PLD: నరసరావుపేట పురపాలక సంఘ పరిధిలో రోడ్డు మార్జిన్, డ్రైన్లు, ఫుట్ పాత్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ జస్వంత్ రావు హెచ్చరించారు. సోమవారం వినుకొండ రోడ్డులోని ఆక్రమణలను జేసీబీతో తొలగించారు. ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని లేకుంటే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తామని హెచ్చరించారు.
ప్రకాశం: ఒంగోలు నియోజకవర్గంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సోమవారం శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పంపిణీ చేశారు. సోమవారం ఒంగోలులోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన కార్యక్రమంలో 13 మందికి 17 లక్షల 56 వేల రూపాయల ఆర్దిక సహాయాన్ని చెక్కుల రూపంలో లబ్దిదారులకు పంపిణీ చేశారు.
W.G: పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల వచ్చిన దరఖాస్తులను సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
VZM: కొత్తవలస ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి.ఎస్.రాజశేఖర్ నాయుడు ఆదేశాలతో ఎల్.కోట మండలం జమ్మాదేవిపేట గ్రామంలో ఎస్సై ఎన్.రమ్యశ్రీ నేతృత్వంలో సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నాయుడు అనే వ్యక్తి వద్ద పది అక్రమ మద్యం బాటిళ్లు లభ్యమైనట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
NLR: జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ ప్రాంగణంలో మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతినెలా మూడవ శనివారం అన్నిశాఖల అధికారులు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు.
TPT: నాయుడుపేట మండలం బిరదవాడకు చెందిన ఓ యువకుడు శ్రీకాళహస్తి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మునిశేఖర్ నాయుడుపేటలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నారు. తిరుపతికి పని నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా శ్రీకాళహస్తి సమీపంలో ఆయన బైక్కు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో మునిశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ASR: అర్హులైన రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ పథకంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అగ్రికల్చర్ అధికారి కే.సత్తిబాబు సూచించారు. కొయ్యూరు మండలంలోని తీగలమెట్ట గ్రామంలో ఆయన ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు రైతులకు రిజిస్ట్రేషన్ చేశారు. అర్హులైన రైతులందరూ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.
VZM: విజయనగరం జిల్లా యువజన సర్వీసుల శాఖ సెట్విజ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా వయోజన విద్యా శాఖ ఉప సంచాలకులు ఏ. సోమేశ్వర రావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సీఈవోగా వున్న రాంగోపాల్ తన మాతృశాఖకు వెళ్లడంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు ఇంఛార్జ్ సీఈవోగా సోమేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు.
చిత్తూరు: సదుంలోని వారపు సంతలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. పనుల వివరాలను కాంట్రాక్టర్ సోమశేఖర్ రెడ్డి ఆయనకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ ధనుంజయ రెడ్డి, వార్డు సభ్యుడు భాస్కర, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
W.G: ఆచంట మండలం కొడమంచిలి గ్రామంలో మద్యం బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న ఎస్.వెంకటనారాయణను సోమవారం పాలకొల్లు ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఆరు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు జి.రఘు, పి.మహేశ్లు పాల్గొన్నారు. బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
VZM: రైతులందరికీ భూ ఆధార్ కార్డు తప్పనిసరి అని మండల వ్యవసాయ అధికారిణి పూర్ణిమ సూచించారు. మండలంలోని చంద్రంపేట గ్రామంలో భూ ఆధార్ నంబర్ నమోదు చేసే కార్యక్రమంపై సోమవారం రైతులకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు భూ ఆధార్ నంబర్ పొందాలన్నారు. సదరు ఆధార్ ద్వారా ప్రతి రైతుకు గుర్తింపు నంబర్ ఇవ్వాలని చెప్పారు.
VZM: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పరిష్కరించుకుని ఎస్.కోట మండలం ఎస్జి పేట ప్రభుత్వ పాఠశాలలో ఏఎన్ఎం కృష్ణవేణి సోమవారం పాఠశాల హెచ్ఎం కె బంగారు నాయుడు ఆధ్వర్యంలో 52 మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించాలని, తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.
VZM: పోలీసులు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సోమవారం నిర్వహించిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల పునశ్చరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పోలీసులు విధులు నిర్వహించే సమయంలో అంకితభావం, నిజాయితీతో వ్యవహరించి ప్రజలకు చేరువ కావాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఫిబ్రవరి 10 నుండి 24 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
W.G: ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం పేరాబత్తుల రాజశేఖరం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఏలూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని రాజశేఖరానికి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
తిరుపతి: సూళ్లూరుపేటలో ఇటీవల ప్రారంభమైన షాపింగ్ మాల్లో 20 మందికి పైగా ఉద్యోగస్తులను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించారు. దీంతో బాధిత ఉద్యోగస్తులు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం షాపింగ్ మాల్ ముందు నిరసన చేపట్టారు. తమ ఉద్యోగాలను తిరిగి ఇప్పించాలని కోరారు. అయితే తొలగింపునకు కారణాలు తెలియాల్సి ఉంది.