ప్రకాశం: ఒంగోలు నగరంలోని ఏకేవీకే జూనియర్ కళాశాలలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ ముగిసింది. మార్కుల మొత్తం జాబితాను తయారు చేసి కంప్యూటరీకరణ కూడా పూర్తయినట్లుగా అధికారులు తెలిపారు. కాగా, ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అనేవి చూసి తప్పులు ఉంటే వాటిని సరిచేస్తున్నామని తెలిపారు.
NDL: డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ డోన్లో రేపు ఉదయం సుమారు 10.00 గంటలకు స్కార్పియో, సిడిడిలక్స్, స్కూటీ మూడు వాహనములకు వేలం నిర్వహించనున్నట్లు CI బి. వరలక్ష్మి తెలిపారు. ఆసక్తి గల వ్యక్తులు డోన్లో నిర్వహించే వేలం పాటలో పాల్గొనాలని కోరారు.
ప్రకాశం: ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికతో వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. కొండపి మండలం ఉప్పలపాడులో పనుల కోసం వచ్చిన తల్లిదండ్రులు బాలికను ఇంటి వద్ద వదిలి పనులకు వెళ్తున్న సమయంలో అక్కడే ఉంటున్న సాదు వెంకటకోటయ్య బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
ప్రకాశం: మసాజ్ సెంటర్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయని ఒంగోలు వాసులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు పోలీసు అధికారులు దాడులు నిర్వహించినప్పటికీ నిర్వాహకుల తీరులో మార్పు రావటం లేదని పేర్కొన్నారు. ఓ మసాజ్ సెంటర్ నిర్వాహకుడిపై ఒంగోలు తాలూకా సీఐ శ్రీనివాస్ రావు, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలను అదుపులోకి తీసుకున్నారు.
బాపట్ల: చీరాల వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు శనివారం ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సూరేపల్లి సుబ్బారావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలులో ఎస్సీ, ఎస్టీ సెల్ సీఐగా పనిచేస్తూ ఆయన బదిలీపై చీరాలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తామని, అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తానని తెలిపారు.
కృష్ణా: మోపిదేవిలోని ప్రధాన రహదారిలో కాలువ గట్టు పక్కన ఉన్న పోరంబోకు స్థలంలో నాలుగు గృహాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా శనివారం అగ్నికి ఆహుతి అయ్యాయి. రోడ్డు పక్కన నాలుగు కుటుంబాల వారి గృహాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అంటుకుని తగలబడ్డాయి. అవనిగడ్డ ఫైర్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
VZM: పోలీసుశాఖ ఆధ్వర్యంలో దళిత వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరై బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడన్నారు.
KRNL: గోనెగండ్ల పరిధిలోని గంజిహళ్లిలో వెలసిన హజరత్ మహాత్మా బడే సాహెబ్ నెల ఉర్సు మహోత్సవం ఘనంగా జరుగుతోంది. దర్గాను దర్శించుకోవడానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని దర్గా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు చిన్న ముదుగోలు తెలిపారు.
VZM: లక్కవరపుకోట పోలీసు స్టేషన్ పరిధి రంగారాయపురం గ్రామంలో ఐదు సంవత్సరాల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 17 సంవత్సరాల మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నామని విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. వివరాల మేరకు ఏప్రిల్ 4న రాత్రి టివీ చూసేందుకు వచ్చి, కుటుంబసభ్యులు వేరే పనుల్లో నిమగ్నమై ఉండగా నిందుతుడు నేరానికి పాల్పడ్డరన్నారు.
NLR: వలేటివారిపాలెం మండలం మాలకొండ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యేకు వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
NLR: రాపూరు మండలంలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. పులిగిలపాడు గ్రామం వద్ద ఆటో-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుడిని జోరోపల్లికి చెందిన వల్లూరు జగదీశ్గా స్థానికులు గుర్తించారు.
కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ను కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాంజీ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. వెలగపూడి సచివాలయంలో ఆయనను కలిసి విశ్వవిద్యాలయం అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. భవిష్యత్తులో విశ్వవిద్యాలయ అభివృద్ధికి సహకారాన్ని అందించాలని ఉపకులపతి రాంజీ కోరారు.
PLD: మాచర్ల మాజీ ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి శవ రాజకీయాలు మానుకోవాలని మాచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వీరాస్వామి అన్నారు. మాచర్ల మండలం పసువేములలో మామ అల్లుళ్ల మధ్య భూ వివాదంలో 4 నెలల క్రితం అల్లుడిని మామ గొడ్డలితో నరికితే ఇప్పటికీ అల్లుడు కోమాలో ఉన్నాడన్నారు. ఆ కక్ష్యతో అల్లుడి తల్లితో పాటు కుటుంబ సభ్యులు మామను హత్య చేసి చంపారన్నారు.
NLR: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈనెల 7వ తేదీన సోమవారం మర్రిపాడు మండలంలో పర్యటించనున్నారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు మంత్రి కార్యాలయ సిబ్బంది శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
NLR: రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.