• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

దర్శనానికి వచ్చిన వ్యక్తి అదృశ్యం

కృష్ణా: కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఓ వృద్ధుడు అదృశ్యమయ్యాడు. 5వ టౌన్ పోలీసుల వివరాల మేరకు.. శ్రీకాకుళానికి చెందిన కోటా కృష్ణమూర్తి అనే వ్యక్తి ఈనెల 5న కుటుంబ సభ్యులతో కలిసి ట్రైన్‌లో కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులందరూ కలిసి రైల్వే స్టేషన్లో భోజనం చేసిన అనంతరం కృష్ణమూర్తి కనపడకపోవడంతో కుమారుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

February 12, 2025 / 07:07 AM IST

బెదిరించి డబ్బులు లాక్కున్న ఘటనపై కేసు నమోదు

VSP: లీలా వరప్రసాద్ ఇద్దరు స్నేహితులతో సోమవారం రాత్రి టిఫిన్ కోసం వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి డబ్బులు డిమాండ్ చేశారు. ఓ కాలేజీ సమీపంలో వారిని భయపెట్టి, కొట్టి రూ.1,000 లాక్కున్నారు. మరో రూ.5,000 తీసుకురమ్మని ముగ్గురు స్నేహితుల్లో ఒకరిని పంపించి బెదిరించారు. భీమిలి పోలీస్ స్టేషన్‌లో వరప్రసాద్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 12, 2025 / 07:02 AM IST

విశాఖ ఉక్కులు 16 మందికి ఛార్జిషీట్లు జారీ

విశాఖ ఉక్కుల పని చేస్తున్న 16 మంది అధికారులకు యాజమాన్యం ఛార్జిషీట్లు జారీ చేసింది. ఉక్కు కర్మాగారం అప్పుల్లో రూ.220 కోట్లు కలపకపోవడంతో ఛార్జిషీట్లు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. వీరిలో కర్మగారంలోని ఆర్ఎండీ, క్యూఏటీడీ, ఎంఎం ఫైనాన్స్ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు ఉన్నారు. ఛార్జిషీట్లు అందుకున్న వారిలో కొందరు ఈ నెలాఖరులోన పదవీ విరమణ చేయనున్నారు.

February 12, 2025 / 07:01 AM IST

ఈనెల 25 వరకు మాత్రమే అవకాశం

Akp: ఈ నెల 25లోగా రైతులు తమ భూముల వివరాలను ఆన్ లైన్‌లో రిజిస్టర్ చేయించుకోవాలని రోలుగుంట మండల వ్యవసాయాధికారి ఎస్.విజయలక్ష్మి తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకం, ఫోన్ నెంబర్ లింక్ అయి ఉన్న ఆధార్ కార్డుతో సచివాలయం రైతు సేవా కేంద్రాలకు వెళితే రైతు సేవా కేంద్రం అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆన్ లైన్‌లో రిజిస్టర్ చేస్తారన్నారు.

February 12, 2025 / 06:33 AM IST

వైద్యారోగ్య శాఖ సిబ్బందితో సమీక్ష

VSP: కేంద్ర పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ కేంద్ర బృందం డాక్టర్ పాదాలు, రమణ మంగళవారం విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. సిబ్బంది, అధికారుల పని తీరు సమీక్ష చేసి పలు సూచనలు చేశారు. క్షేత్ర స్థాయి సిబ్బంది హాజరును పరిశీలించి తగు సూచనలు చేశారు.

February 12, 2025 / 06:21 AM IST

రూ.4కోట్లతో సింహాచలం ఆలయ పైకప్పుకు మరమ్మతులు

VSP: సింహాచలంలో దేవాలయం పైకప్పు వర్షపు నీటి లీకేజీ నివారణ ప్రాజెక్టు ఒప్పందం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసురావు పాల్గొన్నారు. పుణేకు చెందిన కంపెనీ పనులు చేయడానికి ముందుకు వచ్చింది. 9 నెలల్లో రూ.4కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు.

February 12, 2025 / 06:19 AM IST

‘సాయి మనోజ్ఞ అందరికీ ఆదర్శంగా నిలిచింది’

కృష్ణా: 2025 JEE మెయిన్ పేపర్-1లో 100% స్కోర్ చేసిన ఏకైక మహిళా అభ్యర్థిగా నిలిచిన గుత్తికొండ సాయి మనోజ్ఞకు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ఉజ్వల భవిష్యత్ కోసం కలలు కనే ప్రతీ విద్యార్థికీ మన రాష్ట్రానికి చెందిన సాయి మనోజ్ఞ ఆదర్శంగా నిలిచిందని సుజనా ప్రశంసించారు.

