• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గుర్తుతెలియని మృతదేహానికి అంత్యక్రియలు 

PLD: వినుకొండలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహానికి మానవ సేవా సమితి సభ్యులు అంతక్రియలు చేసి మానవత్వం చాటుకున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అనాధ శవానికి అంతక్రియలు చేసేందుకు మాజీ కౌన్సిలర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, మానవ సేవా సమితి అధ్యక్షుడు పీవీ సురేశ్ బాబు ఆధ్వర్యంలో హెల్పింగ్ హార్డ్ సంస్థ సభ్యులు ముందుకొచారు.

April 4, 2025 / 07:08 AM IST

కారు ఢీకొని వ్యక్తి మృతి

ప్రకాశం: టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో కారు ఢీకొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి గురువారం రాత్రి మృతి చెందాడు. సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిని కారు ఢీకొనడంతో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను పెట్రోలింగ్ పోలీసులు స్థానిక టంగుటూరు ఎస్సైకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 4, 2025 / 06:18 AM IST

నేడు గుంటూరులో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటన

GNTR: మంత్రి గుమ్మడి సంధ్యారాణి శుక్రవారం గుంటూరులో పర్యటించనున్నారు. ఈ మేరకు మహిళా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌ని మంత్రి ప్రారంభిస్తారు. అదే విధంగా మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. 

April 4, 2025 / 06:06 AM IST

అమరావతికి మోదీ రాక.. ఏర్పాట్లు షురూ

GNTR: అమరావతి రాజధాని ప్రాంతానికి PM మోదీ ఈనెలలో రానున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు SP సతీశ్ గురువారం వెలగపూడి సచివాలయం సమీపంలో హెలిప్యాడ్లు ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా మోదీ రాక కోసం మూడు హెలిప్యాడ్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

April 4, 2025 / 05:32 AM IST

బెల్లం వ్యాపారులపై ఎక్సైజ్ శాఖ నిఘా

బాపట్ల: నాటుసారా తయారీలో ఉపయోగించే నల్లబెల్లం విక్రయాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని చీరాల ఎక్సైజ్ సీఐ పేరం నాగేశ్వరరావు బెల్లం వ్యాపారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన తన ఆఫీస్‌లో బెల్లం వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. నాటుసారా తయారీ నివారణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, బెల్లం వ్యాపారులపై కూడా నిఘా ఉంటుందని సీఐ వారికి స్పష్టం చేశారు.

April 4, 2025 / 05:16 AM IST

ట్రాంజెండర్‌కు సీఐ హెచ్చరికలు

GNTR: తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం గ్రామ శివార్లలో జాతీయ రహదారికి సమీపంలో వాహన దారులను ఇబ్బంది పెడుతున్న ఓ ట్రాంజెండర్‌కు తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు హెచ్చరిక జారీ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ట్రాన్సజెండర్‌కు గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఎవరైనా ట్రాన్సజెండర్స్ అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటారని వెల్లడించారు. 

April 4, 2025 / 04:08 AM IST

దొంగతనాలను అరికట్టడానికి సూచనలు

BPT: వేసవి సెలవుల సమయంలో ఇళ్లలో దొంగతనాలు జరుగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ తుషార్ గురువారం సూచించారు. విహార యాత్రలకు వెళ్లే వారు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని తెలిపారు. పోలీసులకు సమాచారం అందిస్తే నిరంతర నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

April 3, 2025 / 08:17 PM IST

పన్ను వసూళ్లులో మండపేట టాప్

కోనసీమ: ఆస్తి పన్ను వసూళ్లులో మండపేట పురపాలక సంఘం కోనసీమ జిల్లాలో ప్రథమ స్థానం, రాష్ట్ర స్థాయిలో పదవ స్థానం సాధించిందని మున్సిపల్ ఛైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి తెలిపారు. పన్ను వసూళ్లు చేయడంలో మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు చేసిన కృషిని అభినందించారు. గురువారం ఆమె ఛాంబర్‌లో ఆయన్ను ఘనంగా సత్కరించారు. ప్రభుత్వాలు నడవాలంటే పన్నులు వసూలు కీలకమన్నారు.

April 3, 2025 / 08:14 PM IST

నిధులతో సమ్మర్ కార్యాచరణ ప్రణాళిక

ELR: ఉంగుటూరు రూ.44 లక్షల 80 వేల నిధులతో సమ్మర్ కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామని ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో  పంచాయతీ కార్యదర్శులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సర్పంచ్లతో వేసవిలో తాగునీరు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ కోరారు.

April 3, 2025 / 08:14 PM IST

విద్యార్థులు చదువుపై దృష్టిపెట్టాలి

VZM: కొత్తవలస పట్టణ పరిధిలో ఉన్న ఒక పాఠశాలలో 7, 8, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చెడు వ్యసనాల, వాటి అనర్ధాలపై పట్టణ సీఐ ఎస్. షణ్ముఖరావు విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. ప్రస్తుత పోటీతత్వంలో విద్యార్థులు కష్టపడి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోని, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని హితవు పలికారు.

April 3, 2025 / 08:11 PM IST

‘10.24 లక్షల నష్ట పరిహారం అందజేత’

TPT: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాలెం, చంద్రగిరి మండలాలకు చెందిన 64 మంది రైతులు ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయారు. వారికి పరిహారంగా 10.24 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని గురువారం ఎమ్మెల్యే పులివర్తి నాని అందించారు. ఈ సందర్భంగా రైతులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

April 3, 2025 / 08:07 PM IST

పుంగనూరులోని దుకాణాలలో తనిఖీలు 

CTR: ప్లాస్టిక్ కవర్ల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలో ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేసి వాటి వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించారు.

April 3, 2025 / 08:00 PM IST

10 మందిపై కేసు నమోదు

SS: సోమందేపల్లి మండలం పోలేపల్లిలో వివాహిత లలిత(36)పై 10 మంది హత్యాయత్నం చేశారని బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. 10 మందిపై 307 సెక్షన్ కింద పెట్టామని, మహిళల పట్ల ఎవరైన అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.

April 3, 2025 / 07:52 PM IST

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి

NLR: కందుకూరులోని జనార్ధన్ కాలనీలో ఉర్దూ స్కూల్ వద్ద రూ.35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు గురువారం ప్రారంభించారు. దాంతోపాటు పుట్ట ఏరియాలో రూ.14 లక్షలతో నిర్మించనున్న మురుగు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు, TDPముస్లిం మైనార్టీ పాల్గొన్నారు.

April 3, 2025 / 07:31 PM IST

సోమశిల ఆప్రాన్ నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి

NLR: సోమశిల ప్రాజెక్టు ఆప్రాన్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం సోమశిల ప్రాజెక్టు ఎస్ఈని కలిసి వినతి పత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమశిల డ్యామ్‌ను సందర్శించి జూలై చివరి లోపల ఆప్రాన్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించిన పూర్తి కాలేదన్నారు.

April 3, 2025 / 07:15 PM IST