీఎంగా ఆయన చేసిన సేవలు నేటి యువతకి స్ఫూర్తిదాయకమ అన్నారు.
CTR: పార్లమెంటు కార్యాలయంలో చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు చిత్తూరు అభివృద్ధిపై చర్చించుకున్నారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఉద్ఘాటించారు.
GNTR: భారత క్రికెట్ యువ క్రీడాకారుడు అబ్దుల్ రషీద్ శుక్రవారం గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సుప్రసిద్ధ హజరత్ సయ్యద్ బాజీ షహిద్ అవులియా వారి దర్గాకు విచ్చేసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు రషీద్ తో ఫోటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. రషీద్ ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగుతూ సంతోషం వ్యక్తం చేశారు.
GNTR: ఏనుగుల దాడిలో మృతి చెందిన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె ఉపసర్పంచ్ రాకేష్ కుటుంబ సభ్యులు ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ను కలిశారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండే రాకేష్ మృతి చెందడం నన్ను కలచి వేసిందని లోకేష్ అన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని, ఏనుగుల దాడిచేయడంతో ఆయన మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.
ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో సెన్సిటైజేషన్ క్లాసులను నిర్వహించారు. డ్రగ్స్ వలన కలిగే అనర్ధాలను ప్రిన్సిపాల్ డా.నాయక్ విద్యార్ధులకు వివరించారు. సెన్సిటైజేషన్ క్లాసుల ఉద్దేశాలను, డ్రగ్స్కు వ్యతిరేక చట్టాల గురించి డ్రగ్ ఫ్రీ ఏపీ యూనిట్ నోడల్ అధికారి, NSS PO అనిత కుమారి వివరించారు.
SKLM: కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో రైల్వేల అభివృద్ధి పనుల గురించి చర్చించినట్లు సోషల్ మీడియా వేదిక ద్వారా తెలిపారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
VSP: పాత గాజువాక రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సీతమ్మధార ప్రాంతానికి చెందిన లక్ష్మణ్, మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన రమణ కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కాంక్రీట్ వాహనం ఢీకొట్టింది. లక్ష్మణ్ అక్కడికక్కడే మృతిచెందగా.. రమణ తీవ్రంగా గాయపడ్డాడు. కాంక్రీట్ వెహికల్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
CTR: పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలో ఆర్టీవో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాలల్లోని మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం, రికార్డులను చూశారు. ఈ సందర్భంగా ఆర్టీవో భవాని మాట్లాడుతూ పాఠశాలల్లో, అంగన్వాడీలలో మౌలిక వసతులు తదితర అంశాలపై ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో చంద్రశేఖర్ రెడ్డి, ICDS రాజేశ్వరి, రెవిన్యూ సిబంది పాల్గొన్నారు.