February 12, 2025 / 04:12 AM IST

రేపు పెనుకొండ మండలంలో మంత్రి సవిత పర్యటన

సత్యసాయి: మంత్రి సవిత రేపు పెనుకొండ, సోమందేపల్లి మండలాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు పెనుకొండ మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌లో జలహారతి కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం సోమందేపల్లి మండలం మాగేచెరువు గ్రామంలో కొల్హాపూరి మహాలక్ష్మి అమ్మవారి రథోత్సవంలో పాల్గొంటారని సిబ్బంది తెలిపారు.

February 11, 2025 / 05:17 PM IST

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు

ATP: తాడిపత్రి చుట్టుపక్కల ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ప్రదేశాలను పోలీసులు మంగళవారం తనిఖీ చేశారు. తాడిపత్రి రూరల్ ఎస్ఐలు ధరణి బాబు, కాటమయ్య కలిసి తనిఖీలు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం అందించాలని స్థానికులకు సూచించారు.

February 11, 2025 / 04:32 PM IST

విరువూరులో 104 వాహన వైద్య సేవలు

NLR: వరికుంటపాడు మండలంలోని ఇరువురు గ్రామంలో మంగళవారం మండల వైద్యాధికారిని ఆయేషా 104 వాహన వైద్య సేవలను అందించారు. ఆమె 53 మందిని పరీక్షించి ఉచితంగా మందులు అందించారు. అలాగే ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. దీర్ఘకాలిక రోగులు మారిన వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చలికాలంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

February 11, 2025 / 03:04 PM IST

సాదాసీదాగా సర్వసభ్య సమావేశం

VZM: దత్తిరాజేరు మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. ఇందులో ప్రధానంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో రాజేంద్రప్రసాద్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సింహాద్రి అప్పలనాయుడు, జెడ్పీటీసీ రౌతు రాజేశ్వరి, వైస్‌ ఎంపీపీ మిత్తిరెడ్డి రమేశ్‌ నాయుడు పాల్గొన్నారు.

February 11, 2025 / 02:20 PM IST

‘సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలి’

ATP: గుంతకల్లులోని ఓ ప్రైవేటు కళాశాలలో సైబర్ నేరాలపై మంగళవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టు టౌన్ సీఐ మస్తాన్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు.

February 11, 2025 / 01:57 PM IST

‘మూడు నెలలు చికెన్ షాపులు మూసివేత’

W.G: వేల్పూరులోని కృష్ణానందం పౌల్ట్రీ నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూ పాజిటివ్ నిర్ధారణ అయిందని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. వాటిని అరికట్టేందుకు అన్ని రకాల అత్యవసర చర్యలను చేపట్టాని, 3నెలల పాటు ఇన్ఫెక్షన్ జోన్లోని కోళ్ల ఫారాలు, షాపులు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. పెద్దఅమిరం కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

February 11, 2025 / 01:36 PM IST

నవగ్రహ సుబ్రహ్మణ్య ధ్వజ శిఖర ప్రతిష్ట పూజకు విరాళం

ATP: గుంతకల్లులో కోదండ రామస్వామి ఆలయంలో నూతన నవగ్రహ సుబ్రహ్మణ్య ధ్వజ శిఖర ప్రతిష్ట పూజా కార్యక్రమానికి టీడీపీ గుంతకల్లు మండల ఇంచఛార్జ్ నారాయణస్వామి, టీడీపీ నాయకులతో కలిసి మంగళవారం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు రూ. 30,000 విరాళం అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు నారాయణస్వామిని శాలువాతో సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

February 11, 2025 / 01:34 PM IST

పేదలకు ఇంటి స్థలం కోసం పోరుబాట

VZM: కూటమి ప్రభుత్వ ఎన్నికల హమీలో బాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు హామీ అమలు చేసే వరకు భారత కమ్యునిస్టు పార్టీ పోరుబాట కొనసాగుతుందని నియోజకవర్గ కార్యదర్శి బుగత అశోక్ తెలిపారు. మంగళవారం డి.ఎన్.ఆర్ అమర్ భవన్‌లో పేదల ఇంటి స్థలం కోసం సీపీఐ పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన ప్రచార గోడ పత్రికలను విడుదల చేశారు.

February 11, 2025 / 01:33 PM IST