• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గిరిజన గ్రామాల్లో ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమం

VZM: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన గ్రామాలకు అందిస్తున్న పథకాలు సౌకర్యాలు వివరిస్తూ, నాటుసారా తయారి, వినియోగం వలన కలిగే ప్రభావాలు తెలియజేస్తూ మెంటాడ మండలం కింద గూడెం గ్రామంలో బుధవారం ఆండ్ర ఎస్ఐ సీతారాం ఆద్వర్యంలో ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. పిల్లల విద్యను ప్రోత్సహిస్తూ వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్నారు.

February 12, 2025 / 11:02 AM IST

కిచెన్ గార్డెన్ ను పరిశీలించిన ఎంఈఓ

VZM: వేపాడ మండలం ఎన్ కె ఆర్ పురం ఎంపీపీ పాఠశాలలో నిర్వహిస్తున్న కిచెన్ గార్డెన్ ను ఎం ఈ ఓ- 1 ఎన్ కాశీపతిరాజు బుధవారం పరిశీలించారు. కిచెన్ గార్డెన్ లో సాగు చేస్తున్న కాయగూరలను మధ్యాహ్న భోజన పథకంలో సక్రమంగా వినియోగించాలని సూచించారు. అనంతరం ఆయన పాఠశాల పరిసరాలను, వంటగది, తరగతి గదుల నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

February 12, 2025 / 11:01 AM IST

రాజేంద్రప్రసాద్ను భారీ మెజార్టీతో గెలిపిద్దాం: సత్యకుమార్

కృష్ణా: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి 27న పురస్కరించుకొని కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను భారీ మెజారిటీతో గెలిపిద్దామని మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. బుధవారం విజయవాడలో ఓ ఫంక్షన్ హాల్లో కూటమి నేతలు అందరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి ప్రాధాన్యత ఓటు రాజేంద్రప్రసాద్‌కు  వేసేలా పట్టభద్రులను చైతన్యవంతం చేయాలని సూచించారు.

February 12, 2025 / 10:42 AM IST

సింధు స్నానాలకు పోటెత్తిన భక్తులు

కృష్ణా: కోడూరు మండల పరిధిలోని హంసలదీవి సమీపంలో ఉన్న సముద్ర తీరం వద్ద మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా బుధవారం సింధు స్నానాలకు భక్తులు పోటెత్తారు. కృష్ణా జిల్లాతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పుణ్యస్నానాలు చేశారు. సంగమ ప్రాంతంలో స్నానాలు చేసేందుకు అధికారులు అనుమతులు ఇవ్వలేదు. ప్రజలు వేకువజామునే భారీగా వాహనాలపై వచ్చి సముద్ర స్నానాలు చేశారు.

February 12, 2025 / 09:29 AM IST

భయభ్రాంతులకు గురి చేస్తున్న కుక్కలు

AKP: పాయకరావుపేట పట్టణంలో వీధి కుక్కలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తూ వచ్చే పోయే వారిపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి. రాత్రి వేళల్లో వీటి అరుపులకు నిద్ర పట్టడం లేదని పట్టణవాసులు తెలిపారు. ద్విచక్ర వాహనదారులను వెంట తరుముతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పంచాయతీ అధికారులు నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

February 12, 2025 / 08:25 AM IST

జిల్లాస్థాయి గుర్రం పరుగు పోటీలు

నాతవరం మండలం లింగంపేట గ్రామంలో బుధవారం జిల్లాస్థాయి గుర్రం పరుగు పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యుడు దొర మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. వెన్నెల ఈవెంట్స్, కాంతార డాన్స్ తదితర సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు.

February 12, 2025 / 08:23 AM IST

పాయకరావుపేట కుమ్మరి వీధిలో పొగ ఇబ్బందులు

AKP: పాయకరావుపేట 4వ వార్డు కుమ్మరివీధిలో పొగతో ఈ ప్రాంతీయులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కొందరు మినీ బట్టీలు ఏర్పాటు చేసి సుచిబుడ్డులు, పూజా ప్రమిదలు, కుండలు తయారు చేస్తుంటారు. అయితే వీటిని వేడి చేసే క్రమంలో పొగ విపరీతంగా వ్యాపించడంతో పొగతో పలు అవస్థలు పడుతున్నామని, దీంతో శ్వాస కోశ సమస్యలు వచ్చే అవకాశం ఉందని స్ధానికులు వాపోతున్నారు. 

