• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జగన్ వీధి రౌడీలా మాట్లాడటం మానుకోవాలి: పల్లా

TPT: మాజీ సీఎం జగన్ ఒక వీధి రౌడీలా మాట్లాడటం మానుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హితవు పలికారు. చిల్లరి మాటలు మాట్లాడకూడదని, చట్ట పరిధిలోనే పోలీసులు పనిచేస్తున్నారన్నారు. కడపలో మహానాడును ఘనంగా నిర్వహిస్తామన్నారు. పదవుల రాలేదనే ఆవేదన కూటమి నేతల్లో ఉందని త్వరలో పదవులన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

April 8, 2025 / 07:44 PM IST

పగిడ్యాలలో ఎద్దుల బండ లాగుడు పోటీలు

NDL: పగిడ్యాలలో శ్రీరామ నవమి పండుగ పురస్కరించుకుని వైసీపీ మండల అధ్యక్షులు పుల్యాల నాగిరెడ్డి నేడు సాయంత్రం ఎద్దుల బండ లాగుడు పోటీలను ప్రారంభించారు. ఇందులో 8 జతల ఎద్దులు పాల్గొనాయని, గెలుపొందిన వారికి 1, 2, 3, 4 బహుమతులు కలవు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

April 8, 2025 / 07:40 PM IST

బుచ్చిలో గడ్డివామి దగ్ధం

NLR: బుచ్చి పట్టణంలోని దుర్గా నగర్లో గడ్డివామి దగ్ధమైంది. సంపత్ మురళి అనే పాడి రైతు గేదెల కోసం పది ఎకరాల ఎండు గడ్డివామి తీసుకువచ్చారు. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా గడ్డివామి తగలబడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. సుమారు లక్ష రూపాయలు నష్టం వాటిల్లందని పాడి రైతు సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు.

April 8, 2025 / 07:32 PM IST

UPDATE: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు మృతి

KDP: మైదుకూరు మండలం వనిపెంట సమీపంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొన్న సంఘటన లో తీవ్ర గాయాలైన యువకుని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బంధువులు కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తన కుమారుడు మృతి చెందడంపై తల్లిదండ్రులు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు.

April 8, 2025 / 07:20 PM IST

‘ముద్ర యోజన పథకంతో అనేక ప్రయోజనాలు’

NLR: ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి ముద్రా యోజన 10 ఏళ్లలో 520 మిలియన్ లోన్ల మైలురాయి దాటి రూ.33.65 లక్షల కోట్ల విలువైన లోన్లు మంజూరు చేయడం గర్వించదగిన విషయం అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ముద్రా యోజన భారత యువత, మహిళలు, చిన్న వ్యాపారులు, గ్రామీణ ప్రాంత ప్రజలకు గొప్ప ఆర్థిక అవకాశం కల్పించిందన్నారు.

April 8, 2025 / 07:15 PM IST

పురమిత్ర యాప్‌తో నగర సేవలు

KRNL: రాష్ట్ర ప్రభుత్వం నగరాల్లో, పట్టణాల్లో స్థానిక సంస్థల సేవలను పౌరులకు సులువుగా అందించేందుకు వీలుగా రూపొందించిన ‘పురమిత్ర’ యాప్ నగర ప్రజలు డౌన్‌‌లోడ్ చేసుకుని నగరపాలక సంస్థ సేవలను సులువుగా పొందాలని కర్నూల్ నగరపాలక అదనపు కమిషనర్ RGV కృష్ణ మంగళవారం కోరారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పార్కుల్లో పరికరాలు, మరమ్మత్తులపై ఫిర్యాదులు చేయవచ్చన్నారు.

