కృష్ణా: ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల రెల్లీ కులస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరిలో జరిగిన అంతర్ రాష్ట్రాల క్రికెట్ పోటీల్లో గుడివాడకు చెందిన రాజ్ సీసీ జట్టు సభ్యులు ప్రతిభ చూపి రన్నరప్గా నిలిచారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన టీం సభ్యులను తన కార్యాలయంలో సీనియర్ వైసీపీ నేతలు మండలి హనుమంతరావు శనివారం అభినందించారు.
KRNL: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఉపకులపతిగా రాయలసీమ నుంచి మొట్టమొదటి వ్యక్తిగా కర్నూలుకి చెందిన డాక్టర్ చంద్రశేఖర్ నియామకం కావడం శుభపరిణామం అని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. శనివారం కర్నూల్ మెడికల్ కళాశాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని NTR హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్తో కలిసి పరిశీలించారు. అనంతరం చంద్రశేఖర్ను సన్మానించారు.
KRNL: అంతర్జాతీయ క్రీడాకారుడు రామాంజనేయులును ఆదుకోవాలని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. శారీరక వికలాంగుడైన రామాంజనేయులు 2015 నుంచి వివిధ రకాల క్రీడాల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ, రాణిస్తున్న ఆర్థిక ప్రోత్సాహంలేక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే శనివారం తెలిపారు. ఇలాంటి క్రీడాకారులను దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.
NTR: అమరావతి 2.0కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన వేడుకకు రాష్ట్రవ్యాప్తంగా జైత్రయాత్ర కదిలిందని శనివారం ఏపీ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. రూ.49,040 కోట్ల ప్రాజెక్టులకు వెలగపూడిలో ప్రారంభోత్సవాలు వైభవంగా జరిగాయని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో రాజధాని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందన్నారు.
SKLM: గార మండలం సతివాడ గ్రామంలో శనివారం ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ మేరకు శ్రీకూర్మం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డా.డి. పద్మజ పలువురు రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ వైద్య శిబిరంలో ఏఎన్ఎం అప్పమ్మ, 104 సిబ్బంది, ఆశా కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
SKLM: పాతపట్నం మండల కేంద్రానికి సమీపంలోని కాకితోట వద్ద శనివారం గుణుపూర్ నుంచి పూరి వెళ్తున్న రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుపట్టలేని విధంగా మృతదేహం నుజ్జునుజ్జయింది.
KRNL: కౌతాళం మండలంలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామి దేవస్థానంలో శనివారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 05-03-2025 నుంచి 01-05-2025, 56 రోజుల స్వామివారి హుండీని లెక్కించారు. హుండీ ఆదాయం రూ.1,14,68,836, బంగారం 29.గ్రా 100 మి. గ్రా, వెండి 13 కేజీల 790గ్రా. వచ్చిందని అదికారులు తెలిపారు.
NDL: రుద్రవరంలోని హైస్కూల్ కాలనీకి చెందిన వైసీపీ యువ నాయకుడు అవుట శ్రీనివాసులు మృతి పార్టీకి తీరనిలోటని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అన్నారు. శనివారం అనారోగ్యంతో మృతి చెందిన శ్రీనివాసులు మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే వెంట వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
KKD: ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు భగీరథ జయంతిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగలి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం కలెక్టరేట్లో ఈ జయంతి కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతి నిధులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు హాజరు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
SKLM: పాతపట్నంలో కొలువైన శ్రీ నీలమణి దుర్గమ్మ ఆలయం 50వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా వైశాఖ మాసం శనివారం పురస్కరించుకుని అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు రాజేశ్ ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు అలకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు కోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వాసుదేవరావు తెలిపారు.
ATP: రాయదుర్గం మండలం టి. వీరాపురం గ్రామంలో మట్కా రాస్తున్న ఒకర్ని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ జయనాయక్ మీడియాతో తెలిపారు. బస్టాండ్ వద్ద మట్కా రాస్తున్న చిలకరి హనుమంతును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుండి 30 వేల రూపాయల నగదును మట్కా చీటీలను మరియు బాల్ పెన్నను స్వాధీనం చేసుకున్నామన్నారు.
ATP: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి హైదరాబాదులో ప్రత్యక్షమయ్యారు. వైఎస్ జగన్ రామగిరి పర్యటన సందర్భంగా నమోదైన కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారన్న వార్తలొచ్చాయి. ఈ క్రమంలో తాను పరారీలో లేనన్న సందేశం ఇచ్చేలా హైదరాబాదులోని ఓ మీడియా హౌస్ వద్ద ప్రత్యక్షమయ్యారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
KRNL: జిల్లాలోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి మెడికల్ ఫిజిసిస్ట్, అనెస్తీషియా టెక్నీషియన్, అటెండెంట్ కేటగిరిల ఫైనల్ మెరిట్, సెలెక్షన్ లిస్ట్ శుక్రవారం విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థులు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 6 నుండి 8 మధ్య కర్నూలు మెడికల్ కాలేజీలో కౌన్సెలింగ్కు హాజరుకావాలని ప్రిన్సిపాల్ నరసమ్మ తెలిపారు.
KRNL: పెద్దకడుబూరు మండలం జాలవాడి గ్రామంలో టీడీపీ నాయకుడు ముక్కన్న ఇంటి ముందు శుక్రవారం రాత్రి క్షుద్ర పూజలు జరిగిన విషయం కలకలం రేపింది. రెండు రోజులపాటు అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహిస్తున్న టీడీపీ నాయకుడు తెలిపారు సంఘటన జరిగిన చోటు వద్ద నిమ్మకాయలు, ఉల్లిగడ్డలు, మెంతాలు, కోడిగుడ్డలు, కుంకుమ, పసుపు, వస్తువులు వదిలివేశారన్నారు.
CTR: గుడిపాల ఎంసీఆర్ క్రాస్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఓ జేసీబీ ఢీ కొట్టిన ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు SI రామ్మోహన్ తెలిపారు. నగరికి చెందిన రుశేంద్రబాబు (35)తన భార్య, కుమారుడు (5)తో కలిసి ఆటోలో వస్తుండగా అతివేగంగా వచ్చిన జేసీబీ ఢీ కొట్టింది. స్థానికులు క్షతగాత్రులను సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.