• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రైతుకు కన్నీళ్లు మిగిల్చిన వర్షం

KDP: కాశినాయన మండలంలో గురువారం భారీ ఈదురు గాలులు బీభత్సం సృష్టించింది. గ్రామాలలో పెద్ద పెద్ద వృక్షాలు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఆరు కాలం కుటుంబం మొత్తం శ్రమించి, చేతికంది వచ్చిన అరటి తోటలు నేలమట్టం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరారు.

May 2, 2025 / 07:32 AM IST

850 బస్సులు.. 51 వేల జనం

కృష్ణా: నేడు అమరావతి రాజధాని పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో హాజరయ్యే ప్రజల కోసం కృష్ణా జిల్లా నుంచి ప్రైవేటు, ఆర్టీసీ 850 బస్సులను సిద్ధం చేశారు. ప్రయాణికులకు తాగునీరు, భోజన ఏర్పాట్లు కూడా చేశారు. సుమారుగా జిల్లా నుంచి 51వేల మంది తరలి వెళ్లనున్నట్లు సమాచారం.

May 2, 2025 / 07:29 AM IST

భారీ బందోబస్తు.. ప్రత్యేక సాఫ్ట్వేర్‌తో నిఘా

GNTR: అమరావతి రాజధాని పునఃప్రారంభ సభ నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. సుమారు 6,500మందిపైగా వివిధ విభాగాల పోలీస్ అధికారులు సిబ్బందితో బందోబస్తు చేశామన్నారు. 250సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. ‘అస్త్రం’ అనే ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ టెక్నాలజీతో ట్రాఫిక్, ప్రజల రద్దీని పర్యవేక్షిస్తున్నామన్నారు.

May 2, 2025 / 07:23 AM IST

మాజీ మంత్రి నారాయణస్వామి రేపటి పర్యటన వివరాలు

చిత్తూరు: నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి శుక్రవారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 11కు జీడి నెల్లూరు మండలం బుగ్గపట్నం కుప్పమ్మ దేవస్థానంలో ఎంపీపీ అనిత, సర్పంచ్ ముని రాజారెడ్డి ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారని తెలిపారు. 12 గంటలకు పెనుమూరు మండలం కండిగ గ్రామంలో పర్యటిస్తారని వెల్లడించారు.

May 1, 2025 / 07:59 PM IST

జిల్లా నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ప్రకాశం: జిల్లాలో ఇంటర్, డిప్లమో, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన నిరుద్యోగులకు శ్రీ హర్షిని డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో రేపు అనగా ఆదివారం మెగా క్యాంపస్ డ్రైవ్ నిర్వహించుచున్నారు. కావున నిరుద్యోగులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా శ్రీహర్షిని విద్యాసంస్థల ఛైర్మన్ గోరంట్ల రవికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

May 1, 2025 / 06:55 PM IST

భూసేకరణకు వ్యతిరేకంగా గ్రామస్తుల నిరసన

తిరుపతి: ప్రత్యేక ఆర్థిక మండలిలో ఎలీ కంపెనీ కోసం ఏపీఐఐసీ నిర్వహిస్తున్న భూసేకరణ సర్వేను సత్యవేడు నియోజకవర్గం కొల్లడం గ్రామస్తులు అడ్డుకున్నారు. భూసేకరణను నిలిపివేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ప్రధాన రహదారిలో బైఠాయించి పెట్రోల్ బాటిళ్లతో సర్వేయర్ల ఎదుట నిరసన తెలిపారు. తమ భూములను కాపాడుకునేందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

May 1, 2025 / 06:45 PM IST

ఆ రెండు బావులు పూడ్చండి

PPM: చినమరికి గ్రామంలో గల రెండు బావులలో చెత్తా, చెదారం పిచ్చి మొక్కలు దట్టంగా, పేరుకుపోవడంతో ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా ఉన్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ మేరకు ఆ రెండు బావులు పూడ్చాలని, వాటి స్థానంలో రెండు చేతి బోర్లు వేయాలన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.

