W.G: ఆచంట మండలం కొడమంచిలి గ్రామంలో మద్యం బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న ఎస్.వెంకటనారాయణను సోమవారం పాలకొల్లు ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఆరు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు జి.రఘు, పి.మహేశ్లు పాల్గొన్నారు. బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
VZM: రైతులందరికీ భూ ఆధార్ కార్డు తప్పనిసరి అని మండల వ్యవసాయ అధికారిణి పూర్ణిమ సూచించారు. మండలంలోని చంద్రంపేట గ్రామంలో భూ ఆధార్ నంబర్ నమోదు చేసే కార్యక్రమంపై సోమవారం రైతులకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు భూ ఆధార్ నంబర్ పొందాలన్నారు. సదరు ఆధార్ ద్వారా ప్రతి రైతుకు గుర్తింపు నంబర్ ఇవ్వాలని చెప్పారు.
VZM: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పరిష్కరించుకుని ఎస్.కోట మండలం ఎస్జి పేట ప్రభుత్వ పాఠశాలలో ఏఎన్ఎం కృష్ణవేణి సోమవారం పాఠశాల హెచ్ఎం కె బంగారు నాయుడు ఆధ్వర్యంలో 52 మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించాలని, తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.
VZM: పోలీసులు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సోమవారం నిర్వహించిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల పునశ్చరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పోలీసులు విధులు నిర్వహించే సమయంలో అంకితభావం, నిజాయితీతో వ్యవహరించి ప్రజలకు చేరువ కావాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఫిబ్రవరి 10 నుండి 24 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
W.G: ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం పేరాబత్తుల రాజశేఖరం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఏలూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని రాజశేఖరానికి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
తిరుపతి: సూళ్లూరుపేటలో ఇటీవల ప్రారంభమైన షాపింగ్ మాల్లో 20 మందికి పైగా ఉద్యోగస్తులను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించారు. దీంతో బాధిత ఉద్యోగస్తులు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం షాపింగ్ మాల్ ముందు నిరసన చేపట్టారు. తమ ఉద్యోగాలను తిరిగి ఇప్పించాలని కోరారు. అయితే తొలగింపునకు కారణాలు తెలియాల్సి ఉంది.
చిత్తూరు: గంగవరం మండలం ఎర్రమనగుంట చెరువు వద్ద ఆటోలో సోమవారం ఓ వ్యక్తి డెడ్ బాడీ లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా మరెవరైనా హత్య చేసి శవాన్ని అక్కడే వదిలి వెళ్లారా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
CTR: పుంగనూరు ICDS ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న రెండు అంగన్వాడి సహాయకురాలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు CDPO రాజేశ్వరి సోమవారం తెలిపారు. పుంగనూరు అర్బన్ రాంనగర్ అంగన్వాడి సహాయకురాలు (OC) కేటగిరీ, సోమల మండలం ముండ్రివారిపల్లె సహాయకురాలు (BC-D) కేటగిరీలో అవకాశం ఉన్నట్లు తెలిపారు. అర్హులు ఈ నెల 22తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
VZM: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం శ్రీ రామనారాయణంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారాముల వారికి శాంతి కళ్యాణం జరిపారు. ఆలయ అర్చకులు చాణక్య, హర్ష, కృష్ణ తేజ ఆధ్వర్యంలో జరిపిన ఈ కళ్యాణంలో ట్రస్ట్ సభ్యులు శ్రీ నారాయణం సీతారామయ్య, పద్మశ్రీ,నారాయణం శ్రీనివాస్, రామారావు పట్నాయక్ మాస్టర్, భక్తులు పాల్గోన్నారు.
VZM: తెర్లాం మండలం కొరాటం గ్రామంలో ఎంపీపీ పాఠశాలను సోమవారం మండల విద్యాధికారి త్రినాధరావు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా పాఠశాలలో జరుగు అసెంబ్లీ తీరును, విద్యార్థుల యొక్క హాజరు పట్టికను, విద్యా స్థాయిని తనిఖీ చేశారు. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమల తీరును, మరుగుదొడ్లు శుభ్రతను తదితర వాటిని పరిశీలించారు.
అనంతపురం: తాడిపత్రి మండలంలో ఎమ్మేల్యే జేసీ అస్మిత్ రెడ్డి సోమవారం పర్యటించారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, వెంకటంపల్లి గ్రామాలలో అధికారులతో కలిసి గ్రామ సభ నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుంటూ వాటికి వెంటనే పరిష్కార మార్గం చూపాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మండల అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
అనంతపురం: గుత్తి మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. మండల తహశీల్దార్ ఓబులేసుకు భూ సమస్యలపై రైతులు అర్జీలను సమర్పించారు. తహశీల్దార్ మాట్లాడుతూ.. మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు భూ సమస్యలపై అలాగే పట్టణంలోని నిరుపేదలు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని అర్జీలను ఇచ్చారన్నారు. వాటికి త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు.
NLR: రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ సోమవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనంతసాగరం మండల కమిటి ఆధ్వర్యంలో అనంతసాగరం డిప్యూటీ తహసీల్దార్ జ్యోతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. జిల్లాలో వరి కోతలు మార్చి నుంచి ముమ్మరంగా కొనసాగుతాయని, వెంటనే వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని కోరారు.
SKLM: రాష్ట్రంలో ప్రజలకు స్వచ్ఛమైన సురక్షిత త్రాగునీరు అందించేందుకు అప్పటి సీఎం జగనన్న జలజీవన్ మిషన్కు నిధులు కేటాయించి పనులు ప్రారంభించారని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక వారి ఆ సమర్థతను జగన్ మీదకు నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
NLR: అనంతసాగరం మండలం చిలకలమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రధాని మోదీ చేపట్టిన పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని విద్యార్థులు వీక్షించారు. హెచ్ఎం సురేశ్ మాట్లాడుతూ.. విద్యార్థులలో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని మోదీ ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.