KRNL: పెద్దకడబూరులోని బీసీ, ఎస్సీ కాలనీల్లో MPP నిధులు రూ.15 లక్షలతో 2 సీసీ రోడ్ల నిర్మాణానికి ఇవాళ శ్రీకారం చుట్టారు. MPP శ్రీవిద్య, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఎంపీటీసీ సుజాత కలిసి భూమి పూజ నిర్వహించారు. పనుల్లో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం ఈ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
నెల్లూరు: కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరిని మర్చిపోకూడదనే ఆశయంతో మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన శాంతా బయోటెక్నిక్స్ ఫౌండర్ వర ప్రసాద్రెడ్డి ఎందరికో ఆదర్శప్రాయులని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. టిపి గూడూరు మండలం ఇస్కపాలెంలో శాంత-వసంత ట్రస్తు, శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు.
KRNL: కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించగా, కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాకినాడ: డ్రైవర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు రెండు రోజుల క్రితం శాసనమండలి నుంచి ఒంటరిగా వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. కాగా ఆయన సోమవారం మండలికి విచ్చేశారు. సభలో పాల్గొన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో ఆయన సమావేశమైనట్లు సమాచారం.
SKLM: మందస మండలంలో సాగునీటి ప్రాజెక్టుల పై అసెంబ్లీలో సోమవారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడారు. కళింగదల్, డబార్శింగి, దామోదర సాగర్ ప్రాజెక్టులను ఎన్టీఆర్ సహకారంతో అప్పటి ఎమ్మెల్యే గౌతు శివాజీ తీసుకొచ్చారన్నారు. ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా 11 వేల 500 ఎకరాలకు సాగునీరు అందుతుందని, ప్రస్తుతం ఈ మూడు ప్రాజెక్టులకు మరమ్మతులు అవసరం ఉందన్నారు.
AKP: నర్సీపట్నంలో ఏటీఎం కార్డులు మార్చి డబ్బులు కాజేసిన కేటుగాడిని టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు కథనం ప్రకారం సుకల నూకరాజు అనే వృద్ధుడు డబ్బులు కోసం ఏటీఎం వద్దకు వచ్చాడు. అదే సమయంలో అక్కడ ఉన్న మువ్వ వీరయ్య చౌదరి అనే పాత నిందితుడు ఏటీఎం కార్డు మార్చేసి రూ. 15 వేలు కొట్టేసాడన్నారు.
KRNL: ఎమ్మిగనూరులోని గుడికల్ పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఎన్టీఆర్ కాలనీకి చెందిన మహబూబ్ సుభాన్ (25) తీవ్రంగా గాయపడ్డాడు. గంజహళ్లి ఉరుసు మహోత్సవానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే అతడిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు.
ఏలూరు నగరంలోని పలు కాలేజీలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల కేంద్రాలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షలు జరుగుతున్న విధానాన్ని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు ఇబ్బందులు కలవకుండా చూసుకోవాలని సూచించారు.
KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 గ్రామంలో వెలసిన శ్రీ మంగళ గౌరీ సమేత అమరలింగేశ్వరుని ఆలయంలో సోమవారం అమరలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిగాయి.ఆలయ అర్చకులు జింకా సాంబయ్య స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం వంటి పలు అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరించారు.భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
సత్యసాయి: అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర చేనేత, జౌళి శాఖా మంత్రి సవిత సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాల అమ్మకాల పరిస్థితిపై ఆరా తీశారు. చేనేత ఉత్పత్తుల నాణ్యత, ధరలు, వినియోగదారుల స్పందనపై వివరాలు తెలుసుకున్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి నేతన్నలకు ప్రోత్సాహం అందించారు.
ATP: జిల్లాలో తొలిరోజు ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. మొదటి రోజు పరీక్షకు మొత్తం 22,848 మంది విద్యార్థులు కేటాయించబడగా, వారిలో 22,213 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో 635 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.
కోనసీమ: కొత్తపేట మండలం బిల్లకుర్రు గ్రామానికి చెందిన ఇళ్ల దేవి శ్రీ గత కొన్ని రోజులుగా బోన్ క్యాన్సర్తో బాధపడుతూ వైజాగ్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వైద్య చికిత్సకు ఆమె కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై కామన్ మ్యాన్ సేవాదళ్ సభ్యులు స్పందించిన వెంటనే ఆమె కుటుంబాన్ని పరామర్శించి పది వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.
E.G: రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు సేవించి అస్వస్థతకు గురైన బాధితులను ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు PVN మాధవ్ సోమవారం పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు తక్షణమే అప్రమత్తమై సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు.
కడప జిల్లా వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో నూతన మఠాధిపతి వీరధర్మజ వేంకటాద్రి స్వామి కఠిన నిర్ణయాలు ప్రకటించారు. సమయపాలన, క్రమశిక్షణ పాటించాలని సిబ్బందికి ఆదేశించి, నిర్లక్ష్యంపై హెచ్చరిక జారీ చేశారు. భవిష్యత్ మేనేజర్గా పిపిఎన్ ప్రసాద్ను ప్రకటించారు. ఈనెల 24 నుంచి 26 వరకు జరిగే పట్టాభిషేక మహోత్సవ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
తిరుపతి జిల్లాలో ఇంటర్ మొదటి సం. పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా జరిగింది. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఇవాళ జరిగిన పరీక్షకు 797మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు. మొత్తం 31014 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 30217 మంది విద్యార్థులు హాజరు అయ్యారు.