February 12, 2025 / 08:19 AM IST

అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష

కృష్ణా: అత్యాచారం కేసులో నిందితుడికి మచిలీపట్నం న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. వీరవల్లి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. 2021లో మల్లవల్లి గ్రామంలో కాసులు అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 10 ఏళ్ల ఆరు నెలల జైలు శిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది.

February 12, 2025 / 08:17 AM IST

ముమ్మరంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

AKP: కోటవురట్ల మండలంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. మంగళవారం సాయంత్రం పీఆర్టీయూ ఉపాధ్యాయ ప్రతినిధులు లింగాపురం, తంగేడు,బీకె పల్లి తదితర గ్రామాల్లో ఉపాధ్యాయ ఓటర్లను కలిసి గాదె శ్రీనివాసులు నాయుడికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆయనకు ఉపాధ్యాయుల సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు. ప్రచార కార్యక్రమంలో ప్రతినిధులు పాల్గొన్నారు.

February 12, 2025 / 07:53 AM IST

‘మినీ స్టేడియం పనులు త్వరలో ప్రారంభిస్తాం’

ప్రకాశం: దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులో గల మినీ స్టేడియం ప్రాంతాన్ని మంగళవారం దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అధికారులతో కలిసి పరిశీలించారు. స్టేడియం నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కోరమన్నారు. మినీ స్టేడియం త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.

February 12, 2025 / 07:31 AM IST

మహిళపై అత్యాచారయత్నం

CTR: బైరెడ్డిపల్లి ఎన్టీఆర్ కాలనీలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై అత్యాచారానికి యత్నించిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పరశురాముడు తెలిపారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అదే కాలనీకి చెందిన నాగరాజు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

February 12, 2025 / 07:25 AM IST

విశాఖకు 100 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

విశాఖకు త్వరలో 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నట్లు ప్రభుత్వ వెల్లడించింది. దీనికి సంబంధించి ఎలక్ట్రిక్ బస్సులు నిర్వహణకు అనువైన ఏర్పాట్లు ఆయా డిపోలో విశాఖ రీజియన్ అధికారులు పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు పరిశీలన అనంతరం మొదటి విడతలో 50 బస్సులు, రెండో విడతలో మరో 50 బస్సులు పంపనున్నట్లు తెలిపారు. వచ్చేనెల నుంచి విశాఖకు ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయి.

February 12, 2025 / 07:18 AM IST

రహదారులపై వాహనాలు

కృష్ణా: మోపిదేవి మండలం కే. కొత్తపాలెం గ్రామంలో ప్రతి రోజు గొడవలు చోటు చేసుకుంటున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు, ఆటోలను వాటి యజమానులు రహదారులపై ఉంచుతున్నారని వాపోతున్నరు. దీంతో రోడ్లపై వాహనాలు తిరిగే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల ఇలాంటి ఘటన వల్ల ఓ వ్యక్తి మృతి చెందాడు.

February 12, 2025 / 07:18 AM IST

టెన్త్ అర్హతతో 48 ఉద్యోగాలు

కృష్ణా: టెన్త్ అర్హతతో విజయవాడ డివిజన్‌లో 48 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకిల్ లేదా బైక్ నడిపే సామర్థ్యం, వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం.

February 12, 2025 / 07:17 AM IST

నేడు వినుకొండకు రానున్న కలెక్టర్ అరుణ్ బాబు

PLD: వినుకొండలో త్వరలో ఏర్పాటు చేయబోయే లెదర్ పార్క్ స్థల పరిశీలనకు పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు నేడు ఉదయం 10:00 గంటలకు వినుకొండ మండలం వెంకుపాలెం గ్రామంలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో పాటు మల్టీ నేషనల్ కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపారు.

February 12, 2025 / 07:16 AM IST