ప్రకాశం: వైసీపీ అభివృద్ధి కోసం నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని కనిగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం కనిగిరి పార్టీ కార్యాలయంలో పీసీపల్లి మండల నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, పెదచెర్లోపల్లి గ్రామ కమిటీ నియామక పత్రాలను అందజేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఆయన సూచించారు.
PLD: రావిపాడు గ్రామం నుంచి కనపర్తి బాలయేసు పుణ్యక్షేత్రం వరకు గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించిన పరిశుద్ధ సిలువ పాదయాత్రలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిలువను మోసే భాగ్యం కలగడం తనకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని తెలిపారు. భక్తుల విశ్వాసం, ఐక్యత సమాజానికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.
NLR: విడవలూరులోని వావిల్ల రోడ్లో ధాన్యం సేకరణను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడారు.. రైతులకు లారీలు, ధాన్యం కొలతలకు సంబంధించి గోన సంచులు కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. రైతులకు అధికారులు, నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు.
ELR: టి.నర్సాపురం మండలంలోని పలు గ్రామాల్లో ఇవాళ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు దాడులు నిర్వహించారు. తిరుమలదేవిపేటలో అనగాని రాంబాబు, బొల్లం రామకృష్ణల వద్ద విక్రయిస్తున్న కల్లును రసాయన పరీక్షల నిమిత్తం సేకరించారు. అనంతరం టి.నర్సాపురంలోని మద్యం దుకాణాల్లో నిల్వలను తనిఖీ చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై జె.జగ్గారావు, సిబ్బంది పాల్గొన్నారు.
TPT: టీటీడీ ప్రాణదాన ట్రస్ట్కు రూ. 10 లక్షల విరాళం అందజేసినట్లు జేఎంసీ ట్రస్ట్ ఛైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుమల రంగనాయకుల మండపంలో సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే, విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. ఈ సందర్భంగా సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
కోనసీమ: ఆత్రేయపురం(M) వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటులు తనికెళ్ళ భరణి, గౌతం రాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. 25 సంవత్సరాలు క్రితం ఇక్కడికి రావడం జరిగిందని, అప్పుడు సాధారణ జనం, ఇప్పుడు లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారన్నారు. మరో తిరుమలగా రోజూ రోజుకు అభివృద్ధి చెందుతుండడం సంతోషంగా ఉందన్నారు.
ELR: చాట్రాయి మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రి పార్థసారథికి వినతి పత్రం సమర్పించారు. ఇవాళ చాట్రాయిలో మంత్రిని టీడీపీ మండల అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాస్ కలిశారు. సుమారు 12 వేల ఎకరాల్లో పంట సాగులో ఉందని, త్వరగా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కోరారు.
అన్నమయ్య: రైల్వేకోడూరు మండలం మైసూరవారిపల్లి పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారిపై ఇవాళ ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి కడప వైపు వెళ్తున్న లారీ మార్కెట్ యార్డ్ సమీపంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు. లారీ చెట్టుని ఢీకొని రోడ్డుకు అడ్డుగా ఉండటంతో కొంతమేర ట్రాఫిక్ జామైంది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.
WG: నరసాపురం మండలం లిఖితపూడిలో ఇవాళ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామంలోని మొత్తం 186 పశువులకు ఉచితంగా టీకాలు వేశారు. పశువైద్యాధికారి డాక్టర్ ఐ.సురేంద్ర కుమార్ మాట్లాడుతూ.. వర్షాకాలం, శీతాకాలం సమయాల్లో పశువులకు సోకే గాలికుంటు వ్యాధి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
KRNL: పేద కుటుంబాలకు CMRF పథకం భరోసాగా నిలుస్తుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ఇశాళ కౌతాళం గ్రామానికి చెందిన పరిమళ బాయికి రూ.1,48,847, కర్నూలు మండలం రేమట గ్రామానికి చెందిన బలరాముడుకు రూ.75,122 సీఏం సహాయ నిధి ద్వారా ఆర్ధిక సహాయాన్ని పంచలింగాలలోని తన స్వగృహంలో ఎంపీ అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అన్నారు.
సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాలతో పోలీసులు డ్రోన్ల ద్వారా అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టారు. లేపాక్షి మండల అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న స్థావరాన్ని ఎస్సై నరేంద్ర బృందం డ్రోన్ కెమెరాల సాయంతో గుర్తించింది. ఈ దాడిలో ఏడుగురు జూదరులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 5,800 నగదు స్వాధీనం చేసుకున్నారు.
ATP: కొండూపల్లిలో గతంలో కురిసిన వడగళ్ల వానకు గొర్రెలు కోల్పోయిన 15 మంది రైతులకు ప్రభుత్వం రూ. 7,14,000 నష్టపరిహారం మంజూరు చేసింది. అనంతపురం జిల్లాకు చెందిన కాపరుల కష్టాలను ఎమ్మెల్యే బండారు శ్రావణి సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిధులు విడుదలయ్యాయి. 238 గొర్రెలు మరణించగా బాధిత కుటుంబాలకు ఈ సాయం అందింది.
KKD: ఈ నెల 23న కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను అనివార్య కారణాలవల్ల రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు, అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి 1100 కాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KRNL: పత్తికొండలో కౌలు రైతును ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రామచంద్రయ్య డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆదోని రోడ్డులోని కౌలు రైతు పక్కీరప్పకు చెందిన రూ 5 లక్షలు విలువ చేసే పశుగ్రాశం అగ్ని ప్రమాదానికి గురై కాలిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న రామచంద్రయ్య ఇవాళ కౌలు రైతును పరామర్శించారు.
VZM: బొండపల్లి మండలం దేవుపల్లిలో శనివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మక ‘ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్’ ఏర్పాటుతో జిల్లా దశ మారుతుందన్నారు. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అందుతాయని పేర్కొన్నారు. ఈనెల 23న ప్లాంట్కు శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు.