కృష్ణా: ముసునూరు మండలం లోపూడిలో శుక్రవారం అప్రకటిత విద్యుత్ కోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి విద్యుత్ సరఫరా కాకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏవైనా మరమ్మత్తులు ఉంటే ముందుగానే విద్యుత్ కోత ప్రకటిస్తే అనుగుణంగా ముందుకు వెళతామంటూ ప్రజలు పేర్కొన్నారు. వ్యవసాయ, వ్యాపారాలకు విద్యుత్ కోత తీవ్ర అంతరాయం కలిగిందన్నారు.
సత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు రేపు ఉదయం 10 గంటలకు లేపాక్షి మండల MRO కార్యాలయంలో భూ సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మండల ప్రజలు హాజరై తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా మండల కన్వీనర్ E. జయప్ప కోరారు.
SKLM: పోలాకి మండలం రాళ్లపాడు కాలనీలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆయనతోపాటు ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, మండల అధ్యక్షులు కణితి కృష్ణారావు, తదితరులు ఉన్నారు.
కోనసీమ: అల్లవరం మండలం మొగళ్లమూరు గ్రామంలో శ్రీ లక్ష్మీగణపతి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సతీమణి చింతా అనురాధ పాల్గొని, స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమెను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.
కృష్ణా: పామర్రు టౌన్ గుడివాడ రోడ్డులో ఉన్న ఓ చికెన్ సెంటర్లో తెల్లవారుజామున దొంగతనం జరిగిందని షాప్ యజమాని తెలిపాడు. ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం షాప్ వద్దకు వచ్చి చూసేసరికి గేట్కు వేసి ఉన్న తాళాలు బద్దలుకొట్టి ఉన్నాయని, అలాగే షాప్లో ముఖ్యమైన వస్తువులు దొంగిలించబడ్డాయని చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
కృష్ణా: కూటమి ప్రభుత్వం పేదల వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 21మందికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.18,86,311లను సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ సహాయం వేగవంతంగా అందిస్తున్న చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
NTR: గంపలగూడెం మండలం అనుముల లంకలో ఉన్న పౌల్ట్రీ ఫారంలో వేలకొద్ది కోళ్లు బర్డ్ ఫ్లూతో మృత్యువాత పడ్డ విషయం విధితమే. ఈ నేపథ్యంలో జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ హనుమంతరావు పర్యవేక్షణలో కోళ్ల శాంపిల్స్ తీసి పరీక్షా కేంద్రానికి పంపారు. రిజల్ట్ వచ్చేంతవరకు 10 కిలోమీటర్ల లోపల ఉన్న గ్రామాలలో చికెన్ షాపులు తెరవద్దని,రెడ్ అలర్ట్ ప్రకటించారు.
VZM: తగరపువలసలోని ఓ స్వీట్ షాప్లో మహిళ మృతిచెందింది. భోగాపురం మండలం పోలిపల్లికి చెందిన రక్షణకుమారి కొంతకాలంగా ఓ స్వీట్ షాప్లో పనిచేస్తున్నారు. గురువారం బాగోలేదని ట్యాబ్లెట్ వేసుకుని షాప్క్ వెళ్లింది. అక్కడ పని చేస్తూ ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.
E.G: రాజమండ్రిలోని ప్రకాష్నగర్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ స్టేషన్లోని వివిధ రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి విషయాన్ని రికార్డుల యందు జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. అలాగే ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరించాలన్నారు.
ELR: గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే పురుడు పోసుకోవాలని గణపవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ కిరణ్మయి అన్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం గణపవరం పీహెచ్సీలో జరిగింది. 74 గర్భిణీ ‘స్త్రీలను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
VZM: వ్యవసాయ ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు కల్పించి రైతుకు మేలు చేస్తామని ఏపీ మార్క్ ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు తెలిపారు. విజయవాడ మార్క్ ఫెడ్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయసాగులో ఆధునిక పద్ధతులు అవలంభించే విధంగా రైతుల సహకారం ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తోందన్నారు.
VZM: ఢిల్లీలోని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం భేటీ అయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హౌస్లో స్పీకర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో భాగమైన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావును స్పీకర్కు పరిచయం చేశారు. అనంతరం పలు సమస్యలపై చర్చించారు.
VZM: ఆధార్ నమోదులోను, అప్డేషన్లోనూ తప్పులు లేకుండా చూడాలని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆధార్ నమోదు పై జిల్లా కమిటీతో సమావేశం నిర్వహించారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు, మహిళలకు, శాశ్వతంగా మంచాన పడి ఉన్నవారికి, ట్రాన్స్ జెండర్లను గుర్తించి ఆధార్ నమోదు చేయాలన్నారు.
W.G: మండవల్లి మండలం కానుకోల్లు సమీపంలో కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన గురువారం చోటు చేసుకుంది. కైకలూరు నుంచి విజయవాడ వెళ్తున్న కారుకి అడ్డంగా గేదెలు అడ్డు వచ్చాయి. దీంతో కారు అదుపు తప్ప రహదారి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు కారులతో ఉన్న ఇద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. వారు విజయవాడ చెందిన వారిగా గుర్తించారు.
ATP: రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో అర్హులైన రైతాంగానికి ఈనెల 16న సూక్ష్మ సాగునీటి సేద్య పరికరాల పంపిణీ చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం 11:30 గంటలకు పంపిణీ ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.