• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సీఎం గీసిన చిత్రాన్ని కొనుగోలు చేసిన ఉపసభాపతి

KKD: రాజమండ్రిలో శుక్రవారం నిర్వహించిన అమరావతి కళా వీధి ప్రదర్శనలో సీఎం నారా చంద్రబాబు స్వయంగా చిత్రీకరించిన బుద్ధుడి చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్ర పటానికి ఉప సభాపతి కె. రఘు రామకృష్ణంరాజు రూ. 1,01,116లు చెల్లించి శుక్రవారం కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చిత్రీకరించిన బుద్ధుడిని తాను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.

April 4, 2025 / 04:30 PM IST

రావులపాలెం అదనపు ఎస్సైగా రమణారెడ్డి

కోనసీమ: ఆలమూరు పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రమణారెడ్డి ఎస్సైగా పదోన్నతి పొందారు. ఇటీవల ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఉత్తర్వులు మేరకు పదోన్నతి లభించడంతో కోనసీమ జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు… రమణారెడ్డిని రావులపాలెం అదనపు ఎస్సైగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం రమణారెడ్డి రావులపాలెం అదనపు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు.

April 4, 2025 / 04:07 PM IST

పల్లె పండగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

E.G: గండేపల్లి మండలం మురారి గ్రామంలో శుక్రవారం పల్లె పండగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు పాల్గొని రూ.1.5 కోట్లతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్, జడ్ రాగంపేట సర్పంచ్ కందుల చిట్టిబాబు, గ్రామస్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

April 4, 2025 / 03:45 PM IST

వైభవంగా అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

కోనసీమ: మామిడికుదురు పెరెళ్ల కాలువ గట్టు వద్ద ఉన్న రామాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం వైభవంగా జరిగింది. అర్చకులు సుదర్శనం వెంకట శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్వామికి తమలపాకులు, గంధ సింధూరంతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు.

April 4, 2025 / 03:30 PM IST

రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

TPT: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. శుక్రవారం తిరుపతి గ్రామీణ మండలం దుర్గ సముద్రంలో రైతులకు రాయితీపై పనిముట్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రాయితీపై ఎరువులు, పనిముట్లు పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు.

April 4, 2025 / 02:20 PM IST

ఎంపీని కలిసిన కడప జెడ్పీ ఛైర్మన్

KDP: హైదరాబాదులో ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో శుక్రవారం ఆయనను జిల్లా జెడ్పీ ఛైర్మన్ ముత్యాల రామ గోవిందు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.  కడప జెడ్పీ ఛైర్మన్‌గా సహాయ సహకారాలు అందించిన ఎంపీ అవినాష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎంపీ అవినాష్‌ను శాలువ, పూలమాలతో సత్కరించారు. ఈయన వెంట సంబుటూరు ప్రసాద్ రెడ్డి ఉన్నారు.

April 4, 2025 / 02:10 PM IST

‘వైసీపీ కార్యాలయం ఏర్పాటుకు స్థల పరిశీలిన’

KDP: ముద్దనూరు మండల కేంద్రంలో ఎర్రగుంట్ల పోయే రోడ్డు పక్కన వైసీపీ నూతన కార్యాలయం ఏర్పాటుకు జమ్మలమడుగు మాజీ MLA డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ముద్దనూరు, ఎర్రగుంట్ల మండల వైసీపీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, జయరాంరెడ్డి, సన్నీ, మణికంఠ రెడ్డి పాల్గొన్నారు.

April 4, 2025 / 02:07 PM IST

‘రెడ్డి రాజుల మృతి పార్టీకి తీరని లోటు’

అన్నమయ్య: రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ మచ్చు వారి పల్లెకు చెందిన వైసీపీ నేత రెడ్డి రాజులు ఆకస్మిక మరణం చెందారు. ఆ పార్టీ నియోజకవర్గం ఇంఛార్జి నిస్సార్ అహ్మద్ ఆయన భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. రెడ్డి రాజుల మృతి పార్టీకి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు.

April 4, 2025 / 02:05 PM IST

అమ్మవారి ఆలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు

ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం అవోపా వారి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. అవోపా ప్రెసిడెంట్ రాము మాట్లాడుతూ.. వేసవికాలంలో ప్రజల సౌకర్యార్థం ఈ ఉచిత చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. చలివేంద్రం మొదటి రోజు మజ్జిగను పంపిణీ చేశారు. ముందుగా అమ్మవారి చిత్రపటానికి పూజలు చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు.

April 4, 2025 / 01:53 PM IST

వాల్మీకిపురంలో మాజీ సైనికులు ధర్నా

అన్నమయ్య: వాల్మీకిపురం పట్టణంలో శుక్రవారం మాజీ సైనికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. వాయల్పాడు, మదనపల్లె మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు రవి, కంచర్ల శ్రీ నాయుడు మాట్లాడుతూ.. మాజీ సైనికుడి కుమారుడు వెంకటాద్రిపై వేధింపులకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

April 4, 2025 / 01:33 PM IST

విద్యుత్ సిబ్బంది మృతిపై మంత్రి దిగ్భ్రాంతి

BPT: బాపట్ల జిల్లా కొల్లూరులో విద్యుత్ సిబ్బంది మృతిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా సిబ్బంది చనిపోవడంపై విచారకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తునకు ఆదేశించారు.

April 4, 2025 / 11:15 AM IST

పల్నాడు జిల్లాలో ఒకరి హత్య

PLD: మాచర్ల నియోజకవర్గ పరిధిలో హరిచంద్ర అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఆయన మృతదేహం పొలంలో ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. కాగా రెండు రోజుల క్రితం నాగార్జున్ సాగర్ హిల్ కాలనీలో హరిచంద్ర కిడ్నాప్‌కు గురయ్యారు. రెండు రోజుల తర్వాత ఆయన శవమై కనిపించారు. పోలీసులు తమకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

April 4, 2025 / 11:07 AM IST

గల్లంతైన మృతదేహం లభ్యం

ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎర్రకాలువలో గల్లంతైన చల్లా బసవయ్య(70) మృతదేహం ఇవాళ ఉదయం లభ్యమైంది.  గురువారం సాయంత్రం గేదెలను కడగటానికి నీటిలోకి దిగి ఊబిలో కూరుకుపోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై శశాంక్ గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు.

April 4, 2025 / 11:02 AM IST

మాకవరపాలెం ఎంపీపీగా రుత్తల సర్వేశ్వరరావు బాధ్యతలు

అనకాపల్లి: మాకవరపాలెం నూతన ఎంపీపీగా రుత్తల సర్వేశ్వరరావు(సర్వం) శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ హాజరయ్యారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీ మాట్లాడుతూ.. మండలాభివృద్ధికి  తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

April 4, 2025 / 10:59 AM IST

నరసరావుపేట పోస్టల్ కార్యాలయం ఎదుట ఆందోళన

PLD: నరసరావుపేట పోస్టల్ కార్యాలయం ఎదుట తమ సమస్యలు పరిష్కరించాలని ఆ శాఖ విశ్రాంత ఉద్యోగులు శుక్రవారం ఆందోళనకు దిగారు. పాత పెన్షన్ విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు. కోవిడ్ కాలంలో ఆపిన మూడు డీఏలు చెల్లించాలన్నారు. గుర్తింపు లేని ఆసుపత్రులు అందుబాటులో లేకుంటే మెడికల్ అలవెన్స్ పెన్షనర్లకు ఇవ్వాలన్నారు.

April 4, 2025 / 10:49 AM IST