కృష్ణా: మచిలీపట్నం 23వ డివిజన్ ఇంఛార్జ్, టీడీపీ నాయకులు చింతా చిన్ని మాతృమూర్తి చింతా భాగ్యలక్ష్మి మంగళవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆమె పార్దివదేహాన్ని సందర్శించి, పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ATP: విడపనకల్లు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. మండల ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో మంత్రి మొక్కులు నాటి, నీళ్లు పోశారు. వాటిని సంరక్షించాలని సిబ్బందికి సూచించారు.
NTR: అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ మండలం గొల్లపూడిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిపరిశీలించారు. అయన మాట్లాడుతూ.. 4రోజుల పాటు అకాల వర్షాలు ఉన్నందున సాధ్యమైనంత త్వరగా ధాన్యాన్ని మరింత వేగంగా, యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలన్నారు.
ATP: గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని ఆర్డీటీ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ మంగళవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ నయుం అహ్మద్కు కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి మాట్లాడుతూ.. ఆర్డిటి కాలనీలో త్రాగునీరు, డ్రైనేజీ కాలువలు, వీధిలైట్లు లేక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు.
SKLM: AIYF 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్ అన్నారు. మంగళవారం ఆముదాలవలస స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద AIYF 17వ జాతీయ మహాసభలు గోడ పత్రికను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. అత్యధిక జనాభా కలిగిన దేశం మనదని అయితే దేశంలో 65శాతం యువత ఉందని యువశక్తిని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయన్నారు.
ATP: జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి తల్లిపాల నిధి కేంద్రం, ధన్వంతరి మీటింగ్ హాల్, ఆర్వోప్లాంట్ను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. తల్లిపాల నిధి కేంద్రానికి విరాళమిచ్చిన తాడిపత్రి అర్జాస్ స్టీల్స్, వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు విరాళమిచ్చిన సప్తగిరి క్యాంఫర్ లిమిటెడ్ యాజమాన్యానికి మంత్రి అభినందనలు తెలిపారు.
VZM: ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ ఆధ్వర్యంలో గజపతినగరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. నిరుపేదలకు గ్రామీణ ప్రాంతంలో ఇంటి స్థలంకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రాన్ని తహసీల్దార్కి అందించారు.
కృష్ణా: అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని సాయిబాబా గుడి పక్కన మలుపులో ఉన్న చెత్త నుంచి మంగళవారం భారీగా మంటలు చెలరేగాయి. చెట్లకు మంటలు అంటుకోవటంతో స్థానికులు సర్పంచ్ దాసరి విజయ్ కుమార్కు సమాచారం అందించారు. అవనిగడ్డ ఫైర్ సిబ్బందికి విషయం తెలపటంతో వారు వచ్చి మంటలు ఆదుపు చేశారు.
NDL: పగిడ్యాల మండలం బీరవోలు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త షేక్ రఫీ నేడు ఉ. 5 గంటలకు గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నంది కోట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గ్రామానికి చేరుకుని రఫీ మృతదేహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
KRNL: కర్నూలును మెడికల్ హబ్గా మారుస్తామని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. నగరంలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అనేక పథకాలను తీసుకొచ్చిందని, వాటిని అందరూ ఉపయోగించుకోవాలన్నారు.
SKLM: జలుమూరు మండలం లచ్చన్నపేటలో ఎన్రోల్మెంట్ స్పెషల్ డ్రైవ్ చేపట్టామని ఉపాధ్యాయుడు ధర్మవరపు శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం చేపట్టిన ఈ డ్రైవ్లో ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల్లో విద్యబోధనలు అందిస్తున్నామన్నారు.
SKLM: ఎచ్చెర్లలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో జాతీయ సేవా పథకం యూనిట్ 4 ప్రోగ్రాం ఆఫీసర్ డా.జి.ఈశ్వరరావు ఆధ్వర్యంలో వాలంటీర్లకు సర్వీస్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ మాట్లాడుతూ.. విద్యార్థి దశ చాలా ఉన్నతమైనదన్నారు. వాలంటీర్లు నాయకత్వపు లక్షణాలు నేర్చుకొని ప్రజల్లో చైతన్యం కలిగించవచ్చన్నారు.
ELR: ఉంగుటూరు మండలం కాగుపాడు పంచాయతీ సర్పంచ్ కడియాల సుధేష్ణను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీలో పలు ఆర్థిక అవకతవకలు జరిగాయని వార్డు సభ్యుడు వంకిన మాధవరావు చేసిన కంప్లైంట్ ఆధారంగా అధికారులు విచారణ చేశారు. ఈ క్రమంలో సర్పంచును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
VSP: ఏపీ జీఎస్డీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు గిమ్మిక్కులతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ జీఏస్డీపీలో రెండోస్థానంలో ఉందని సీఎంగా చంద్రబాబు గొప్పగా ప్రకటించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
SKLM: ఎచ్చెర్ల మండలం దుప్పలవలస డా. బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల/ కళాశాల విద్యార్థులు ఈ నెల 5న విజయవాడలో ఏపీ ఫారెస్ట్ డిపార్ట్ ఆధ్వర్యంలో 12వ జాతీయ చిత్రలేఖనం పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 101 మంది విద్యార్థులపాల్గొనగా 20 మంది విద్యార్థులు బంగారు పతకాలు, 11 మంది సిల్వర్ పతకాలు సాధించారని ప్రిన్సిపల్ బుచ్చిబాబు తెలిపారు.