• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

భైరవస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు

VSP: భైరవస్వామి ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం అధికారులను ఆదేశించారు. ఆలయానికి వెళ్లే రోడ్డును మెరుగుపరచడంతో పాటు, భక్తులకు తాగునీరు, టాయిలెట్లు, లైటింగ్ వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గ్రాండ్ ఆర్చ్ నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. అనంతరం భైరవస్వామిని దర్శించుకుని పూజలు చేశారు.

March 21, 2026 / 07:59 PM IST

బీజేపీ పార్టీ బలోపేతం కార్యాచరణ సిద్ధాంతాలపై చర్చ

TPT: ఇవాళ రేణిగుంటలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి BJP పార్టీ ఇంఛార్జ్ కోలా ఆనంద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన కార్యకర్తలతో కలిసి పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్టీ చరిత్ర, సైద్ధాంతిక పునాది కాలాంశాలను శిక్షణార్థులకు వివరించారు.

March 21, 2026 / 07:53 PM IST

స్పీడ్ బ్రేకర్ తొలగింపు

KDP: సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారి కనుమలోపల్లె సమీపంలోని శ్రీ మందగిరి శనీశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన స్పీడ్ బ్రేకరును సిద్ధవటం ఏఎస్సై సుబ్బరామచంద్ర ఆధ్వర్యంలో ఇవాళ రాత్రి తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్సై మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా అధికారుల ఆదేశాల మేరకు స్పీడ్ బ్రేకరును శాశ్వతంగా తొలగింపు చేపట్టామని తెలిపారు.

March 21, 2026 / 07:52 PM IST

ఆలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

E.G: రాజమండ్రి రూరల్ మండలం కోలమూరు పంచాయతీ రాయుడుపాకలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం శంకుస్థాపన చేశారు. ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయ పునర్మాణం, రాజగోపురం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు పాల్గొన్నారు.

March 21, 2026 / 07:52 PM IST

ముఠా కళాశీల కూలిరేట్లు పెంపు

ASR: పాడేరులోని ముఠా కళాశీల కూలిరేట్లు పెంపుపై శనివారం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ టీ.సూర్యనారయణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించినట్లు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి సుందరరావు తెలిపారు. సిమెంట్, ఐరన్ వర్తకుల సంఘం, ముఠా కళాశీల కార్మిక సంఘం మధ్య ఒప్పందం జరిగిందన్నారు. గతంలో కంటే 20శాతం కూలిరేట్లు పెంచడం జరిగిందన్నారు.

March 21, 2026 / 07:49 PM IST

పట్టణ పేద ప్రజలకు 2 సెంట్ల స్థలం ఇవ్వాలి: CPI

KRNL: ఈనెల 24న నిర్వహించనున్న CPI ధర్నాను జయప్రదం చేయాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇవాళ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. నగర కార్యదర్శి రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల హామీల మేరకు ఇంటి స్థలం లేని పట్టణ పేదలకు 2 సెంట్ల ఇంటి జాగా ఇవ్వాలన్నారు.

March 21, 2026 / 07:47 PM IST

వైసీపీలోకి భారీ చేరికలు

SS: నల్లమాడ(మం) దొన్నికోట పంచాయతీ సుబ్బరాయునిపల్లిలో పలు కుటుంబాలు వైసీపీలో చేరాయి. పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలోకి వస్తున్నారని తెలిపారు.

March 21, 2026 / 07:46 PM IST

15 ఏళ్ల సమస్యకు పరిష్కారం.. రామవరప్పాడులో బీటీ రోడ్డు

కృష్ణా: గన్నవరం నియోజకవర్గంలోని రామవరప్పాడులో 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రహదారి సమస్యకు MLA యార్లగడ్డ వెంకట్రావు శ్రీకారం చుట్టారు. కట్టపై బీటీ రోడ్డు పనులను ప్రారంభించి పురోగతిని ఆయన శనివారం పరిశీలించారు. రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయని చెప్పారు. సమస్య పరిష్కారం పై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

March 21, 2026 / 07:45 PM IST

హనుమంతరాయ చౌదరి మృతికి పరిటాల నివాళి

ATP: ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు, కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి భౌతికకాయాన్ని ఎమ్మెల్యే పరిటాల సునీత సందర్శించారు. పార్టీ సహచర నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

March 21, 2026 / 07:44 PM IST

APWJS మహాసభలకు కేంద్రమంత్రికి ఆహ్వానం

SKLM: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (APWJS) రాష్ట్ర మహాసభలు 2026 జూన్ 6, 7వ తేదీలలో విశాఖపట్నం జిల్లాలో జరగనున్నాయి. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని APWJS రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గురుగుబెల్లి అప్పలనాయుడు శనివారం ఆహ్వానించారు.

March 21, 2026 / 07:43 PM IST

‘గ్లోబల్ డెస్టినేషన్‌గా ఉత్తరాంధ్ర’

VSP: ఉత్తరాంధ్ర ప్రాంతం వేగంగా అభివృద్ధి చెంది గ్లోబల్ డెస్టినేషన్‌గా మారుతోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖలో శనివారం నిర్వహించిన సీఐఐ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులతో ప్రాంత రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. త్వరలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రానుందన్నారు.

March 21, 2026 / 07:43 PM IST

ద్రాక్షరామంలో ‘కార్డన్ సెర్చ్’

కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు, రామచంద్రాపురం ఇంఛార్జ్ డీఎస్పీ TSRK ప్రసాద్ శనివారం ద్రాక్షారామం పరిధిలోని ఆదివారపుపేట, YSR కాలనీల్లో భారీ ‘కార్డన్ సెర్చ్’ నిర్వహించారు. ప్రతి ఇంటిని కూలంకషంగా తనిఖీ చేశారు. గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయం, వాడకం చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడివారికి హెచ్చరించారు.

March 21, 2026 / 07:42 PM IST

బీజేపీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం

VZM: గజపతినగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ కార్యకర్తలకు పండిట్ దీన దయాల్ ప్రశిక్షణ కార్యక్రమం శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏడు అంశాలపై 24 గంటల్లో వివరించడం జరుగుతుందన్నారు. ఇందులో ఓబిసి జిల్లా అధ్యక్షుడు దొగ్గ దేవుడుబాబు, భాస్కర్‌రావు పాల్గొన్నారు.

March 21, 2026 / 07:40 PM IST

రేపు ముప్పాళ్ల చౌడేశ్వరి అమ్మవారి తిరునాళ్లు

PLD: ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామ దేవత చౌడేశ్వరి అమ్మవారి తిరునాళ్ల ఆదివారం నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. తిరుణాలను పురస్కరించుకొని శనివారం జల బిందెల ఊరేగింపు నిర్వహించారు. తిరుణాల ఆదివారం ఉదయం అమ్మవారికి అభిషేకాలు చేస్తారు. అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరిస్తారని పేర్కొన్నారు.

March 21, 2026 / 07:39 PM IST

‘ఆశా కార్యకర్త కుటుంబాన్ని ఆదుకోవాలి’

ASR: విధి నిర్వహణలో ఉండగానే మృతి చెందిన ఆశా కార్యకర్త కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.సుందరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాడేరు మండలం మినుములూరు పీహెచ్‌సీ పరిధిలోని కే.కుమ్మరిపుట్టు గ్రామంలో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న బట్టి పార్వతమ్మ శనివారం మృతి చెందారు. పలువురు యూనియన్ నేతలు ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

March 21, 2026 / 07:39 PM IST