PLD: సత్తెనపల్లిలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ లక్ష్మీ తులసి సాంబశివరావు, వైస్ ఛైర్మన్ కోటేశ్వర నాయక్ పాల్గొన్నారు.
ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎంపీపీ హైస్కూల్ వద్ద శుక్రవారం విద్యార్థులు, తల్లిదండ్రులు, హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. హిందూ దేవుళ్లను కించపరుస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం బోధనలు చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు అన్యమత బోధన చేస్తున్నాడని వచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు.
ATP: తాడిపత్రి పట్టణంలో ఇండ్ల స్థలాల కోసం ఎంహెచ్పీఎస్ నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంహెచ్పీఎస్ నాయకులు కార్యకర్తలు కలిసి తప్పెట్లతో ధర్నా చేశారు. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి నాకు మాత్రం ఇళ్ల స్థలాలు రాలేదని వారు ఆవేదన చెందారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారు అన్నారు.
బాపట్ల: 36వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు బాపట్ల పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డీఎంహెచ్ఓ విజయమ్మ, వైద్యులు పాల్గొని డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. రాబోయే వేసవి కాలం దృష్ట్యా డ్రైవర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ప్రకాశం: తాళ్లూరు పోలీస్ స్టేషన్ను దర్శి డీఎస్పీ లక్ష్మీ నారాయణ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు డైరీలను, రిజిష్టర్లను పరిశీలించారు. రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెక్ చేసి పోలీస్ స్టేషన్లో సిబ్బంది యొక్క పనితీరును డీఎస్పీ అడిగి తెలుసుకున్నారు.
ప్రకాశం: మాజీ ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా శుక్రవారం ఒంగోలులోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యమంత్రిగా ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు.
GNTR: ఎస్పీ సతీశ్ కుమార్ శుక్రవారం ఉదయం తెనాలి వచ్చారు. పోలీస్ పరేడ్లో పాల్గొన్న అనంతరం ఎస్పీ ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అందరూ కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పారు. క్రమశిక్షణతో మెలగాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని అన్నారు. తెనాలిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అనేక చర్యలు చేపడుతున్నామన్నారు.
కృష్ణా: ముసునూరు మండలం లోపూడిలో శుక్రవారం అప్రకటిత విద్యుత్ కోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి విద్యుత్ సరఫరా కాకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏవైనా మరమ్మత్తులు ఉంటే ముందుగానే విద్యుత్ కోత ప్రకటిస్తే అనుగుణంగా ముందుకు వెళతామంటూ ప్రజలు పేర్కొన్నారు. వ్యవసాయ, వ్యాపారాలకు విద్యుత్ కోత తీవ్ర అంతరాయం కలిగిందన్నారు.
సత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు రేపు ఉదయం 10 గంటలకు లేపాక్షి మండల MRO కార్యాలయంలో భూ సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మండల ప్రజలు హాజరై తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా మండల కన్వీనర్ E. జయప్ప కోరారు.
SKLM: పోలాకి మండలం రాళ్లపాడు కాలనీలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆయనతోపాటు ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, మండల అధ్యక్షులు కణితి కృష్ణారావు, తదితరులు ఉన్నారు.
కోనసీమ: అల్లవరం మండలం మొగళ్లమూరు గ్రామంలో శ్రీ లక్ష్మీగణపతి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సతీమణి చింతా అనురాధ పాల్గొని, స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమెను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.
కృష్ణా: పామర్రు టౌన్ గుడివాడ రోడ్డులో ఉన్న ఓ చికెన్ సెంటర్లో తెల్లవారుజామున దొంగతనం జరిగిందని షాప్ యజమాని తెలిపాడు. ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం షాప్ వద్దకు వచ్చి చూసేసరికి గేట్కు వేసి ఉన్న తాళాలు బద్దలుకొట్టి ఉన్నాయని, అలాగే షాప్లో ముఖ్యమైన వస్తువులు దొంగిలించబడ్డాయని చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
కృష్ణా: కూటమి ప్రభుత్వం పేదల వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 21మందికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.18,86,311లను సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ సహాయం వేగవంతంగా అందిస్తున్న చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
NTR: గంపలగూడెం మండలం అనుముల లంకలో ఉన్న పౌల్ట్రీ ఫారంలో వేలకొద్ది కోళ్లు బర్డ్ ఫ్లూతో మృత్యువాత పడ్డ విషయం విధితమే. ఈ నేపథ్యంలో జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ హనుమంతరావు పర్యవేక్షణలో కోళ్ల శాంపిల్స్ తీసి పరీక్షా కేంద్రానికి పంపారు. రిజల్ట్ వచ్చేంతవరకు 10 కిలోమీటర్ల లోపల ఉన్న గ్రామాలలో చికెన్ షాపులు తెరవద్దని,రెడ్ అలర్ట్ ప్రకటించారు.
VZM: తగరపువలసలోని ఓ స్వీట్ షాప్లో మహిళ మృతిచెందింది. భోగాపురం మండలం పోలిపల్లికి చెందిన రక్షణకుమారి కొంతకాలంగా ఓ స్వీట్ షాప్లో పనిచేస్తున్నారు. గురువారం బాగోలేదని ట్యాబ్లెట్ వేసుకుని షాప్క్ వెళ్లింది. అక్కడ పని చేస్తూ ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.