May 1, 2025 / 05:11 PM IST

గోడకూలిన ఘటన కలచివేసింది

VSP: సింహాచలం చందనోత్సవంలో గోడకూలిన ఘటన తనను ఎంతగానో కాలచివేసిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ గురువారం అన్నారు. మద్దిలపాలెం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కొంతమంది అవినీతి అధికారులు సింహాచల దేవస్థానంలో తిష్టవేసుకుని ఉన్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

May 1, 2025 / 05:11 PM IST

జీడి ఉత్పత్తిదారుల సంఘం నూతన కోశాధికారి ఎంపిక

SKLM: ఇటీవల జీడీ ఉత్పత్తిదారుల సంఘము పారిశ్రామికవాడ కార్యవర్గమంలో ఒకరైన కోశాధికారి శాసనపురి శ్రీనివాసరావు అకాల మరణము చెందిన విషయం తెలిసిందే. నూతన కోశాధికారి ఎంపిక నిమిత్తం సర్వ్యసభ్య సమావేశంను గురువారం ఏర్పాటు చేశారు. సంఘ సభ్యులు యువకులు కొంచడా వినయ్‌ని ఏకగ్రీవంగా ఎంపికచేయడం జరిగినది. ఈ సందర్భంగా నూతన కోశాధికారి వినయ్‌ను సంఘ సభ్యుల అభినందించారు.

May 1, 2025 / 05:07 PM IST

వేగంగా పింఛన్ల పంపిణీ

ప్రకాశం: అద్దంకి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఉదయం 6 గంటల నుంచి పింఛన్ పంపిణీ చేసినట్లు అద్దంకి ఎంపీడీవో సింగయ్య తెలిపారు. గురువారం అద్దంకిలో ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఇప్పటివరకు 6,915 పింఛన్లకు 6,325 మందికి పింఛన్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. గురువారం తీసుకోని వారికి శుక్రవారం పింఛను అందజేస్తామన్నారు.

May 1, 2025 / 03:07 PM IST

గన్నవరంలో హోం మంత్రి సమావేశం

కృష్ణ: ఆంధ్రుల రాజధాని అమరావతి కల త్వరలోనే సహకారం కానుందని హోంమంత్రి అనిత అన్నారు. గురువారం గన్నవరం నియోజకవర్గంలోని నిడమానూరులో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నేతృత్వంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు అమరావతి పునర్నిర్మాణ పనులు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. 

May 1, 2025 / 01:29 PM IST

ఇద్దరు దొంగలు అరెస్ట్.. 16 బైక్ లు స్వాధీనం

విజయవాడ పటమటలో ద్విచక్ర వాహనల దొంగలను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.10లక్షల విలువ చేసే 16 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ దామోదర్ తెలిపారు. వాహన తనిఖీల్లో భాగంగా అనుమానస్పదంగా ప్రవర్తించిన ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ చెప్పారు. దుండగులు మోపిదేవికి చెందిన ప్రసాద్, కానూరుకు చెందిన రబ్బానీగా గుర్తించామన్నారు.

May 1, 2025 / 01:22 PM IST

6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల

NTR: రాష్ట్రంలోని 164 ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశానికి జరిగిన ప్రవేశ పరీక్ష ఫలితాలను బుధవారం జాయింట్ డైరెక్టర్ తెహ్రీ సుల్తానా విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21న రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం, రెడ్డిగూడెంలో ఈ ఆదర్శ పాఠశాలలు ఉన్న సంగతి విధితమే. మెరిట్ లిస్ట్ తయారు చేసి ప్రకటించవలసినదిగా DEO ఉత్తర్వులు జారీ చేశారు.

May 1, 2025 / 01:14 PM IST

కార్మికుల సంక్షేమమే సీఎం లక్ష్యం: మంత్రి సవిత

సత్యసాయి: కార్మికుల సంక్షేమమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. గురువారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన మే డే ఉత్సవాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేసి ర్యాలీలో పాల్గొన్నారు. సంపద సృష్టికి మూలమైన కార్మికుల క్షేమం, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.

May 1, 2025 / 01:07 PM IST

‘పెన్షన్లను సద్వినియోగం చేసుకోండి’

BPT: బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని భీమావారి పాలెంలో గురువారం జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. భీమావారి పాలెంలోని వృద్ధులు, వికలాంగుల ఇళ్లకు వెళ్లి సిబ్బందితో కలిసి పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

May 1, 2025 / 12:40 PM IST