• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తిరుపతి కోదండ రామాలయంలో భక్తుల రద్దీ

TPT: తిరుపతిలోని శ్రీకోదండరామ స్వామివారి ఆలయం నవమి శోభను సంతరించుకుంది. రాములవారి దర్శనార్థం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణలతో రామాలయం వెలిగిపోతోంది. ఉదయం నుంచి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ మంచి నీరు, మజ్జిగ పంపిణీ చేసింది.

April 6, 2025 / 04:31 PM IST

మెదరమెట్లలో క్రైస్తవులు నిరసన ర్యాలీ

ప్రకాశం: కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో దైవ సేవకులు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసనగా మండల క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవులపై దాడులు అరికట్టాలంటూ వారు నినాదాలు చేశారు. ప్రవీణ్ పగడాల కేసులో న్యాయం జరగాలంటూ పలువురు నినదించారు. దర్యాప్తు సక్రమంగా జరగాలని కోరారు. నిజా నిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు.

April 6, 2025 / 04:27 PM IST

‘ప్రతి ఇంటికి శుభ్రమైన నీరు అందించడమే లక్ష్యం’

SKLM: సీతంపేట మండలం దుగ్గి గ్రామం లో పీఎమ్ జన్ మన్ పథకం ద్వారా రూ.8.లక్షల అంచనా విలువతో 10000 లీటర్ల సామర్ధ్యం గల వాటర్ ట్యాంక్, ఇంటి ఇంటికి మంజూరైన నీటి కుళాయిలుకు ఆదివారం పాలకొండ ఎమ్మెల్యే ఎన్.జయకృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి శుభ్రమైన నీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.

April 6, 2025 / 04:02 PM IST

బోయకొండ హండీ ఆదాయం రూ. 5.52 కోట్లు.

CTR: బోయకొండ గంగమ్మకు భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. హుండీ ద్వారా ఏడాదికి రూ. 5.52 కోట్లు సమకూరినట్లు ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం వెల్లడించారు. గతేడాది కంటే ఇది రూ. 72 లక్షలు అధికమని చెప్పారు. అలాగే బంగారు, వెండి సైతం భారీగా సమకూరిందన్నారు. ఆలయ ఆదాయానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

April 6, 2025 / 04:00 PM IST

చౌడేశ్వరి ఆలయానికి విరాళం

NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలోని శ్రీ చౌడేశ్వరి ఆలయ అభివృద్ధికి ప్యాపిలి వాస్తవ్యులు తుమ్మనేని రాజశేఖర్ నాయుడు కుటుంబం రూ.50 వేల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు కుటుంబ సమేతంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ, మాజీ చైర్మన్ పీవీ కుమార్ రెడ్డికి ఆదివారం విరాళాన్ని అందించారు. దర్శన ఏర్పాట్ల అనంతరం దాతలకు తీర్థప్రసాదాలు అందజేశారు.

April 6, 2025 / 02:44 PM IST

శ్రీరామనవమి వేడుకల్లో చింతమనేని

ELR: పెదవేగి మండలం దుగ్గిరాలలో శ్రీ రామనవమి సందర్భంగా ఆంజనేయ స్వామి వారిని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదివారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్థులతో కలిసి పానకం కలిపే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 6, 2025 / 02:14 PM IST

శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: ఎల్‌కోట మండలం ఖాసాపేటలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదివారం రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి బాలాజీ రాంప్రసాద్‌తో కలసి పాల్గొన్నారు. అనంతరం జరిగిన సీతారాముల కళ్యాణంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామి వారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.

April 6, 2025 / 02:14 PM IST

రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

W.G: పెంటపాడు మండలం కస్పా పెంటపాడు శ్రీ గోపాలస్వామి, ఆంజనేయస్వామి వారి ఆలయాల్లో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలుత ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేకు పటిక బెల్లం తులాభారం నిర్వహించారు.

April 6, 2025 / 02:13 PM IST

చెరువులో పడి బాలుడు మృతి

PLD: వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో ఆదివారం పండుగ రోజు విషాద సంఘటన చోటుచేసుకుంది. ఉదయాన్నే నలుగురు బాలురు కలిసి బహిర్భూమికి వెళ్లారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు (16) అనే బాలుడు చెరువులో ఉన్న తామర పువ్వు తీసేందుకు దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో ఊపిరి ఆడక మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు.

April 6, 2025 / 01:51 PM IST

వర్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం

KRNL: కేంద్రం తీసుకొచ్చిన వక్స్ చట్టాన్ని కర్నూలులో మైనారిటీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆదివారం కర్నూలులోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు అహమ్మద్ అలీఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, టౌన్ అధ్యక్షుడు పత్తా భాషా మాట్లాడారు. ఈ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చిన తీరు బాధాకరమన్నారు.

April 6, 2025 / 01:45 PM IST

రాములోరిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

VZM: దత్తిరాజేరు మండలంలోని భూపాలరాజపురం గ్రామంలో సీతారాముల వారిని గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య ఆదివారం దర్శించుకున్నారు. నూతనంగా నిర్మించిన సీతారాముల ఆలయంలో అప్పలనరసయ్య ప్రత్యేక పూజలు జరిపించారు. అంతకుముందు నాయకులు కార్యకర్తలు అప్పల నరసయ్యకు ఘనస్వాగతం పలికారు.

April 6, 2025 / 01:43 PM IST

రాముని బాణంలా ‘శక్తి’ యాప్

BPT: శ్రీరామనవమి సందర్భంగా బాపట్ల రథం బజార్‌లో శ్రీసీతారామ స్వామి కళ్యాణ మండపం వద్ద ఆదివారం మహిళా భక్తులకు పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి ఒక్క మహిళా భక్తురాలి మొబైల్‌లో ‘శక్తి యాప్’ను ఇన్‌స్టాల్ చేస్తూ, మహిళల రక్షణ కోసం ఈ యాప్ ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. ప్రతి ఒక్క మహిళకు రాముని బాణంలా శక్తి యాప్ పనిచేస్తుందన్నారు.

April 6, 2025 / 01:21 PM IST

ప్రత్యేక అలంకరణలో శ్రీ చౌడేశ్వరి దేవి

అనంతపురం: జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న శ్రీ చౌడేశ్వరి దేవికి ఆదివారం ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని, తీర్థప్రసాదాలను స్వీకరించారు.

April 6, 2025 / 10:06 AM IST

‘గొప్ప మహాకవి వాల్మీకి’

అనంతపురం: రాయదుర్గం పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా వాల్మీకి విగ్రహానికి, భక్తకన్నప్ప విగ్రహానికి పూలమాలలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాల్మీకి సంక్షేమ సేవా సమితి ఉపాధ్యక్షులు మలకన్న ఆధ్వర్యంలో పూజలు చేపట్టారు. రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి సమాజంలో మానవుల మధ్య సంబంధాలు, విలువలు,బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు తెలియజేసిన మహా ఆదికవి వాల్మీకి మహర్షి అన్నారు.

April 6, 2025 / 10:00 AM IST

విగ్రహ ఆవిష్కరణలో టీడీపీ ఇన్‌ఛార్జ్

ప్రకాశం: పుల్లలచెరువు మండలం మర్రివేములలో స్వర్గీయ ఉదారపు వెంకటేశ్వర్లు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, గుంటూరు జనసేన కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు వెంకటేశ్వర్లు సేవలను కొనియాడారు. వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.

April 6, 2025 / 08:44 AM IST