ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం నారాయణ స్వామి వారి ఆదివారం ఆదాయం రూ. 1,07,953లు వచ్చినట్లు ఈవో నరసింహ బాబు సోమవారం తెలిపారు. అందులో దర్శన టికెట్ల అమ్మకం ద్వారా రూ. 38,730లు, ప్రసాదం విక్రయం ద్వారా రూ. 22,830 ఆదాయం లభించిందన్నారు. అదేవిధంగా అన్నదానానికి విరాళాల ద్వారా రూ. 35,876లు, పంచామృతాభిషేకానికి రూ. 5516లు వచ్చాయన్నారు.
ప్రకాశం: ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపి ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగించవద్దని వాహనదారులకు సీఐ ఖాజావలి సూచించారు. కనిగిరి పట్టణంలోని బొడ్డు చావిడి, మహా లక్ష్మమ్మ చెట్టు సెంటర్ వద్ద వాహనదారులకు, షాపుల యజమానులకు సీఐ ట్రాఫిక్పై సోమవారం అవగాహన కల్పించారు. పోలీసులు సూచించిన విధంగా రహదారులకు ఓవైపు మాత్రమే వాహనాలు పార్కింగ్ చేయాలన్నారు.
SKLM: మద్యం సేవించి వాహనం నడుపుతు పట్టుబడిన వాహనదారుల లైసెన్స్లను చట్ట ప్రకారం రద్దు చేయడం జరుగుతుందని ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే 70 మంది వాహన చోదకులు లైసెన్సులు రద్దు చేశామన్నారు. మరో 60 మంది వాహన చోదకులు యొక్క లైసెన్స్ల రద్దుకు రవాణా కమిషనర్కు ప్రతిపాదనలు పంపించామన్నారు.
ASR: గిరిజన విద్యార్థులు ఎందులోనూ తీసిపోరని గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. 21వేల మంది విద్యార్థులు గత 5నెలలుగా యోగ సాధన చేస్తూ సోమవారం అరకులో 108సూర్య నమస్కారాలతో ప్రపంచ రికార్డ్ సాధనకు ముందుకు రావడం హర్షించే విషయమన్నారు. యోగా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 5మండలాలకు చెందిన సుమారు 21,850 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రకాశం: కొండపి మండలం K. ఉప్పలపాడులో జరిగిన లైంగిక దాడి ఘటనపై కొండపి ఎస్సై ప్రేమ్ కుమార్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసును దర్యాప్తు చేసిన కనిగిరి సబ్ డివిజన్ డీఎస్పీ సాయి ఈశ్వర్ ముద్దాయిని అరెస్టు చేసి కనిగిరి కోర్టులో సోమవారం ప్రవేశపెట్టారు. కాగా కనిగిరి కోర్టు జడ్జి ముద్దాయికి 11 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై ప్రేమ్ తెలిపారు.
VZM: కోరుకొండ రైల్వే స్టేషన్ సమీపంలోని గుండాలపేట వద్ద సోమవారం గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు GRP ఎస్సై బాలాజీరావు తెలిపారు. మృతుడి వయస్సు 45 నుండి 50 సంవత్సరాల మధ్య ఉంటాయన్నారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు తమను సంప్రదించాలని కోరారు. ఈ మేరకు హెచ్సి కృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం: టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలోని సోమవారం అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సింగరాయకొండ సీఐ హజరత్ అయ్యా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వారి వద్ద నుండి 41 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నలుగురు నిందితులను రిమాండ్కు తరలిస్తునట్లు తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు.
ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసఫ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 30వ తేదీలోపు పన్నులు చెల్లించిన వారికి పన్నులో 5 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
BPT: సంతమాగులూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్గా తెల్లప్రోలు రమేష్ నియమితులైన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో సోమవారం సంతమాగులూరు మండల పరిషత్ కార్యాలయంలో ఆయనకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధికారులు ప్రజాప్రతినిధులు రమేష్ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. అలాగే మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
సత్యసాయి: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పుట్టపర్తిలో ర్యాలీ నిర్వహించారు. ఎనుములపల్లి PHC వద్ద ర్యాలీని MLA పల్లె సింధూరరెడ్డి ప్రారంభించారు. అక్కడి నుంచి బయలుదేరిన వైద్యులు, ఆశా వర్కర్లు గణేష్ సర్కిల్లో మానవహారం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహా భాగ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని గుంత బావి నుండి పోలీస్ క్వార్టర్స్ వరకు జరుగుతున్న తాగునీటి పైప్లైన్ కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా వాహనదారులు వేరే దారి గుండా వెళ్లాలని మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పైప్ లైన్ మరమ్మతుల అనంతరం యధావిధిగా ఈ రహదారి గుండా వాహనాలు వెళ్తాయని అప్పటివరకు పట్టణ ప్రజల సహకరించాలన్నారు.
ELR: చింతలపూడి మండలం పాత చింతలపూడి గ్రామంలో పార్టీ సభ్యత్వ కార్డులను నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు బోడా అనిష్ కుమార్ మాట్లాడారు. 2 సంవత్సరాలకు కలిపి రూ.100 చెల్లిస్తే రూ.5 లక్షల ప్రమాద బీమాను మంత్రి నారా లోకేష్ వర్తింపచేయడంతో, టీడీపీ మెంబర్ షిప్ తీసుకోవడం ఎంతో మంచిదన్నారు.
సత్యసాయి: మడకశిర మండలం నీలకంఠాపురంలో కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 18 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించారు. భద్రాచలం సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలతో నీలకంఠాపురంలోని ఆలయంలో ఈ వివాహాలను జరిపించారు. వధూవరులకు నూతన వస్త్రాలు, తాళిబొట్లు, కాలిమెట్టెలు అందజేసి భోజనం ఏర్పాటు చేశారు.
ATP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హెలిప్యాడ్ వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్సీ తులసిల రఘురాం, జిల్లా వైసీపీ నేతలు పరిశీలించారు. ఏర్పాట్లపై పోలీసులతో మాట్లాడారు. మంగళవారం ఉదయం 10:40 గంటలకు జగన్ హెలిప్యాడ్కు చేరుకుంటారని వైసీపీ నేతలు తెలిపారు. అనంతరం రోడ్డు మార్గాన పాపిరెడ్డిపల్లెకి వెళ్తారు.
ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెట్రి సెల్వి, జేసీ ధాత్రి రెడ్డి, ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను పరిశీలించి వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు.