KRNL: పత్తికొండలో కౌలు రైతును ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రామచంద్రయ్య డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆదోని రోడ్డులోని కౌలు రైతు పక్కీరప్పకు చెందిన రూ 5 లక్షలు విలువ చేసే పశుగ్రాశం అగ్ని ప్రమాదానికి గురై కాలిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న రామచంద్రయ్య ఇవాళ కౌలు రైతును పరామర్శించారు.
VZM: బొండపల్లి మండలం దేవుపల్లిలో శనివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మక ‘ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్’ ఏర్పాటుతో జిల్లా దశ మారుతుందన్నారు. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అందుతాయని పేర్కొన్నారు. ఈనెల 23న ప్లాంట్కు శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు.
E.G: గోకవరం మండలంలో కురుస్తున్న అకాల వర్షాలతో దాళ్వా వరి పంటకు మాగుడు, మానిపండు తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని మండల వ్యవసాయాధికారి పీ. రాజేశ్వరి హెచ్చరించారు. గింజ పాలు పోసుకునే దశలో ధాన్యం రంగు మారకుండా ఉండాలంటే, నివారణకు ఎకరానికి 200 మి.లీ. ప్రాపిక్రోనజోల్ పిచికారీ చేయాలని ఆమె సూచించారు. రైతులు అప్రమత్తంగా ఉండి పంటను కాపాడుకోవాలని కోరారు.
కోనసీమ: అమలాపురం(మం) కామనగరువు గ్రామ శివార్లలో పేకాట శిబిరంపై రూరల్ ఎస్సై శేఖర్ బాబు శనివారం దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు జూదగాళ్ళను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 52 పేకాట కార్డులతో పాటు రూ. 4,150 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని తేల్చి చెప్పారు.
TPT: ఈనెల 30న చంద్రబాబు నాయుడుపేట పర్యటన ఖరారు అయింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ ఈ టూర్ను ఈసారి ఫైనల్ చేసినట్లు అధికారులు తెలిపారు. పర్యటన ఏర్పాట్లను జిల్లా అధికారులు, కో-ఆర్డినేటర్ బృందం సమీక్షిస్తున్నాయి. పూదూరు సమీపంలోని టిడ్కో గృహ సముదాయం, ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం ప్రారంభించనున్నారు.
VSP: వైసీపీ ఎస్సీ విభాగ పరిశీలకురాలిగా గండి భాగ్యవతి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ అధ్యక్షుడు కేకే రాజును కలిశారు. ఎస్సీ విభాగాన్ని బలోపేతం చేయడానికి వార్డు, సచివాలయం స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి సమన్వయంతో పని చేయాలని కేకే రాజు ఆమెకు సూచించారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.
NTR: చందర్లపాడు మండలం కోనయాపాలెం సొసైటీలో రైతుల అభివృద్ధి, వ్యవసాయ బలోపేతానికి పెద్దపీట వేస్తూ రూ.1.30 కోట్ల రుణ పంపిణీ చెక్కులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రైతులకు పంపిణీ చేశారు. రైతే దేశానికి వెన్నెముక అని, రైతు అభ్యున్నతే రాష్ట్రాభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చే ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని కోరారు.
CTR: తవణంపల్లె మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీమోహన్ శనివారం ప్రారంభోత్సవం చేశారు. వెంగంపల్లి, గోవిందరెడ్డి పల్లె, ఏ గొల్లపల్లె గ్రామాలలో నూతన అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించారు. ఏ గొల్లపల్లిలో స్మశాన వాటిక ప్రహరీని ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పనకు తగిన ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు.
అనంతపురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షుడు రాజేష్ కురుబ అధ్యక్షతన SIRపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి మధుసూదన్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు సందిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన నాయకులకు రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.
అన్నమయ్య: రాయచోటి వాసవి క్లబ్ వనితల ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, 111 మంది ముత్తయిదువులకు వడి బియ్యం అందజేశారు. ముందుగా అమ్మవారికి ఒడిబియ్యం కట్టి అనంతరం మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు భారీగా పాల్గొన్నారు. పూర్వ అధ్యక్షురాలు మాధవి లత, ప్రస్తుత అధ్యక్షురాలు ఉమామహేశ్వరి ఈ సేవా కార్యక్రమంపై సంతోషం వ్యక్తం చేశారు.
VZM: పశ్చిమాసియాలో యుద్ధం సమసిపోయి, ప్రపంచంలో శాంతి నెలకొనాలని అంకాంక్షిస్తూ ముస్లిం సోదరులు ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 30 రోజులు పాటు కఠోరమైన ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులు శనివారం నెలవంక ఉషోదయంతో దీక్షను విరమించి రంజాన్ పండగను ఘనంగా జరుపుకొన్నారు. RTC కాంప్లెక్స్ సమీపంలో గల అతి పెద్ద ఈద్గాల్లో అందరూ కలిసి సామూహిక ప్రార్థనలు చేశారు.
SKLM: సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో పాతపట్నం నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
E.G: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను సమూలంగా పరిష్కరించి యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. శనివారం రాజానగరంలో ఆయన మాట్లాడుతూ.. యువత భవిష్యత్తు బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు.
KDP: గండి క్షేత్రం అర్చకులపై మాజీ ఛైర్మన్ రాజారావు తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బుల కోసం నైవేద్యం పెట్టకుండా అపచారం చేస్తున్నారని, క్షేత్రంలో అవినీతి తాండవం ఆడుతోందని విమర్శించారు. పూలమాలలు తిరిగి విక్రయించడం, తాయతులు అమ్మకం వంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అర్చకుల ఆస్తులపై విచారణ జరిపించాలని, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
AKP: నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్కు ఈనెల 23న శంకుస్థాపన జరుగుతున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో పండగ చేసుకోవాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక జడ్పీ అతిథి గృహంలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై కూటమి ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గం నుంచి ప్రజలను తరలించేందుకు 50 బస్సులు కేటాయించినట్లు తెలిపారు.