ASR: అభివృద్ధిలో పీసా కమిటీలే కీలకమని వై.రామవరం ఎంపీడీవో రవి కిషోర్ అన్నారు. పీసా గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు, కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బందికి గురువారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సహజ వనరులు ఇతర అభివృద్ధి పనులపై పీసా గ్రామ కమిటీలు స్వయం నిర్ణయాధికారం మేరకే అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ELR: ఎక్కడైనా పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతూ ఉంటే వెంటనే పశు సంవర్ధక శాఖ అధికారులకు తెలియచేయాలంటూ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేశారు. గురువారం స్ధానిక కలెక్టరేట్లో బర్డ్ ఫ్లూ సంబంధిత అంశంపై జిల్లాలో తీసుకున్న చర్యలను వివరించారు. దీనిపై కమాండ్ కంట్రోల్ 9966779943 నంబర్ ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు.
PPM: విద్యార్థుల బంగారు భవితకు ప్రామాణిక విద్య, మెరుగైన ఆరోగ్య భద్రత కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. కొమరాడ మండలం విక్రమపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ గురువారం సందర్శించారు. విద్యార్థినీ, విద్యార్థుల ముఖాముఖి మాట్లాడి పాఠ్యాంశాలు, ఆంగ్ల భాషపై ఉన్న పరిజ్ఞానాన్ని పరిశీలించారు.
SKLM: ఈనెల 23న జరగనున్న ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఐక్యవేదిక రాష్ట్ర కోశాధికారి జె. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పట్టణంలోని ఐక్యవేదిక కార్యాలయంలో గురువారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయడానికి ఐదు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.
KKD: పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంప్రదాయ కమిటీ సభ్యులుగా ఎంపీ సాన సతీష్ బాబు ఎంపిక కావడం పట్ల కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మేకా లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం లక్ష్మణ్ ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే సాన సతీష్ బాబుకు ఉన్నత పదవులు లభించాయన్నారు.
NLD: ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడామైదానం ఉదయం 4 నుండి 7 గంటల వరకు మాత్రమే ఉపయోగించుకోవాలని ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు. కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ, పట్టణ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
KRNL: కోడుమూరు పట్టణంలోని చౌడేశ్వరిదేవి ఆలయాన్ని మాజీ కుడా ఛైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, వైసీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సతీష్, జడ్పీటీసీ సభ్యులు రఘునాథ్ రెడ్డి దర్శించుకున్నారు. గురువారం వారు చౌడేశ్వరిదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సారె సమర్పించారు. తేరుబజార్ కాలనీ నుంచి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
EG: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వున్న చేపలు చేర్వుల్లో చచ్చిన కోళ్ళు చేపలకు మేతగా వేస్తున్నారని ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. జిల్లా లో చాలా పౌల్ట్రీల్లో వేలాది కోళ్ళు చనిపోతున్నాయి. పౌల్ట్రీ రైతుకు నష్టం వాటిల్లుతుంది. ఇది అత్యంత ప్రమాదమని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అధికారులు దీనిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
NDL: బీసీ కార్పొరేషన్ కింద రుణాల మంజూరుకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు అవుకు మండల ఎంపీడీవో కార్యాలయ అధికారులు తెలిపారు. 21 నుంచి 60 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. 50% సబ్సిడీతో అందించే ఈ రుణాలకు.. ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు https://apobmms.apcfss.inను సంప్రదించాలని సూచించారు.
కోనసీమ: మండల కేంద్రం అయిన రావులపాలెం జాతీయ రహదారిపై విందు రెష్టారెంట్ ఎదురుగా గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని అరటి రైతు తన మోటార్ సైకిల్తో ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదం పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
NDL: కల్లూరు అర్బన్ 19వ వార్డు ఇంజనీర్స్ కాలనీలో అభివృద్ధి పనుల్లో భాగంగా గురువారం సీసీరోడ్ల నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమం జరిగింది. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొని, పనులను ప్రారంభించారు. మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, బ్రాహ్మణ పల్లె నాగిరెడ్డి పాల్గొన్నారు.
PLD: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు, భారత కోకిల సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా గురువారం నూజెండ్ల మండలం పెద్దవరం పాఠశాలలో సరోజినీ నాయుడు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఆమె జయంతిని భారత దేశంలో మహిళా దినోత్సవంగా జరుపుకుంటారని తెలియజేస్తూ విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు.
పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కొమరాడ మండలంలో గురువారం పర్యటించనున్నారు. ఈ మేరకు స్దానిక MPDO మళల్లికార్దునరావు మాట్లాడుతూ.. కలెక్టర్ జడ్పీ ఉన్నత పాఠశాలల తనిఖీ చేస్తారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులంతా సమీక్ష సమావేశానికి హాజరుకావాలన్నారు.
NLR: కలువాయి మండలం కుల్లూరులో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం దంపతులు, చల్ల సీతారామ్, కమల ఆధ్వర్యంలో ఆలయం నూతనంగా నిర్మించారు. వడ్డెరల కుల ఆది గురువు ఇమ్మడి సిద్ధ రామేశ్వర స్వామి జీ సారథ్యంలో ప్రత్యేక యజ్ఞ యాగాలు జరిగాయి. భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
VZM: గుమ్మలక్ష్మీపురం వైసీపి మండల అధ్యక్షుడిగా కుంబురుకు దీనమయ్యను నియమిస్తూ వైసీపీ అధిష్టానం ఉత్తర్వులు జారి చేసింది. ఈ సందర్భంగా దీనమయ్య గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మూడోసారి మండల అధ్యక్షునిగా నియమించిన అదిష్టానికి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.