WG: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నరసాపురం డీసీసీబీ బ్రాంచ్ వద్ద సహకార సంఘాల ఉద్యోగులు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు తమ నిరసనను తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని, పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.