విశాఖలోని ‘మిలాన్–2026’, ‘ఐఎఫ్ఆర్’ వేడుకల సందర్భంగా భారత తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ వికాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్తో పాటు పలు స్నేహ దేశాలకు చెందిన 80 మందికి పైగా మీడియా ప్రతినిధులు నౌకను సందర్శించారు. స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన విధానాన్ని ఈస్టర్న్ నేవల్ అధికారులు నౌక ప్రత్యేకతలను జర్నలిస...
అన్నమయ్య: మదనపల్లిలో టమాటా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టమాటా ధరలు భారీగా పడిపోవడంతో పెట్టుబడి కూడా తిరిగి రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో బహుజన్ యువసేన (BYS) ఆధ్వర్యంలో నాయకులు, రైతులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు తక్షణ సహాయం అందించాలని కోరారు.
WG: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నరసాపురం డీసీసీబీ బ్రాంచ్ వద్ద సహకార సంఘాల ఉద్యోగులు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు తమ నిరసనను తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని, పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.
సత్యసాయి: పెనుకొండలో ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ సోమవారం రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. యూనియన్ అధ్యక్షురాలు జయమ్మ, కార్యదర్శి బావమ్మ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 1810 మినీ వర్కర్లకు అర్హతల సడలింపు ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు.
అన్నమయ్య: జిల్లా కలికిరిలోని సైనిక్ స్కూల్లో సోమవారం బాంబు బెదిరింపు ఈ-మెయిల్ నేపథ్యంలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబ్ డిస్పోజల్, డాగ్ స్వాడ్ బృందాల తనిఖీల్లో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. బెదిరింపు పుకారేనని అధికారులు నిర్ధారించగా, ప్రజలు ఆందోళన చెందవద్దని ఎస్పీ ధీరజ్ సూచించారు.
AKP: మాతా, శిశు మరణాల నివారణకు సకాలంలో సేవలు అందించాలని జిల్లా టాస్క్ ఫోర్స్ ప్రధాన అధికారి డాక్టర్ జె.ప్రశాంతి సూచించారు. సోమవారం టాస్క్ ఫోర్స్ బృందం హరిపాలెం పీహెచ్సీ పరిధిలోని ఎం.జగన్నాధపురం విలేజ్ హెల్త్ క్లినిక్ను సందర్శించారు. గర్భిణీలు, పిల్లల నమోదు, హైరిస్క్ కేసుల గుర్తింపు, ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు.
KRNL: అసంఘటిత కార్మికుల సమస్యలను ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సోమవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. విపత్తు వేళల్లో కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్రం అమలు చేస్తున్న ‘ఈ-శ్రామ్’ పథకాన్ని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం కార్మిక నిధులను మళ్లించిందని ఎమ్మెల ఆరోపించారు. పేదలు ఎక్కడైనా రేషన్ పొందే విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
VSP: జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ఫిర్యాదుల (PGRS) పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న పదిమంది అధికారులను హెచ్చరిస్తూ, “పని చేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్ళిపోండి” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
అన్నమయ్య: పాత రాయచోటిలో పిచ్చి కుక్క హల్చల్. సోమవారం కుక్క దాడిలో ఇద్దరికీ గాయాలు కాగా, స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు.గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.వీధి కుక్కల బెడదపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతపురం: రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో రెండు రోజులపాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. టి వీరాపురం వద్ద పైప్ లైన్ లీకేజీ కారణంగా మరమ్మత్తులో భాగంగా 24, 25వ తేదీలలో నీటి సరఫరా ఉండదని తెలిపారు. కావున రెండు రోజులపాటు ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని సహకరించాలని కోరారు.
CTR: పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశాయి. మొదటి విడతగా నగరి మున్సిపాలిటీకి 454 ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తమ కల నెరవేరుతోందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషితో ఘంటసాల మండలం పూషడం గ్రామ ప్రధాన రహదారి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రూ.కోటీ నలభై లక్షలతో పల్లె పండుగ కార్యక్రమం పురస్కరించుకొని జాతీయ రహదారి-216 నుంచి పూషడం వరకూ మూడు కిలోమీటర్లు ప్రధాన రహదారిలో నూతన తారు రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
GNTR: పారిశుద్ధ్య కార్మికులకు ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ప్రత్తిపాడు సర్పంచ్ వసవర్తి రమాదేవి సోమవారం పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. గతంలో సుమారు రూ.14 లక్షల బిల్లులను డ్రా చేసి గోల్మాల్ చేశారని ఆమె ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఎలా డ్రా చేశారో అధికారులు సమాధానం చెప్పాలని, కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
BPT: అద్దంకి మండలం ద్వారకా నగర్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాంసన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
SKLM: గల్లీ నుండి డిల్లీ వరకు ఎర్రన్న స్థానం ఎప్పుడూ ప్రత్యేకమైనదని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. తన తండ్రి దివంగత ఎర్రంనాయుడు 69వ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన పలు కార్యక్రమాలలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. అనంతరం నిమ్మాడలోని ఎర్రన్న ఘాట్లో కుటుంబ సభ్యులతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.