• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘కుల దృవీకరణ పత్రాలు మంజూరు చేయాలి’

కోనసీమ: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంచార జాతుల వారికి కుల దృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమిల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం అమలాపురం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన PGRS కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.

March 23, 2026 / 05:04 PM IST

ఆర్డీవోగా ఆర్.శివ రాముడు బాధ్యతలు

E.G: నూతనంగా రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్‌గా ఆర్.శివ రాముడు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో జేసీ వై.మేఘా స్వరూప్‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జేసీకు పూల మొక్కను అందజేశారు. జేసీ ఆర్.శివ రాముడిని అభినందించి ప్రజలతో మమేకమై, వారి సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేయాలని సూచించారు.

March 23, 2026 / 05:02 PM IST

మార్కెట్ యార్డ్‌లో RO వాటర్ ప్లాంట్ పనులు ప్రారంభం

అనంతపురం మార్కెట్ యార్డ్‌లో ప్రజలు, రైతుల సౌకర్యార్థం RO వాటర్ ప్లాంట్ నిర్మాణ పనులను ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి సోమవారం ప్రారంభించారు. మార్కెట్ యార్డ్‌లో తాగునీటి అవసరాల దృష్ట్యా ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను కోరగా, ఆయన వెంటనే నిధులు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ బృందంతో కలిసి ఆమె భూమి పూజ నిర్వహించారు.

March 23, 2026 / 05:01 PM IST

శివాలయంలో జరిగిన ఘటనపై ప్రభుత్వం సీరియస్

కృష్ణా: యనమలకుదురు శివాలయంలో జరిగిన ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం సోమవారం ఆలయంలో విచారణ కొనసాగుతోంది. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఆలయ కానుకలను మాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈవో భవానిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. గతంలో పనిచేసిన గంగాధర్ అక్రమాలపైనా విచారణ ప్రారంభమైంది.

March 23, 2026 / 05:00 PM IST

శ్రీ నూకాలమ్మ ఆలయ హుండీ లెక్కింపు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ అబిడ్స్ సెంటర్‌లోని శ్రీ నూకాలమ్మ దేవస్థానం ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ లెక్కింపులో రెండు లక్షల 75 వేల 978 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ కొరుప్రోలు శ్రీనివాసరావు తెలిపారు. ఈ లెక్కింపులో శ్రీవారి సేవకులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

March 23, 2026 / 04:59 PM IST

టెన్త్ పరీక్షలు.. తిరుపతి జిల్లాలో 205 మందిగైర్హాజరు

TPT: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 10వ తరగతి గణితం పరీక్ష జరిగింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 27,590 మంది విద్యార్థులకు గాను 27,385 మంది హాజరుకాగా 205 గైర్హాజరైనట్లు వివరించారు. ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి పరీక్షలకు సంబంధించి 903 మందికి గాను 802 హాజరై 101 మంది గైర్హాజరు అయినట్లు తిరుపతి DEO కుమార్ పేర్కొన్నారు.

March 23, 2026 / 04:59 PM IST

నెల్లూరులో ASP దీక్ష దాడులు.!

నెల్లూరులో 2 నెలల కిందట బాధ్యతలు తీసుకున్న ASP దీక్ష తనదైన ముద్ర వేస్తున్నారు. సిటీలో ఆకస్మిక తనిఖీలకు దిగుతున్నారు. ఇదే క్రమంలో ఏకకాలంలో లాడ్జీలపై దాడులు చేసి వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. నగరంలోని దాబాల్లో రాత్రి వేళ మద్యం విక్రయాలు జరగుతున్నాయి. దీనిపైనా ఆమె దాడులు చేసి ఒకేసారి 40మందిని పట్టుకున్నారు.

March 23, 2026 / 04:47 PM IST

పాఠశాల తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఆదిమూలం

TPT: వరదయ్యపాలెం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు గురించి పిల్లలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోనే విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో వసతులు, బోధనపై అధికారులకు సూచనలు ఇచ్చారు.

March 23, 2026 / 04:46 PM IST

అల్లవరంలో ‘రైతన్న మీకోసం’

కోనసీమ: రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు అన్నారు. ఆయన అల్లవరం మండలంలోని ఎంట్రీ కోన గ్రామంలో స్థానిక నాయకులు నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.

March 23, 2026 / 04:46 PM IST

భద్రాచలం భక్తులకు అవగాహన

ELR: భద్రాచలం రామాలయానికి కాలినడకన వెళ్తున్న జీలుగుమిల్లి భక్తులకు మజ్జిగ పాకెట్లు పంపిణీ చేశారు. భక్తులకు రోడ్డు భద్రత నియమాలపై సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై క్రాంతి కుమార్ అవగాహన కల్పించారు. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు.

March 23, 2026 / 04:45 PM IST

దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి నివాళులు

TPT: శెట్టిబలిజ జాతి పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా తిరుపతి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి అధికారులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్‌‌వో నరసింహులు, బీసీ సంక్షేమ శాఖ డీడీతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

March 23, 2026 / 04:42 PM IST

భర్త హత్య కేసులో భార్యతో సహా ముగ్గురు అరెస్ట్

GNTR: ఈనెల 19న పత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని యనమదల వద్ద జరిగిన హత్య కేసును పోలీసులు వేగవంతంగా ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మృతుడు మద్యానికి బానిసై తన భార్యను తరచుగా వేధింపులకు గురి చేస్తున్న క్రమంలో హత్య జరిగినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.

March 23, 2026 / 04:40 PM IST

వెంకటరెడ్డి కృషి చిరస్మరణీయం: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం సామాజిక సంస్కర్త, శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ ఆనంద్, JC విష్ణుచరణ్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, విద్య, ఆత్మగౌరవం పెంపొందించడానికి వెంకటరెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

March 23, 2026 / 04:40 PM IST

మున్సిపల్ వేలంపాట మరోసారి వాయిదా

W.G: నరసాపురం మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ పన్ను వసూలు వేలంపాట మరోసారి వాయిదా పడింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను పన్ను వసూలు హక్కుల కోసం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన బహిరంగ వేలానికి ఆశించిన స్పందన లభించలేదు. ఈ వేలం ప్రక్రియలో కేవలం ముగ్గురు పాటదారులు మాత్రమే పాల్గొన్నప్పటికీ, నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ ధరకు పాడేందుకు ఎవరూ ముందుకు రాలేదని నిర్వహకులు తెలిపారు.

March 23, 2026 / 04:40 PM IST

రైతులకు నవధాన్యాలు సాగుపై అవగాహన

NLR: విడవలూరు(మం) చౌకిచర్లలో సోమవారం ఆత్మ సౌజన్యంతో రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. రైతులకు వరి పంట యాజమాన్యం పద్ధతులు గురించి వివరించారు. వరి కోత కోయడానికి 10 రోజుల ముందు VAA దగ్గర షెడ్యూల్ చేయించ్చుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ భవనాజ్ నవధాన్యాలు సాగు ఉపయోగాలు గురించి చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

March 23, 2026 / 04:39 PM IST