April 8, 2025 / 07:12 PM IST

సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే

CTR: వాయల్పాడు మండలం గండబోయినపల్లి గ్రామంలో నూతనంగా సీసీ రోడ్డు ఏర్పాటు చేశారు. ఈ సీసీ రోడ్డును మంగళవారం పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డును ప్రారంభించారు. నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

April 8, 2025 / 07:10 PM IST

డెవలప్మెంట్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NDL: నంది కోట్కూరు మండలం, బ్రాహ్మణ కోట్కూరు గ్రామంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు జరిగిన డెవలప్‌మెంట్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే జయసూర్య మంగళవారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..హెల్త్ సెంటర్‌కు వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అధికారులు, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

April 8, 2025 / 07:06 PM IST

తహసీల్దార్ ఎదుట బైండోవర్

ELR: నూజివీడు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ కేసులలోని 14 మంది పాత నేరస్తులను మండల తహసీల్దార్ ఎదుట మంగళవారం చేశారు. ఈ సందర్భంగా నూజివీడు మండల తహసీల్దార్ బివి సుబ్బారావు మాట్లాడుతూ.. బైండోవర్ ఏడాది పాటు ఉంటుందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లక్ష రూపాయల జరిమానా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

April 8, 2025 / 05:13 PM IST

‘జగన్ పర్యటనలో భద్రతా లోపాలు’

GNTR: రామగిరి పర్యటనలో వైఎస్ జగన్ భద్రతను పోలీసులు నిర్లక్ష్యం చేశారంటూ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మంగళవారం మండిపడ్డారు. అలాగే హెలికాప్టర్ విండ్‌షీల్డ్ ధ్వంసంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు పని చేస్తున్నారని ఆరోపించారు. అభిమానుల ముసుగులో అసాంఘికశక్తులు జగన్‌కు ప్రమాదం కలిగించేలా కుట్రలు చేస్తున్నారని అని అన్నారు.

April 8, 2025 / 05:11 PM IST

ప్రతి పంచాయతీలోనూ బోర్లును త్రవ్వించాలి

SKLM: పాతపట్నం నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య అరికట్టేందుకు ప్రతి పంచాయతీలోనూ బోర్లును త్రవ్వించాలి అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.ఈ మేరకు మంగళవారం జెడ్పీ కార్యాలయంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి అధిక నిధులను వెచ్చించి అధికారులు అన్ని విధాలుగా సహకరించాలన్నరు.

April 8, 2025 / 04:52 PM IST

పీ-4పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్: మంత్రి

ప్రకాశం: మంత్రి స్వామి డెహ్రాడూన్‌లో జరుగుతున్న చింతన్ శివిర్ రెండవ రోజు సమావేశంలో మంగళవారం పాల్గొన్నారు. ఏపీలో అమలు చేయనున్న పీ-4పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. రూ.143 కోట్లతో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు చేస్తున్నామన్నారు. దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు.

April 8, 2025 / 04:12 PM IST

పీజీఆర్ఎస్‌లో 6,226 అర్జీలకు పరిష్కారం

E.G: రెవెన్యూ పరంగా పీజీఆర్ఎస్‌లో 6765 అర్జీలు పరిష్కారం కోసం రాగా 6,226 పరిష్కరించినట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. మంగళవారం అమరావతి నుంచి సీసీఎల్ఏ కమిషనర్ జి.జయలక్ష్మి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంకా 539 అర్జీలను పరిష్కారం చెయ్యాల్సి ఉందని వివరించారు.

April 8, 2025 / 04:03 PM IST

భూముల రీ సర్వే పనుల పరిశీలన

ప్రకాశం: పంగులూరు మండలంలోని బయట మంజులూర్ గ్రామంలో నిర్వహిస్తున్న భూముల రీ సర్వే పనులను మంగళవారం తహశీల్దార్ సింగారావు పరిశీలించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దీర్ఘకాలిక భూముల పరిష్కారానికి రీసర్వేతో సాధ్యమని తెలిపారు. రీసర్వే సమయంలో తమ పొలాల వద్ద రైతులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఓ, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

April 8, 2025 / 03:30 PM IST

ఏలూరులో ఇద్దరు దొంగలు అరెస్ట్

ELR: ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన రెండు డిక్కీ దొంగతనాల కేసుల్లో నిందితులను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ కిషోర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. షేక్ గాల్సిద్, బొంతు రాజశేఖర్ రెడ్డి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.5 లక్షల నగదు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారన్నారు.

April 8, 2025 / 02:20 PM IST