అన్నమయ్య: రాయచోటి వాసవి క్లబ్ వనితల ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, 111 మంది ముత్తయిదువులకు వడి బియ్యం అందజేశారు. ముందుగా అమ్మవారికి ఒడిబియ్యం కట్టి అనంతరం మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు భారీగా పాల్గొన్నారు. పూర్వ అధ్యక్షురాలు మాధవి లత, ప్రస్తుత అధ్యక్షురాలు ఉమామహేశ్వరి ఈ సేవా కార్యక్రమంపై సంతోషం వ్యక్తం చేశారు.