• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఇంఛార్జ్ కమిషనర్‌గా AE జాన్సన్

SKLM : ఆమదాలవలస పురపాలక సంఘం కమిషనర్‌గా పూజారి బాలాజీప్రసాద్ సోమవారం పదవీ విరమణ పొందారు. ఈ మేరకు ఆమదాలవలస మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్ ఏఈ జాన్సన్‌కు బాధ్యతలు అప్పజెప్పారు. ఈ మేరకు సోమవారం ఇంచార్జ్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.

June 30, 2025 / 07:21 PM IST

‘గిరిజన ఇంజినీరింగ్ యూనివర్సిటీ పనులు పూర్తి చేయాలి’

PPM: జిల్లాలో కురుపాం కేంద్రంగా మంజూరైన గిరిజన ఇంజనీరింగ్ కళాశాల పనులు తక్షణమే పూర్తి చేయాలని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర డిమాండ్ చేశారు. ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెంటాడలో నిర్మిస్తున్న గిరిజన యూనివర్సిటీ నిర్మాణం ఏళ్లు గడుస్తున్న నేటికీ పూర్తి చేయకపోవడంతో గిరిజనులను మోసం చేయడమేనని అన్నారు.

June 30, 2025 / 06:47 PM IST

అర్జీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి: ఎస్పీ

సత్యసాయి: పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ వి. రత్న “ప్రజా ఫిర్యాదుల వేదిక” కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 60 పిటిషన్లలో భూ సమస్యలు, కుటుంబ కలహాలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత స్టేషన్ అధికారులను ఆదేశించారు.

June 30, 2025 / 06:26 PM IST

నాతవరం డిప్యూటీ ఎంపీడీవో మూర్తి బదిలీ

AKP: నాతవరం డిప్యూటీ ఎంపీడీఓగా పనిచేస్తున్న ఎస్ఎన్ వి. మూర్తి డుంబ్రిగూడ డిప్యూటీ ఎంపీడీఓగా బదిలీ అయ్యారు. ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ సిబ్బంది ఆయను ఘనంగా సన్మానం చేశారు. ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి మాట్లాడుతూ.. డిప్యూటీ ఎంపీడీఓ మూర్తి ఉద్యోగం పట్ల ఎంతో నిబద్ధతతో, నిజాయితీగా పనిచేశారని చెప్పారు.

June 30, 2025 / 06:13 PM IST

ఉద్యోగులను సత్కరించిన అడిషనల్ ఎస్పీ

W.G: పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పదవీ విరమణ చేపట్టిన ముగ్గురు పోలీస్ సిబ్బందిని అడిషనల్ ఎస్పీ భీమారావు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు సాధారణ ప్రభుత్వ ఉద్యోగం వేరు పోలీస్ ఉద్యోగం వేరన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

June 30, 2025 / 05:19 PM IST

PGRSలో 15 అర్జీలు స్వీకరణ

NLR: నందిగామలో సోమవారం రెవిన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేద కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అయన మాట్లాడుతూ.. మొత్తం అర్జీలు 15 వచ్చినవని అన్నారు. సదరు అర్జీలను సంబంధిత అధికారులు సకాలంలో పరిష్కరించే విధముగా చర్యలు చేపడతామని తెలిపారు.

June 30, 2025 / 05:18 PM IST

ప్రజల సమస్యలపై మంత్రి భరత్ దృష్టి

KRNL: కర్నూలు నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ దృష్టి సారించారు. సోమవారం కర్నూలులోని మంత్రి కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను అర్ధం చేసుకొని వాటికి తగిన పరిష్కారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.

June 30, 2025 / 05:13 PM IST

‘ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’

NDL: మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కార్మికులకు వైసీపీ కౌన్సిలర్, శిల్పా మహిళా బ్యాంక్ చైర్‌పర్సన్ నాగిని రవి సంగారెడ్డి సోమవారం సంఘీభావం తెలిపారు. అభివృద్ధిలో పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికుల ప్రాముఖ్యత ఉందన్నారు.

June 30, 2025 / 05:13 PM IST

గొలలపలెంలో ఘనంగా వేద పంచమి

VSP: జిల్లాలో దువ్వాడ దరి గొల్లలపాలెం ప్రాంతంలో సప్త ఋషి వేద పాఠశాల ఆధ్వర్యంలో వైభవంగా వేద దివస్ వేడుకలు నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది వేద పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిరుద్ర పారాయణ నిర్వహించారు. ‘సర్వేజనా సుఖినోభవంతు’ అంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు మాధవ శర్మ తెలిపారు.

June 30, 2025 / 05:12 PM IST

అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ విద్య

NLR: జిల్లా వీఆర్ హైస్కూల్‌లో పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ విద్య అందించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని తెలిపారు. నెల్లూరు నగరంలో సోమవారం అట్టహాసంగా వీఆర్ హైస్కూల్‌లో ప్రైమరీ తరగతులను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

June 30, 2025 / 05:10 PM IST

గుర్తుతెలియని మృతు దేహం లభ్యం

CTR: బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద మామిడి తోటలో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. మృతదేహం పాడైన స్థితిలో ఉండటంతో చాలా రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

June 30, 2025 / 05:09 PM IST

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన మంత్రి

ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కొండపి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ప్రజలు పాల్గొని తమ సమస్యలను అర్జీల రూపంలో మంత్రికి అందజేశారు. అర్జీలను స్వీకరించిన మంత్రి అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకి హామీ ఇచ్చారు.

June 30, 2025 / 05:04 PM IST

పాఠశాలకు ఫ్యాన్‌ల వితరణ

SKLM: సంతబొమ్మాలి మండలం వడ్డివాడ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు మెండ రామినాయుడు సోమవారం కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలకు నాలుగు ఫ్యాన్‌లను వితరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్ధులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారని తెలిసిన వెంటనే  4 ఫ్యాన్‌లను అందజేశామని తెలిపారు.

June 30, 2025 / 05:00 PM IST

కలెక్టర్‌ను కలిసిన డీసీవో

తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల DCOగా టీ. పద్మజ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టర్ వెంకటేశ్వర్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల గురించి ఆయనతో చర్చించారు.

June 30, 2025 / 04:56 PM IST

నాఫెడ్ సంస్థ భూమి కేటాయింపుపై హర్షం

KDP: మైదుకూరులో నాఫెడ్ సంస్థకు భూమి కేటాయింపు చేయాలని జిల్లా కలెక్టర్ తహసీల్దార్‌ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా సోమవారం మైదుకూరు తహసీల్దార్‌ సురేంద్రను BJP నేతలు కలిసి ధన్యవాదాలు తెలిపారు. దీని ద్వారా రైతులకు ఎంతో ఉపయోగకరమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతాపరెడ్డి, ఏ.శేఖర్ రెడ్డి, బీసీ గుర్రప్ప, జి. రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

June 30, 2025 / 04:30 PM IST